అన్వేషించండి

Dashavatar Temple: దశావతారాల్లో ఏడు అవతార ఆలయాలు ఏపీలోనే ఉన్నాయ్.. ఎక్కడున్నాయ్ , మీరెన్ని దర్శించుకున్నారు!

Dashavatar Temple In Andhra Pradesh:   శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడు అవతారాల ఆలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయ్. అవి ఎక్కడున్నాయి..వాటిలో మీరెన్ని దర్శించుకున్నారు..

 Most Important Temples of Lord Vishnu and His Avatars:  పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణ, దుష్టశిక్షణ కోసం ఎన్నో అవతారాల్లో కనిపించాడు. వాటిని ఏకవింశతి ( 21) అవతారాలు అంటారు. వాటిలో అతి ముఖ్యమైనవి 10..వాటినే దశావతారాలు అని పిలుస్తారు. 

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అర్జునా! ధర్మానికి హాని కలిగినప్పుడును, ఆధర్మం పెరిగిపోయినప్పుడు... సత్పురుషులను పరిరక్షించేందుకు, దుష్టులను రూపుమాపేందుకు , ధర్మాన్ని సుస్థిరం చేసేందుకు నేను ప్రతియుగంలో అవతరిస్తాను.

భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఙాన, కర్మ సన్యాస యోగంలోది ఈ శ్లోకం. వ్యాసుడు లాంటి అంశావతారం, నారసింహుడు లాంటి పూర్ణావతారం, తిరుమల వేంకటేశ్వరుడులా అర్చావతారాలున్నాయి . వీటిలో దశావతారాలు ప్రధానమైనవి. ఈ 10 అవతారాల్లో ఏడు అవతారాలకు సంబంధించిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.

Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు

మత్సావతారం  

దశావతారాలలో మొదటిది అయిన మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువు కొలువైన ఆలయం నాగలాపురంలో ఉంది. దీనినే వేదనారాయణ ఆలయం లేదా మత్స్య నారాయణ ఆలయం అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుమత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన ఈ  క్షేత్రం తిరుపతికి 68 కిలోమీటర్ల దూరం, మద్రాసుకి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో  స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు స్వామికి అభిముఖంగా కనిపిస్తారు. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన ప్రదేశం కావడంతో వేదపురిగా ప్రసిద్ధిచెందింది. 

కూర్మావతారం 

శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది కానీ కూర్మావతారం ఆంతర్యం వేరు. క్షీరసాగర మధనంలో కిందకు కుంగిపోతున్న పర్వతాన్ని తన భుజాలపై మోస్తూ దేవదానవులకు సహకరించేందుకు ధరించిన అవతారం ఇది. ఈ అవతారంలో స్వామివారు పూజలందుకుంటున్న ఆలయం శ్రీ కూర్మం. విష్ణువు కూర్మ రూపంలో పూజలందుకుంటున్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకూర్మం. 
 
వరాహఅవతారం 

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మూడోది వరాహావతారం. హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీశాడు. అనంతరం తిరుమల గిరులపై సంచరించినట్టు పురాణాల్లో ఉంది. అందుకు నిదర్శనమే తిరుమల కొండపై ఉన్న భూ వరాహ స్వామి ఆలయం. ఈ రూపంలో ఉన్న విష్ణువును ఆరాధిస్తే భూగృహ యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.  

Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే

నారసింహ అవతారం 

నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారం, నృసింహావతారం, నరహరి, నరసింహమూర్తి, నారసింహుడు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారాన్ని వర్ణించే నామాలే.ఈ అవతారంలో  శ్రీ మహావిష్ణువు  సగం నరుడు, సగం సింహం రూపంలో దర్శనమిస్తారు. అందుకే నారసింహ క్షేత్రాలు  మహిమాన్వితం. సింహాద్రి, అహోబిలం, మంగళగిరి, వేదాద్రి, మాల్యాది, అంతర్వేది, వరాహ నారసింహస్వామి, పెంచలకోన..ఇలా ఏపీలో ప్రతి జిల్లాలోనూ నారసింహ క్షేత్రాలున్నాయి

వామన అవతారం 

దశావతారాల్లో ఒకటైన వామనావతార ఆలయం ఏపీలో ప్రకాశం జిల్లా బాపట్ల సమీపంలో చెరుకూరు గ్రామంలో ఉంది. ఇక్కడ త్రివిక్రమ వామన స్వామిగా పూజలందుకుంటున్నారు శ్రీ మహావిష్ణువు. చోళులు, పల్లవులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు శాసనాలున్నాయి.  
 
పరశురామ అవతారం 

శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరోది. దీనిని ఆవేశ అవతారం అంటారు. త్రేతాయుగము ఆరంభములో వచ్చిన అవతారం ఇది. అధికార బలంతో విర్రవీగే క్షత్రియులను శిక్షించిన అవతారం. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఈ ఆలయం శ్రీకాకుళం - ఒడిశా మధ్యలో ఉన్న మహేంద్రపర్వతంపై ఉంది.  

ఇక శ్రీరాముడు..శ్రీ కృష్ణుడు పుట్టుక పాలన అంతా ఉత్తరాదినే...

కలియుగ ప్రత్యక్ష దైవం

కలియుగానికి ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల కూడా ఆంధ్రప్రదేశ్. తిరుమల క్షేత్రం గురించి ప్రత్యేకంగా భక్తులకు పరిచయం అవసరం లేదు.

Also Read: 'అమ్మకు ప్రేమతో' శ్రీ కృష్ణదేవరాయలు తీర్చిదిద్దిన ఆలయం, ఆ గ్రామానికి తన తల్లి పేరే పెట్టిన రాయలువారు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Thaman : 'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Thaman : 'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
Embed widget