Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bangladesh Protest: బంగ్లాదేశ్లో అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారత రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి.

Bangladesh Protest: బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. వీధుల్లో విధ్వంసం, రాళ్ల దాడి కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం బయట నిరసనలు, రాళ్ల దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని 2 మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మీడియా సంస్థల కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఢాకా సహా బంగ్లాదేశ్లోని వివిధ నగరాల్లోనూ రాత్రంతా విధ్వంసం కొనసాగింది. హసీనా వ్యతిరేక విద్యార్థి నాయకుడి మరణంతో బంగ్లాదేశ్ అంతటా ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఇంకిలాబ్ వేదిక కన్వీనర్ ఉస్మాన్ హదీ మరణంపై మహ్మద్ యూనుస్ సంతాపం ప్రకటించారు. శనివారం సంతాప దినంగా పాటించాలని ఆయన తెలిపారు. ఆ రోజు దేశంలోని అన్ని ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థలు, విద్యా సంస్థలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో జాతీయ జెండాను అవనతం చేస్తారు. రేపు దేశంలోని ప్రతి మసీదులో ఉస్మాన్ హదీ కోసం ప్రార్థనలు జరుగుతాయి. డిసెంబర్ 12న బంగ్లాదేశ్లో హదీపై కాల్పులు జరిగాయి. అవామీ లీగ్, భారత్ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా ఆయన ఇటీవల వార్తల్లోకి వచ్చారు.
Media offices torched, journalists targeted; uneasy calm in Dhaka after night of violent riot following Osman Hadi's death
— ANI Digital (@ani_digital) December 19, 2025
Read @ANI Story | https://t.co/dnZd8983kg#Bangladesh #SharifOsmanbinHadi #TheDailyStar #BangladeshUnrest pic.twitter.com/lO90dToOMj
బంగ్లాదేశ్లోని ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాజ్షాహి, ఖుల్నాలోని రెండు భారత వీసా దరఖాస్తు కేంద్రాలను మూసివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్షాహిలో నిరసనకారులు భారత హైకమిషన్ వైపు వెళ్లడం ప్రారంభించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.
Protests erupt in Bangladesh post activist's death, major media offices set ablaze
— ANI Digital (@ani_digital) December 18, 2025
Read @ANI Story | https://t.co/TILkdTqn8K#Bangladesh #protest #SharifOsmanBinHadi pic.twitter.com/5K6BkoyCbr
ఇటీవల బంగ్లాదేశ్లో భారత ప్రయోజనాలు, దౌత్య కార్యాలయాలకు సంబంధించిన అనేక ఆందోళనకరమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషనర్ మహ్మద్ రియాజ్ హమీదుల్లాను పిలిపించి, భారత్ తీవ్ర దౌత్య నిరసన తెలిపింది.
యూనుస్ ప్రభుత్వం ఆరోపిస్తూ, అధికారం కోల్పోయిన ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విద్యార్థి సంఘం, ఛాత్రలీగ్ కార్యకర్త హదీపై కాల్పులు జరిపారని తెలిపింది. గురువారం రాత్రి సుమారు 9:45 గంటలకు ఆయన మరణ వార్త తెలియగానే ఢాకాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షాబాగ్ వద్ద వేలాది మంది ప్రజలు గుమిగూడారని పేర్కొంది.
#WATCH | Bangladesh: Visuals of the aftermath from Prothom Alo office in Dhaka, which was burned down by protesters last night. Firefighters are present at the spot.
— ANI (@ANI) December 19, 2025
After the death of Osman Hadi, a key leader in the protests against Sheikh Hasina, Bangladesh has erupted in… pic.twitter.com/94TBiKabtd
మదర్సా ఉపాధ్యాయుడి కుమారుడు హదీ, నెసారాబాద్ కమీల్ మదర్సాలో చదువుకున్న తర్వాత ఢాకా విశ్వవిద్యాలయంలో పౌరశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసి, ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. రాబోయే జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని హదీ భావించారు.





















