అన్వేషించండి

Brahma Muhurtam: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...

మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడయ్యే సమయం అది. అందుకే శుభకార్యాలు, పూజలు, వ్రతాలకి బ్రహ్మ ముహూర్తం మంచిదని చెబుతారు. ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఈ ముహుర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?


బ్రహ్మ ముహూర్తం అనే మాట అందరూ వినేఉంటారు. కానీ దీనికి సరైన అర్థం తెలుసా? సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మీ అంటే సరస్వతి. మనలోని బుద్ధి ప్రభోదం చెందే కాలం కాబట్టి బ్రహ్మీముహూర్తం అని అంటారు.


Brahma Muhurtam: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...

బ్రహ్మముహుర్తాన్ని పూర్వ కాలంలో ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు.  అహోరాత్రంకు ఇలాంటి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలుంటాయి.  సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ....అందుకే  బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం బ్రహ్మముహూర్తం. 


Brahma Muhurtam: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...

హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది.  ఈ సమయం వేకువ జామున 4 గంటల నుంచి 05.30 మధ్య ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. 

వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||

దీనర్థం  బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని అర్థం. ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. లేలేమ్మని మేల్కొలుపుతుంది.


Brahma Muhurtam: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...

వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఈ సానుకూల శక్తితో ఏపని ప్రారంభించినా విజయం తథ్యం. 

ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుంది. ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. 


Brahma Muhurtam: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందంటే...
కశ్యపుడు-వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు, సూర్యునికి రథసారథి. ఓ  సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలనే కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అనూరుడిని సూర్యుని సారథిగా నియమించి.....నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో ఏ నక్షత్రాలు, గ్రహలు చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. 

ఎవరు ప్రాజ్ఞుడు?
“కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్
తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః”

చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ, సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు. ‘తెల్లవారుజాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించిందని సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్. 


Brahma Muhurtam: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...

ఉదయమే ప్రశాంతం

ఉదయం సమయంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలై, మనసులోని ఒత్తిళ్ళను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. తలలో కుడివైపున ఉన్న ఒక గ్రంధి జాగృతమై ఉన్నప్పుడు విద్యాభ్యాస పాటవాన్ని పెంచుతుంది.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది.  తెల్లవారు జామున శరీరం ప్రాణవాయువును ఎక్కువగా తీసుకుంటుంది. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.

ముఖ్యనిర్ణయాలన్నీ తెల్లవారుజామునే
బెంజమిన్ ఫ్రాంక్లిన్… ‘గత 50 సంవత్సరాల్లో నేను నిద్రపోతూ ఎప్పుడూ సూర్యుడికి పట్టుబడలేదు.’ అంటారు.. అమెరికా రాజ్యాంగ పితామహుడు థామస్ జెఫర్‌సన్, జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారు జామున ఒక గంటలో చేయగలిగిన పని, మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు, మూడు గంటలు పడుతుందనేవారు. తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారు జామున తీసుకున్నవేననీ చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యతని  తెలియజేస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే....బ్రహ్మ ముహూర్తకాలంలో ఏ పని చేసినా విజయం తథ్యం.....

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget