అన్వేషించండి

IRCTC Ayodhya Tour: కేవలం రూ.17 వేలతో 10 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. IRCTC అద్భుతమైన టూర్ ప్లాన్ ఇది !

Bharat Gaurav Tourist Train Packages: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య, కాశీ వెళ్లాలని భావించే భక్తులకు అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది IRCTC. పూర్తి వివరాలు, సంప్రదించాల్సిన నంబర్లు ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Ayodhya Tour:  జీవితకాలంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అనుకునే క్షేత్రం కాశీ. సప్తమోక్షపురాల్లో ఒకటి వారణాసి. శివుడు నిర్మించిన ఈ నగరంలో కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. గంగాహారతి అత్యంత ప్రత్యేకం. మోక్షంకావాలని శివయ్యను ప్రార్థించే భక్తులు కాలభైరవుడి అనుమతితో కాశీకి చేరుకుంటారు.  అయోథ్యలో బాలరాముడు కొలువుతీరిన తర్వాత అయోధ్యను సందర్శించే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకే ఈ రెండు క్షేత్రాలను కలుపుతూ IRCTC రెగ్యులర్ గా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. లేటెస్ట్ గా అయోధ్య, కాశీ ప్రయాగరాజ్, పూరీ దర్శించుకునే అవకాశం కల్పించింది. కాశీ పుణ్య క్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరుతో భారతీయ రైల్వే టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది.  తెలుగు రాష్ట్రాల  భక్తులకు ఇది మంచి అవకాశం. తక్కువ ధరతో ఎక్కువ ప్రదేశాలు సందర్శించే రావొచ్చు. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు చూడండి...

2025 సెప్టెంబర్ 9 ప్రారంభమయ్యే  ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు 10 రోజులు సాగుతుంది

భారత్ గౌవర్ పర్యటక రైలులో ఈ యాత్ర ఉంటుంది 

ఇందులో స్లీపర్ క్లాస్, 3 ఏసీ, 2 ఏసీ బోగీలుంటాయి - మొత్తం 639 సీట్

కేవలం 17 వేల రూపాయలతో 10 రోజుల యాత్రను పూర్తిచేయవచ్చు

10 రోజుల యాత్రలో భాగంగా పూరీ, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, కాశీ, అయోధ్య ,ప్రయాగ్ రాజ్ ను సందర్శించుకునే అవకాశం ఉంటుంది

సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కాజీపేట, వరంగల్ , విజయవాడ, రాజమండ్రి, విజయనగరంలో ఆగుతుంది. 

సెప్టెంబర్ 9న ప్రారంభమైన టైన్ సెప్టెంబర్ 10న పూరీకి చేరుకుంటుంది.

రెండో రోజు జగన్నాథుడి దర్శనం, మూడో రోజు కోణార్క్ సూర్య దేవాలయం , నాలుగో రోజు వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది

ఐదో రోజు కాశీ క్షేత్రం సందర్శిస్తారు, ఆరో రోజు విశ్వనాథుడి జ్యోతిర్లింగ దర్శనంతో పాటూ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇదే రోజు సాయంత్రం గంగాహారతి చూడొచ్చు. 

ఏడో రోజు అయోధ్య చేరుకుంటారు. బాలరాముడి ఆలయంతో పాటూ ఆ చుట్టుపక్కలున్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు.  

ఎనిమిదో రోజు ప్రయాగ్ రాజ్ లో గంగా యమున సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానం ఆచరించొచ్చు
 
ప్రయాగ్ రాజ్ నుంచి తిరుగుప్రయాణం మొదలవుతుంది...సెప్టెంబర్ 9 న మొదలైన టూర్ సెప్టెంబర్ 18న తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో పూర్తవుతుంది.

9 రాత్రులు 10 పగళ్లు సాగే ఈ యాత్రలో భాగంగా వసతి సౌకర్యం, కేటరింగ్ ఉంటుంది. ఉదయ టీ, టిఫిన్, లంచ్, డిన్నర్, సెక్యూరిటీ, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఉంటాయి. ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. 

ఈ యాత్రకు సంబంధించి పూర్తి వివరాల కోసం IRCTC వెబ్‌సైట్లో ఉన్నాయి. ఇంకా ఈ యాత్రకు సంబంధించిన సందేహాలంటే  9701360701, 9281030712, 9281030750, 9281495845 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - ఈ సేవలో పాల్గొంటే మీ జన్మ ధన్యమే! తిరమలలో మొత్తం సేవల వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget