అన్వేషించండి

BAPS Hindu Temple: ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం - మార్గదర్శకాలు మామూలుగా లేవుగా!

BAPS Hindu Temple: మన దేశంలో ఆలయాల్లో నిబంధనలు మరీ కఠినంగా ఉంటే కానీ సంప్రదాయ దుస్తులతో ఆలయాలకు వెళ్లేవారి సంఖ్య తక్కువే. కానీ అబుదాబిలో ఈ పప్పులేం ఉడకవ్.. మార్గదర్శకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది

 Abu Dhabi (UAE) BAPS Hindu Temple: సాధారణంగా దేవాలయానికి వెళ్లేటప్పుడు చాలామంది సంప్రదాయ దుస్తులనే ఎంపిక చేసుకుంటారు. అక్కడ మార్గదర్శకాలు కూడా అలానే ఉంటాయి. కానీ మనదేశంలో తిరుపతి లాంటి కొన్ని ఆలయాల్లో మాత్రమే సంప్రదాయ దుస్తులతోనే అడుగుపెట్టాలనే నిబంధన కఠినంగా అమలు చేస్తారు. మరికొన్ని ఆలయాల్లో దర్శనానికి భక్తులు.. వారికి నచ్చిన దుస్తులతోనే వెళ్లిపోతారు. కానీ ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం అయిన అబుదాబి ఆలయంలో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.  అబుదాబిలో తొలి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన బాప్స్ మందిరాన్ని ప్రధాని మోదీ ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ ఆలయంలో  సామాన్యులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. దర్శనాల నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్‌ కోడ్‌కు సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలు  ఇలా ఉన్నాయి

  • ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి
  • ఇతర వస్త్ర డిజైన్లకు అనుమతి లేదు. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్‌, షార్ట్స్‌కు అనుమతించరు
  • కళ్లుచెదిరేలా తళుకులీనే యాక్సెసరీలు, శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు
  • పెంపుడు జంతువులను ఆలయంలోకి అనుమతించరు
  • బయటి ఆహారాన్ని కూడా ఆలయంలోకి తీసుకురాకూడదు
  • దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్‌ వినియోగంపై కూడా నిషేధం విధించారు

ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంతమైన వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆలయం సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.  

Also Read: శుభ కార్యాల్లో రూ. 51, రూ. 101, రూ. 111, రూ. 1011, రూ.1111 ఎందకు ఇస్తారు?

27 ఎకరాల్లో నిర్మాణం - రూ.700 కోట్ల వ్యయం
బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేశారు. UAE లో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయాన్ని రూ.700 కోట్లతో 27 ఎకరాల్లో నిర్మించారు. అబుధాబి, యూఏఈ, దుబాయ్‌, షార్జా.. ఇలా మొత్తం ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించారు.  ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్యాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3డీ విధానంలో ఏక శిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. పవిత్ర గంగా యమున నదీ జలాల ప్రవాహాన్ని మరపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్‌ లైట్లను ఏర్పాటు చేశారు.  రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న 20 వేల టన్నులకు పైగా పాలరాయితో.. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు.  

Also Read: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Phone Tapping Case: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Phone Tapping Case: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
Revant 10 years CM: పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
YSRCP Dual Role: జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతితో విషాదం
హైదరాబాద్‌లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మైనర్లు మృతితో విషాదం
Embed widget