అన్వేషించండి

APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!

Maha Kumbh Mela: మహా కుంభమేళాకి వెళ్లాలి అనుకునే తెలుగువారికి APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్యాకేజీ వివరాలు పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి

Maha Kumbh Mela APSRTC Special Buses: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) వైభవంగా జరుగుతోంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు తరలివెళుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకోసం APSRTC గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకి వెళ్లాలి అనుకున్న భక్తులకోసం విజయవాడ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది APSRTC. ఈ బస్సులు కేవలం మహాకుంభమేళాకి మాత్రమే కాదు..ఈ యాత్రలో భాగంగా ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా మొత్తం 8 రోజుల టూర్ ప్లాన్ రూపొందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!

ఫిబ్రవరి 1 శనివారం  ఉదయం విజయవాడ PNBS నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి
ఫిబ్రవరి 2 ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాగరాజ్‌ చేరుకుంటారు
ఫిబ్రవరి 3 సోమవారం ప్రయాగ్ రాజ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది
ఫిబ్రవరి 4 మంగళవారం రాత్రి ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరుతారు
ఫిబ్రవరి 5 బుధవారం ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడిని దర్శించుకుంటారు...ఇదే రోజు రాత్రి కాశీ ప్రయాణం ఉంటుంది
ఫిబ్రవరి 6 గురువారం వారణాసికి చేరుకుని ఆ రోజు అక్కడే దర్శనాలు చేసుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు
ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం వారణాసి నుంచి బయలుదేరి ఫిబ్రవరి 08 ఉదయానికి విజయవాడ చేరుకుంటారు.  

మొత్తం ఫిబ్రవరి 1  నుంచి 8  వరకూ..అంటే శనివారం నుంచి శనివారం వరకూ టూర్ ప్లాన్ ఇది...

Also Read:  మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. మౌని అమావాస్య రోజు జరిగిన ఘటన 70 ఏళ్లు గడిచినా వణికిస్తూనే ఉంది!

ఈ యాత్రలో భాగంగా పిల్లలు, పెద్దలకు ఛార్జీల విషయంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. అందరకీ టికెట్ రేట్ ఒకటే. సూపర్‌ లగ్జరీ  కి 8 వేల రూపాయలు, స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌   కి 11 వేల రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్‌ కి 14 వేల 500 రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు కేవలం టికెట్ మాత్రమే.. భోజనం, వసతి ఖర్చులు ఎవరికి వారే  పెట్టుకోవాలి. 

యాత్రకు వెళ్లాలి అనుకుని ప్లాన్ చేసుకునే భక్తులు 30 నుంచి 35 మంచి కలసి వస్తే ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కావాలంటే మీకు సమీపంలో ఉన్న బస్టాండ్, RTC టికెట్ బుకింగ్ ఏజెంట్లను సంప్రదిస్తే సరిపోతుంది. 

మరిన్ని అదనపు వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే   80742 98487, 0866 2523926, 0866 2523928 ఈ ఫోన్ నంబర్ కి కాల్ చేస్తే తెలుసుకోవచ్చు. 

విజయవాడ నుంచి మాత్రమే కాదు..ఇప్పటికే  కొవ్వూరు, రాజమహేంద్రవరం డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేశామని, వాటిల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయని RTC అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సులు మాత్రం ఫిబ్రవరి 01 నుంచి బయలుదేరుతాయి.

జనవరి 13 న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహా శివరాత్రిలో ముగుస్తుంది... ఈ 45 రోజుల్లో రాజస్నానాలు ఆచరించే రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది...

Also Read: మౌని అమావాస్య రోజున కుంభమేళాకు వెళ్తున్నారా - సంగంలో స్నానం చేసే విధానం, పాటించాల్సిన నియమాలివే

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Beauty tech hub in Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ, ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ ప్రకటన
హైదరాబాద్‌లో ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ, ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ ప్రకటన
Embed widget