అన్వేషించండి

MP Raghurama: టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే YSRCP కచ్చితంగా ఓడిపోతుంది: ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

MP Raghurama Comments On TDP Janasena: పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతుందని ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

RaghuRama Krishna Raju Sensational Comments over TDP and Janasena Alliance: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అనే అంశం గత కొంతకాలం నుంచి తెరమీదకు వస్తూనే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్‌సీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జలతో పాటు ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కలిసి పోటీ (TDP and Janasena Alliance) చేస్తే  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోతారని వ్యాఖ్యానించారు.

అధికార వైఎస్సార్‌సీపీని ఓడించేందుకు వ్యతిరేక శక్తులం ఏకం అవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల అన్నారు. అసలే జనసేన పార్టీ బీజేపీతోనో, లేక టీడీపీతోనో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుందని, ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైఎస్సార్‌సీపీ కచ్చితంగా ఓడిపోతుందని, ఇందులో ఏ అనుమానం వద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాట చెబుతూనే.. ఏపీ ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు మళ్లీ ఓట్లేస్తారని, లేకపోతే పరిస్థితి మారుతుందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని గద్దె దింపడానికి చూస్తారని, కానీ విపక్షాల ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని రఘురామ గుర్తుచేశారు. అధికారంలో లేకున్నా చంద్రబాబు సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలు భారీ సంఖ్యలోనే తరలివస్తారు. అయితే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, మనమంతా ఏకమై ముందుకు సాగాలని, ఏ త్యాగాలకైనా తాను సిద్ధమని చంద్రబాబు చెప్పడాన్ని చూశామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూసి వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. పరిపాలన బాగుంటే తమకు మరోసారి అధికారం దక్కుతుందని, లేకపోతే ఏమైనా జరగొచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ చెప్పింది మాత్రం ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉండాలని, వైఎస్సార్‌సీపీ ఓట్లు చీలకూడదని చెప్పడం ఏపీ రాజకీయాల్లో హీటు పెంచుతున్నాయనడానికి రఘురామ వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.

ఇంతకీ సజ్జల ఏమన్నారంటే..
" ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నాం" అని సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పలు రకాలుగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలయినా పార్లమెంట్ ఎన్నికలయినా రెండేళ్ల తర్వాతే ఉన్నాయి. మరి ఏడాదిలో అని ఎందుకన్నారనేదే ఆ చర్చకు కారణం. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విస్తృతమైన చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ రాజకీయ నిర్ణయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సజ్జల నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది. సజ్జల కామెంట్ చేసిన మరుసటిరోజే పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Sajjala On Elections : ఏడాదిలో అసెంబ్లీ, రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు - సజ్జల చెప్పింది ఇదేనా ? 

Also Read: Cyclone Asani: ఏపీ, ఒడిశాలకు తుపాను ముప్పు - ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, మే 10న తీరం దాటే అవకాశం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.