అన్వేషించండి

MP Raghurama: టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే YSRCP కచ్చితంగా ఓడిపోతుంది: ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

MP Raghurama Comments On TDP Janasena: పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతుందని ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

RaghuRama Krishna Raju Sensational Comments over TDP and Janasena Alliance: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అనే అంశం గత కొంతకాలం నుంచి తెరమీదకు వస్తూనే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్‌సీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జలతో పాటు ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కలిసి పోటీ (TDP and Janasena Alliance) చేస్తే  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోతారని వ్యాఖ్యానించారు.

అధికార వైఎస్సార్‌సీపీని ఓడించేందుకు వ్యతిరేక శక్తులం ఏకం అవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల అన్నారు. అసలే జనసేన పార్టీ బీజేపీతోనో, లేక టీడీపీతోనో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుందని, ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైఎస్సార్‌సీపీ కచ్చితంగా ఓడిపోతుందని, ఇందులో ఏ అనుమానం వద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాట చెబుతూనే.. ఏపీ ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు మళ్లీ ఓట్లేస్తారని, లేకపోతే పరిస్థితి మారుతుందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని గద్దె దింపడానికి చూస్తారని, కానీ విపక్షాల ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని రఘురామ గుర్తుచేశారు. అధికారంలో లేకున్నా చంద్రబాబు సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలు భారీ సంఖ్యలోనే తరలివస్తారు. అయితే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, మనమంతా ఏకమై ముందుకు సాగాలని, ఏ త్యాగాలకైనా తాను సిద్ధమని చంద్రబాబు చెప్పడాన్ని చూశామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూసి వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. పరిపాలన బాగుంటే తమకు మరోసారి అధికారం దక్కుతుందని, లేకపోతే ఏమైనా జరగొచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ చెప్పింది మాత్రం ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉండాలని, వైఎస్సార్‌సీపీ ఓట్లు చీలకూడదని చెప్పడం ఏపీ రాజకీయాల్లో హీటు పెంచుతున్నాయనడానికి రఘురామ వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.

ఇంతకీ సజ్జల ఏమన్నారంటే..
" ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నాం" అని సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పలు రకాలుగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలయినా పార్లమెంట్ ఎన్నికలయినా రెండేళ్ల తర్వాతే ఉన్నాయి. మరి ఏడాదిలో అని ఎందుకన్నారనేదే ఆ చర్చకు కారణం. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విస్తృతమైన చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ రాజకీయ నిర్ణయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సజ్జల నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది. సజ్జల కామెంట్ చేసిన మరుసటిరోజే పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Sajjala On Elections : ఏడాదిలో అసెంబ్లీ, రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు - సజ్జల చెప్పింది ఇదేనా ? 

Also Read: Cyclone Asani: ఏపీ, ఒడిశాలకు తుపాను ముప్పు - ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, మే 10న తీరం దాటే అవకాశం

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget