అన్వేషించండి

Parthasarathy News: వైసీపీకి మరో షాక్, టీడీపీలోకి మాజీ మంత్రి పార్థసారథి

YSRCP Leader Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు జోరందుకుంటున్నాయి. వైసీపీలో ప్రాధాన్యత దక్కని నేతలు, టికెట్ రాని వారంతా అధికార వైసీపీకి రాం రాం అంటున్నారు.

Kolusu Parthasarathy News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...వలసలు జోరందుకుంటున్నాయి. వైసీపీ(YCP)లో ప్రాధాన్యత దక్కని నేతలు, టికెట్ రాని వారంతా...అధికార పార్టీకి రాం రాం అంటున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య(C Ramachandraiah), వంశీక్రిష్ణ యాదవ్ (Vamsi Krishna Yadav) తో పాటు ఎమ్మెల్యేలు జగన్ కు గుడ్ బై చెప్పారు. రామచంద్రయ్య టీడీపీలో చేరగా, వంశీక్రిష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి చేరారు.

టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం నేత బొమ్మసాని సుబ్బారావు...పార్థసారథిని కలిశారు. ఆయన కార్యాలయంలోనే వెలగపూడి, బొమ్మసాని సుబ్బారావు... పార్థసారథితో చర్చలు జరిపారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో జరిగే రా కదలిరా బహిరంగసభలో...చంద్రబాబు సమక్షంలో పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

సీఎం నచ్చజెప్పినా ససేమిరా
మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి పార్టీ మారుతారన్న ప్రచారంతో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయింది. ఇప్పటికే పార్థసారథితో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే కైలే సమావేశమై చర్చించారు. ఆ తర్వాత.. సీఎంవోకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు.  సారథి శిష్యుడుగా ఉన్నటువంటి కైలే ప్రస్తుతం పామర్రు ఎమ్మెల్యేగా ఉన్నారు. సారథి పార్టీ వీడితే తనకు కూడా ఇబ్బందులు వస్తాయని ఆందోళనతో కైలే అనిల్ ఉన్నట్టు లోకల్ టాక్. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. అయినప్పటికీ పార్థసారథి మెత్తబడలేదు.

జగన్ పై సుతిమెత్తగా విమర్శలు
కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొలుసు పార్థసారథి. ఇటీవల జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో తన ఆవేదన వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ గుర్తించకపోయినా...నియోజకవర్గం ప్రజలు మాత్రం తనను గుర్తించారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి గెలిపించారని అన్నారు. సీనియర్ నేత అయినప్పటికీ...తనకు మంత్రి పదవి దక్కలేదని సన్నిహితులు వద్ద వాపోయారు. వైసీీపీ అధిష్టానం తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని పార్థసారథి వాపోయినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు మంత్రిగా బాధ్యతలు
పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్శిటీ శాఖల మంత్రిగా పని చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2014లో ఓటమి పాలయిన పార్థసారథి...2019లో వైసీపీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి పోటీ చేసి...టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పై 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

Also Read: వైసీపీలోకి ఎంపీ కేశినేని నాని, సాయంత్రం సీఎం జగన్ ను కలిసే ఛాన్స్

Also Read: తూర్పు గోదావరి సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget