అన్వేషించండి

Vijayawada MP Nani: వైసీపీలోకి ఎంపీ కేశినేని నాని, సాయంత్రం సీఎం జగన్ ను కలిసే ఛాన్స్!

Vijayawada MP : విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరిక ఖాయమైంది. ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇవాళ సాయంత్రం కలవనున్నారు.

Kesineni Nani Look Into YSRCP: విజయవాడ (Vijayawada) ఎంపీ (Mp) కేశినేని నాని వైసీపీ (YSRCP)లో చేరిక ఖాయమైంది. ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)ని ఇవాళ సాయంత్రం కలవనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేశారు. కేశినేని నాని ఎంపీ పదవికి, ఆయన కూతురు శ్వేత కార్పొరేటర్ పదవికి గుడ్ బై చెప్పారు. విజయవాడ పార్లమెంట్ సీటును తెలుగుదేశం పార్టీ  కేశినేని చిన్నికి ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని పార్టీ నేతలు నాని చెప్పారు. దీంతో మనసు నొచ్చుకున్న కేశినేని నాని...టీడీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీ పదవి రాజీనామాను స్పీకర్ ఓం బిర్లా ఆమోదించాల్సి ఉంది. 

విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని
వచ్చే ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంపీ సీటుతో పాటు తన కూతురికి ఎమ్మెల్యే సీటు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి వైసీపీ హైకమాండ్ కూడా ఒకే చెప్పడంతోనే...ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు కేశినేని నాని.

కొంతకాలంగా జగన్ పై ప్రశంసల జల్లు
కేశినేని నాని కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు పాల్గొనే బహిరంగసభల్లో పాల్గొనడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై కొంతకాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరును కొనియాడారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, నేతలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలో సొంత గ్రూపులను నడిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నియమించిన ఇన్ చార్జ్ లను కాదని, తన గ్రూపు నేతలతో కలిసి కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించడం, వైసీపీ పనితీరును బాగుందని వ్యాఖ్యానించడం...తెలుగుదేశం పార్టీకి ఆగ్రహం తెప్పింది. 

కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలు
విజయవాడ పార్లమెంట్ బాధ్యతలను కేశినేని నాని సోదరుడు చిన్నికి అప్పగించింది. నానికి సమాంతరంగా చిన్ని కూడా నియోజకవర్గంలో పని చేసుకుంటూ వెళ్లిపోయారు. పార్టీ అధిష్ఠానం సూచనలతో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు చిన్నికి సహకరించారు. తనకు చెప్పకుండా చిన్నికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడం, ప్రత్యర్థిగా భావించే చిన్ని నియమించడంపై నాని బహిరంగంగానే టీడీపీ నేతలను విమర్శించారు. ఒక దశలో కంట్రోల్ తప్పి మాట్లాడారు. అయినప్పటికి తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నానిపై విమర్శలు చేశారు. పార్టీపై అలకతో ఉన్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ హైకమాండ్, ఎంపీ కనకమేడల రవింద్రకుమార్ ద్వారా బుజ్జగించేందుకు ప్రయత్నించింది. రవింద్రకుమార్ మాటలకు మెత్తబడని కేశినేని నాని...చెప్పినట్లే ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget