అన్వేషించండి

Vijayasai Reddy in Delhi : రాష్ట్రం కోసం ఎవరికైనా మద్దతు - ఢిల్లీలో విజయసాయిరెడ్డి ప్రకటన - బీజేపీకి సిగ్నల్స్ పంపారా ?

Andhra Politics : రాష్ట్రానికి సహకరించిన వారికి మద్దతిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బీజేపీ కూటమికే మద్దతని పరోక్ష సంకేతాలు పంపారని జాతీయ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారు.

YSRCP Support :   వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికైనా మద్దతిస్తారని .. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీ క్యాడర్ పై దాడులు జరుగుతున్నాయని పోలీసులు పట్టించుకోవం లేదని  చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమేనని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఏదైనా బిల్లు పాస్ అవడానికి వస్తే.. ఆ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే తాము మద్దతిస్తామన్నారు. ప్రత్యేకంగా తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని..ఏ నిర్ణయం అయినా రాష్ట్ర ప్రయోజనాల మేరకే ఉంటుందన్నారు.               

 

 

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి పరోక్ష మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయని జాతీయ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అవసరమైన దాని కన్నా ఇరవై మంది లోక్ సభ సభ్యులు ఎక్కువే ఉన్నప్పటికీ ముంద జాగ్రత్తగా మరింత మంది లోక్ సభ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నలుగురు ఎంపీలు ఉన్న వైసీపీ బిల్లుల వారీగా మద్దతిస్తామని చెప్పడం..  తమ ఉద్దేశాన్ని బీజేపీ హైకమాండ్‌కు పంపడమేనని అంటున్నారు. 

లోక్‌సభలోనే కాకండా. రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజార్టీ లేదు. వైసీపీ సభ్యులపై ఆధారపడి బిల్లులు పాస్ చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రెస్ మీట్‌లో విజయసాయిరెడ్డి పరోక్షంగా ఇదే మాట చెప్పారు. టీడీపీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేరని.. పదహారు మంది లోక్ సభ సభ్యులున్నారని.. తమకు నలుగురు లోక్‌సభ ఎంపీలు, పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. తమ కంటే టీడీపీకి ఒకే ఎంపీ ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ మాటల ద్వారా బీజేపీకి తమ ప్రాధాన్యాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

వైసీపీ ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం లేదు. తాము ఎన్డీఏకే మద్దతిస్తామని ఎన్నికలకు ముందు కూడా సంకేతాలు పంపారు. ఇప్పుడు ఘోర పరాజయం ఎదురైనా తాము బీజేపీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉంటామన్న సంకేతాలను పంపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వివేకా హత్య కేసు విషయంలో.. జగన్ అక్రమాస్తుల విషయంలో.. తమకు అనుకూలంగా వ్యవస్థల్ని నెమ్మదిగా కదిలేలా చేశారన్న ఆరోపణలను టీడీపీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తమకు ఉన్న ఎంపీలతో అదే  పని చేస్తోందని..  టీడీపీ నేతలు విమర్శించే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
MNREGA Job Cards: MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!

వీడియోలు

India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
MNREGA Job Cards: MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
Pilot Recruitment India: దేశీయ విమానయాన సంస్థల్లో ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇప్పుడు విదేశీ పైలట్లు భారతదేశంలో ఉద్యోగం ఎలా పొందవచ్చు?
దేశీయ విమానయాన సంస్థల్లో ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇప్పుడు విదేశీ పైలట్లు భారతదేశంలో ఉద్యోగం ఎలా పొందవచ్చు?
Amazon: ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
Delhi Customs: నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
Embed widget