అన్వేషించండి

YSRCP: కరేడు రైతులకు మద్దతు ప్రకటించని వైసీపీ - ఇండోసోల్ కంపెనీ జగన్‌కు దగ్గరవాళ్లది అయినందునేనా ?

Indosol: కరేడు రైతులకు వైసీపీ మద్దతు ప్రకటించలేదు. ఇండోసోల్ కంపెనీ జగన్ కు సన్నిహితులదని జరుగుతున్న ప్రచారం దీనికి బలాన్నిస్తోంది.

YCP has not announced support for Karedu farmers:  నెల్లూరు జిల్లా కరేడు గ్రామ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. తాము భూములు ఇచ్చేది లేదంటున్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి ఇలాంటి ప్రజల స్వచ్చంద ఉద్యమం లభిస్తే వెంటనే మద్దతు పలికేస్తారు. ముఖ్యంగా విపక్ష పార్టీలు ఇలాంటి అవకాశాల్ని వదులుకోవు. కానీ ఏపీలోని ప్రతిపక్షం మాత్రం  ఈ కరేడ్ రైతులకు మద్దతు పలికి..పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించలేకపోతోంది. దీనిపై ఏపీ రాజకీయవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పైగా  ఇండోసోల్ కు మద్దతుగా వైసీపీకి చెందిన మీడియాలో ప్రచారం చేస్తూండటంతో  మరింత షాక్‌కు గురి చేస్తోంది. 

వైసీపీ హయాంలో ఇండోసోల్‌కు భారీగా భూముల కేటాయింపు

నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన  భూసేకరణ ఇండోసోల్ అనే కంపెనీ కోసం. ఆ కంపెనీ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తామని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇందు కోసం ఎనిమిదివేలకుపైగా  ఎకరాల కావాలని ప్రభుత్వాన్ని అడిగింది.   ఈ భూములలో ఎక్కువ భాగం సారవంతమైన వ్యవసాయ భూములు, మూడు పంటలు పండే పచ్చటి పొలాలు, ఇవి స్థానిక రైతుల జీవనాధారంగా ఉన్నాయి. 2023లో, వైసీపీ ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఈ భూములను కేటాయించేందుకు సిద్ధమయింది. 

జగన్ బినామీ అని టీడీపీ ఆరోపణలు -అయినా అధికంగా భూముల కేటాయింపు

జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇండోసోల్‌కు భూముల కేటాయింపును తప్పు పట్టింది టీడీపీ. అది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని ఆరోపణలు చేశారు. ఆ ప్రకారం ప్రభుత్వం మారగానే..  ఆ కంపెనీ  ఒప్పందాలను రద్దు చేసి భూములను అప్పగించకుండా వెనుకడగు వేస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. మరిన్ని భూములు కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ భూసేకరణపై వివాదం రేగడంతో వైసీపీకి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. తమ బినామీ కంపెనీ అని టీడీపీ నేతలు విమర్శించిన కంపెనీకే మళ్లీ ఎందుకు భూములు కేటాయించారని.. దమ్ముంటే రద్దుచేయాలని సవాల్ చేయాల్సిన వైసీపీ.. ఇప్పుడు భూ సేకరణ సరిగ్గా చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

పరిశ్రమ కోసమే మాట్లాడుతున్న వైసీపీ - రైతుల కోసం కాదు ! 

ఇండోసోల్ కంపెనీపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. గతంలో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను ఎందుకు ఇవ్వరని..  సారవంతమైన భూములు ఎందుకు సమీకరిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఐదు వందల కోట్లను ఇండోసోల్ కంపెనీ భూసేకరణకు ప్రభుత్వానికి కట్టిందని చెబుతున్నారు. కంపెనీ తరపున వకాల్తా పుచ్చుకుని వైసీపీ కి చెందిన మీడియా ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తోంది కానీ.. ఆ కంపెనీ పెట్టుబడులు రద్దు చేయాలని.. భూసేకరమ వద్దని మాత్రం చెప్పడం లేదు. ఇది విపక్ష పార్టీకి మైనస్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండోసోల్ కంపెనీ వైసీపీ అధినేత జగన్ కు దగ్గర వ్యక్తులదేనని అందరికీ ఓ అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి. 

మరోవైపు షర్మిల భూసేకరణకు వ్యతిరేకంగా కరేడు గ్రామానికి వెళ్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget