అన్వేషించండి

YSRCP: కరేడు రైతులకు మద్దతు ప్రకటించని వైసీపీ - ఇండోసోల్ కంపెనీ జగన్‌కు దగ్గరవాళ్లది అయినందునేనా ?

Indosol: కరేడు రైతులకు వైసీపీ మద్దతు ప్రకటించలేదు. ఇండోసోల్ కంపెనీ జగన్ కు సన్నిహితులదని జరుగుతున్న ప్రచారం దీనికి బలాన్నిస్తోంది.

YCP has not announced support for Karedu farmers:  నెల్లూరు జిల్లా కరేడు గ్రామ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. తాము భూములు ఇచ్చేది లేదంటున్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి ఇలాంటి ప్రజల స్వచ్చంద ఉద్యమం లభిస్తే వెంటనే మద్దతు పలికేస్తారు. ముఖ్యంగా విపక్ష పార్టీలు ఇలాంటి అవకాశాల్ని వదులుకోవు. కానీ ఏపీలోని ప్రతిపక్షం మాత్రం  ఈ కరేడ్ రైతులకు మద్దతు పలికి..పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించలేకపోతోంది. దీనిపై ఏపీ రాజకీయవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పైగా  ఇండోసోల్ కు మద్దతుగా వైసీపీకి చెందిన మీడియాలో ప్రచారం చేస్తూండటంతో  మరింత షాక్‌కు గురి చేస్తోంది. 

వైసీపీ హయాంలో ఇండోసోల్‌కు భారీగా భూముల కేటాయింపు

నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన  భూసేకరణ ఇండోసోల్ అనే కంపెనీ కోసం. ఆ కంపెనీ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తామని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇందు కోసం ఎనిమిదివేలకుపైగా  ఎకరాల కావాలని ప్రభుత్వాన్ని అడిగింది.   ఈ భూములలో ఎక్కువ భాగం సారవంతమైన వ్యవసాయ భూములు, మూడు పంటలు పండే పచ్చటి పొలాలు, ఇవి స్థానిక రైతుల జీవనాధారంగా ఉన్నాయి. 2023లో, వైసీపీ ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఈ భూములను కేటాయించేందుకు సిద్ధమయింది. 

జగన్ బినామీ అని టీడీపీ ఆరోపణలు -అయినా అధికంగా భూముల కేటాయింపు

జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇండోసోల్‌కు భూముల కేటాయింపును తప్పు పట్టింది టీడీపీ. అది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని ఆరోపణలు చేశారు. ఆ ప్రకారం ప్రభుత్వం మారగానే..  ఆ కంపెనీ  ఒప్పందాలను రద్దు చేసి భూములను అప్పగించకుండా వెనుకడగు వేస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. మరిన్ని భూములు కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ భూసేకరణపై వివాదం రేగడంతో వైసీపీకి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. తమ బినామీ కంపెనీ అని టీడీపీ నేతలు విమర్శించిన కంపెనీకే మళ్లీ ఎందుకు భూములు కేటాయించారని.. దమ్ముంటే రద్దుచేయాలని సవాల్ చేయాల్సిన వైసీపీ.. ఇప్పుడు భూ సేకరణ సరిగ్గా చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

పరిశ్రమ కోసమే మాట్లాడుతున్న వైసీపీ - రైతుల కోసం కాదు ! 

ఇండోసోల్ కంపెనీపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. గతంలో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను ఎందుకు ఇవ్వరని..  సారవంతమైన భూములు ఎందుకు సమీకరిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఐదు వందల కోట్లను ఇండోసోల్ కంపెనీ భూసేకరణకు ప్రభుత్వానికి కట్టిందని చెబుతున్నారు. కంపెనీ తరపున వకాల్తా పుచ్చుకుని వైసీపీ కి చెందిన మీడియా ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తోంది కానీ.. ఆ కంపెనీ పెట్టుబడులు రద్దు చేయాలని.. భూసేకరమ వద్దని మాత్రం చెప్పడం లేదు. ఇది విపక్ష పార్టీకి మైనస్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండోసోల్ కంపెనీ వైసీపీ అధినేత జగన్ కు దగ్గర వ్యక్తులదేనని అందరికీ ఓ అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి. 

మరోవైపు షర్మిల భూసేకరణకు వ్యతిరేకంగా కరేడు గ్రామానికి వెళ్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Nutrition vs ideology in Bengal School Meals : బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
AP Governor Quota MLC Vacancies: జూలైలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ - కూటమిలో ఎవరికి దక్కనున్నాయి?
జూలైలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ - కూటమిలో ఎవరికి దక్కనున్నాయి?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget