అన్వేషించండి

Andhra BJP : చేరినోళ్లంతా మళ్లీ వెళ్లిపోతారా ? ఏపీలో బీజేపీకి జనసేన షాక్ తప్పదా?

బీజేపీకి జనసేన దూరం అవుతున్న వాతావరణం ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకూ పార్టీలో చేరిన వారంతా గుడ్ బై చెబుతారన్న చర్చ ప్రారంభమయింది.

Andhra BJP :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ - జనసేన కూటమికి బీటలు వారుతున్నాయి. అదే సమయంలో బీజేపీ నుంచి కీలక నేతలు జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ హింట్ ఇచ్చారు. మరికొందరు అదే బాటలో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జనసేన కూడా లేకపోతే..  బీజేపీ బలాన్ని నమ్ముకుని ఏపీలో పోటీ చేస్తే  డిపాజిట్లు కూడా రావని ఎక్కువ మంది నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతలు ఈ విషయంలో మరింతగా ఆలోచిస్తున్నారు. అందుకే రానున్న రోజుల్లో ఏపీ బీజేపీకి మరంత గడ్డు కాలం రావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

జనసేన దూరం అవుతూండటంతో నిరాశలో బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలు!

భారతీయ జనతా పార్టీ  పోరాటం చేస్తోంది కానీ.. ఆ పార్టీకి ఏదీ కలసి రావడం లేదు. దీనికి కారణం ప్రతీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిన ఓటు బ్యాంక్‌ను ఆ పార్టీ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఫలానా  సామాజికవర్గం లేదా ఫలానా వర్గం తమకు అండగా ఉంటుందని బీజేపీ గట్టిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ జనసేన పార్టీకి అలాంటి చఓటు బ్యాంక్ ఉంది. ఈ కారణంగా బీజేపీ నేతల్లో కాస్తంత ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు అనూహ్యంగా జనసేనాధినేత తన వ్యూహం మార్చుకున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన ఉద్దేశం ప్రకారం టీడీపీతో వెళ్లడం ఖాయమే. అంటే బీజేపీకి గుడ్ బై చెప్పినట్లే. అందుకే.. బీజేపీ ద్వితీయ శ్రేణి  నేతల్లో నిరాశ కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ను తమతో ఉంచుకోలేకపోయామన్న అసంతృప్తి కనిపిస్తోంది. 

గతంలో వెల్లువలా వచ్చిన చేరికలు ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం !

గత ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనేక మంది నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో ఏకంగా విలీనం అయ్యారు. కొంత మంది ప్రజా జీవితంలో లేనప్పటికీ మరికొంత మంది ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలు బీజేపీలో చేరారు. బాపట్ల నుంచి  అన్నం సతీష్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరితో పాటు చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి వారి రాకతో బీజేపీ బలపడినట్లయింది. ఇప్పటికిప్పుడు బీజేపీ మీటింగ్ జరిగితే.. ఇలా వచ్చి చేరిన నేతలే సగం మంది ఉంటారు. కానీ ఇప్పుడు వారిలో సగం మంది రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదినారాయణరెడ్డి తన సోదరుడి కుమారుడ్ని టీడీపీలో చేర్పించారు. వరదాపురం సూరి టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ అయితే ఓ అడుగు ముందే ఉన్నారు. ఇలా వలస వచ్చిన వారంతా రివర్స్ అయితే మళ్లీ బీజేపీ పరిస్థితి మొదటికి వస్తుంది. 

పొత్తు ఉంటే..పార్టీ నేతలు ఆగే అవకాశం !

బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని అనిపిస్తూండటం వల్లనే ఎక్కువ మంది నేతుల ఆ పార్టీలో ఉండే  ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎట్టి  పరిస్థితుల్లో పోటీ చేసి గెలవాలంటే..  ప్రధాన పార్టీల అభ్యర్థిగా లేదా వారి మద్దతుతోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ తరపున పోటీ చేస్తే గెలవలేమని నమ్ముతున్నారు. అదే సమయంలో  పొత్తులో ఉంటే మాత్రం నేతలు బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉంది. జనసేన, టీడీపీతో కలిసి బీజేపీ వెళ్లాలని అనుకుంటే మాత్రం ఆ పార్టీ నేతలు... బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఏపీలో బీజేపీకి ఉన్న బలం ప్రకారం..   ఆ పార్టీకి సీట్లు కేటాయించేందుకు టీడీపీ, జనసేన సిద్ధపడే అవకాశాలు ఉండవు. అందుకే నేతలు డైలమాలో పడుతున్నారు. 

మొత్తంగా జనసేన పార్టీ దూరం పెట్టడం వల్ల.. ఏపీ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ నేతల్ని కాపాడుకోవడానికి బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా  మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Nutrition vs ideology in Bengal School Meals : బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
AP Governor Quota MLC Vacancies: జూలైలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ - కూటమిలో ఎవరికి దక్కనున్నాయి?
జూలైలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ - కూటమిలో ఎవరికి దక్కనున్నాయి?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Embed widget