అన్వేషించండి

KCR Vs BJP : వడ్ల పోరు ప్రారంభించింది.. ముగించింది కేసీఆరే ! మరి విజేత ఎవరు ?

వడ్ల పోరులో విజత ఎవరు ? టీఆర్ఎస్ నా ? బీజేపీనా ?


వడ్లను కొంటారా ? లేదా ? తేల్చుకుంటామని యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ చివరికి రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొంటుందని ప్రకటించారు. చివరి గింజ వరకూ కొంటామన్నారు.  మొదటి నుంచి ఆయన కేంద్రం పై ఆరోపణలు చేశారు. కేంద్రం కొనడం లేదన్నారు. కానీ కేంద్రం మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని దేశమంతా ఒకే ధాన్యం సేకరణ ఉందని చెబుతూ వస్తోంది. కేంద్రం వడ్ల కొనే ప్రసక్తే లేదని తేల్చేయడంతో కేసీఆర్ తామే కొంటామని కేబినెట్ భేటీ పెట్టి ప్రకటించేశారు . దీంతో బీజేపీపై ప్రకటించిన వరి యుద్ధం ముగిసినట్లయింది. మరి ఈ యుద్ధంలో కేసీఆరే విజయం సాధించారా ? బీజేపీని  రైతు వ్యతిరేకిగా నిలబెట్టగలిగారా ? 

కేంద్రం మెడలు వంచకుండానే ముగిసిన వరి యుద్దం ! 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం కేంద్రం, బీజేపీపై నిర్వహించిన వరి పోరు ముగించారు. ఈ  పోరులో బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  కేంద్రం తెలంగాణ రైతులను గాలికి వదిలేసిందని మండి పడ్డారు.  ఢిల్లీలో కూడా ధర్నా చేశారు.  బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్నారు. అయితే  కేంద్రం వడ్లను కొంటామని కానీ మరో సానుకూల ప్రకటన కానీ చేయలేదు.  అయినా కేసీఆర్ వడ్లను తామే కొంటామని ప్రకటించారు.  కేంద్రంపై మాత్రం విమర్శలు చేస్తున్నారు. 

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమన్న లేఖను విడుదల చేసిన బీజేపీ !

ధాన్యం సేకరణ విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఓ ఒప్పందం చేసుకుంది.  ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణ సర్కార్ కూడా బియ్యమే ఇస్తామని చెప్పింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చింది. అయినా వడ్లు కొనాలని కేసీఆర్ ఉద్యమం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది.  ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే తాము ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో పాటు అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖను బయట పెట్టారు. 

కేసీఆర్ మాట విని వరి పంట వేయని రైతులకు నష్టమేనా ? 

వరి వేయవద్దని ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని గత ఏడాది కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. అధికారులూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతైనా ప్రభుత్వం చెబుతోంది కదా అని .. వేల మంది రైతులు వరి పంటను పెట్టలేదు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయలేపోయారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా  వేల ఎకరాలు బీళ్లుగా ఉండిపోయాయి.  వారంతా పంటలు వేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా వరి పంట వేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది.. కానీ ప్రభుత్వం మాట విని ఏ పంటా వేయని వారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వారందరికీ ఇప్పుడు కేసీఆర్ సర్ది చెప్పాల్సి ఉంది. 

రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచగలిగారా ? 
  
రైతులను పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం చేయడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు.  తిప్పి కొట్టడానికి కూడా బీజేపీ అంతే తీవ్రంగా ప్రయత్నించింది. ఎవరు ఎంత మేర సక్సెస్ అయ్యారన్నదానిపై రాజకీయవర్గాలు ఇప్పటికీ అంచనాకు రాలేకపోతున్నాయి కానీ మొత్తంగా అయితే కేసీఆర్ వెనక్కి తగ్గారన్న  భావిస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Embed widget