అన్వేషించండి

KCR Vs BJP : వడ్ల పోరు ప్రారంభించింది.. ముగించింది కేసీఆరే ! మరి విజేత ఎవరు ?

వడ్ల పోరులో విజత ఎవరు ? టీఆర్ఎస్ నా ? బీజేపీనా ?


వడ్లను కొంటారా ? లేదా ? తేల్చుకుంటామని యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ చివరికి రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొంటుందని ప్రకటించారు. చివరి గింజ వరకూ కొంటామన్నారు.  మొదటి నుంచి ఆయన కేంద్రం పై ఆరోపణలు చేశారు. కేంద్రం కొనడం లేదన్నారు. కానీ కేంద్రం మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని దేశమంతా ఒకే ధాన్యం సేకరణ ఉందని చెబుతూ వస్తోంది. కేంద్రం వడ్ల కొనే ప్రసక్తే లేదని తేల్చేయడంతో కేసీఆర్ తామే కొంటామని కేబినెట్ భేటీ పెట్టి ప్రకటించేశారు . దీంతో బీజేపీపై ప్రకటించిన వరి యుద్ధం ముగిసినట్లయింది. మరి ఈ యుద్ధంలో కేసీఆరే విజయం సాధించారా ? బీజేపీని  రైతు వ్యతిరేకిగా నిలబెట్టగలిగారా ? 

కేంద్రం మెడలు వంచకుండానే ముగిసిన వరి యుద్దం ! 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం కేంద్రం, బీజేపీపై నిర్వహించిన వరి పోరు ముగించారు. ఈ  పోరులో బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  కేంద్రం తెలంగాణ రైతులను గాలికి వదిలేసిందని మండి పడ్డారు.  ఢిల్లీలో కూడా ధర్నా చేశారు.  బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్నారు. అయితే  కేంద్రం వడ్లను కొంటామని కానీ మరో సానుకూల ప్రకటన కానీ చేయలేదు.  అయినా కేసీఆర్ వడ్లను తామే కొంటామని ప్రకటించారు.  కేంద్రంపై మాత్రం విమర్శలు చేస్తున్నారు. 

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమన్న లేఖను విడుదల చేసిన బీజేపీ !

ధాన్యం సేకరణ విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఓ ఒప్పందం చేసుకుంది.  ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణ సర్కార్ కూడా బియ్యమే ఇస్తామని చెప్పింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చింది. అయినా వడ్లు కొనాలని కేసీఆర్ ఉద్యమం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది.  ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే తాము ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో పాటు అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖను బయట పెట్టారు. 

కేసీఆర్ మాట విని వరి పంట వేయని రైతులకు నష్టమేనా ? 

వరి వేయవద్దని ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని గత ఏడాది కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. అధికారులూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతైనా ప్రభుత్వం చెబుతోంది కదా అని .. వేల మంది రైతులు వరి పంటను పెట్టలేదు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయలేపోయారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా  వేల ఎకరాలు బీళ్లుగా ఉండిపోయాయి.  వారంతా పంటలు వేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా వరి పంట వేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది.. కానీ ప్రభుత్వం మాట విని ఏ పంటా వేయని వారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వారందరికీ ఇప్పుడు కేసీఆర్ సర్ది చెప్పాల్సి ఉంది. 

రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచగలిగారా ? 
  
రైతులను పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం చేయడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు.  తిప్పి కొట్టడానికి కూడా బీజేపీ అంతే తీవ్రంగా ప్రయత్నించింది. ఎవరు ఎంత మేర సక్సెస్ అయ్యారన్నదానిపై రాజకీయవర్గాలు ఇప్పటికీ అంచనాకు రాలేకపోతున్నాయి కానీ మొత్తంగా అయితే కేసీఆర్ వెనక్కి తగ్గారన్న  భావిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
Revanth Politics: కేసీఆర్‌ది వైష్ణవం - రేవంత్‌ది శైవం - భక్తిలోనూ రాజకీయం పండిస్తున్నారా?
కేసీఆర్‌ది వైష్ణవం - రేవంత్‌ది శైవం - భక్తిలోనూ రాజకీయం పండిస్తున్నారా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Nagarjuna : నాగార్జున 100వ సినిమా - హీరోయిన్ ఫిక్స్ అయ్యారా?
నాగార్జున 100వ సినిమా - హీరోయిన్ ఫిక్స్ అయ్యారా?
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
Embed widget