అన్వేషించండి

Tiruvuru News: స్వామిదాసుపై సానుభూతి చూపేనా? - కొలికలపూడి కుంభస్థలం కొట్టేనా?

Tiruvuru Therpu: తిరువూరులో పూర్వవైభవం కోసం టీడీపీ ప్రయత్నిస్తుండగా..వైసీపీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.

Tiruvuru constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్‌ పరధిలోని తిరువూరు(Tiruvuru) అసెంబ్లీ నియోజకవర్గం...ఆంధ్రరాష్ట్రం విభజన చట్టం ప్రకారం 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే జరిగాయి. అప్పటి నుంచి ఎవరెవరు గెలిచారు..? ఏయే పార్టీలు పైచేయి సాధించాయో ఓసారి చూస్తే..

తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం
తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం 1952లో ఏర్పాటు కాగా...తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) పార్టీలు పోటీపట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థి పేటబాపయ్యపై సీపీఐ నేత పేట రామారావు 21 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1955 జరిగిన ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా బరిలో దిగగా..ఈసారి కాంగ్రెస్(Congress) అభ్యర్థి బాపయ్య విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ తరపున పోటీపడి సీపీఐ అభ్యర్థి సుంకర వీరభద్రరావుపై బాపయ్య విజయం సాధించారు. ఇప్పటి వరకు జనరల్ స్థానంలో ఉన్న తిరువూరు నియోజకవర్గం 1967 నుంచి ఎస్సీ రిజర్వుడ్ గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టు కూర్మయ్య దక్కించుకుని సీపీఎం(CPM) అభ్యర్థి బీమ్లా సంజీవ్‌పై 10 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1972లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ సీటు నిలబెట్టుకోగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కోట రామయ్య ఇండిపెండెంట్‌ అభ్యర్థి బీమ్లా సంజీవ్‌పై విజయం సాధించారు.1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి వక్కలగడ్డ ఆడం..జనతాపార్టీ అభ్యర్థి కోటా పున్నయ్యపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ వరుస విజయాలకు తెలుగుదేశం(Telugudesam) బ్రేక్‌లు వేసింది. తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం జరిగిన 1983 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మిర్యాల పూర్ణానంద్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకాంతయ్యపై  2వేల 500 ఓట్ల మెజార్టీతో  విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం(Telugudesam) ఈ సీటును నిలబెట్టుకోగా... ఆ పార్టీ నుంచి పిట్టా వెంకటరత్నం సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి మోడుగు రాఘవులపై 12 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కొత్తపల్లి రవీంధ్రనాథ్‌(Ravindranath)పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు రంగారావు(Koneru Rangarao) 2వేల ఓట్లతో విజయం సాధించారు.

అనంతరం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగానూ, మున్సిపల్‌, దేవదాయశాఖ మంత్రిగా పని చేశారు. 1994లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో ఆ పార్టీ నుంచి నల్లగడ్ల స్వామిదాసు(Nallagadla Swamydas) కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు రంగారావుపై దాదాపు 8వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999లోనూ మళ్లీ అదే అభ్యర్థులు పోటీపడగా...ఈసారి స్వామిదాసును విజయం వరించింది. కేవలం 1100 ఓట్ల మెజార్టీతో ఆయన బయటపడ్డారు. 2004లో మరోసారి స్వామిదాసు, కోనేరు రంగారావు పోటీపడగా...విజయం కాంగ్రెస్‌ను వరించింది. 2009లో మరోసారి తెలుగుదేశం నుంచి నల్లగడ్ల స్వామిదాసు పోటీ చేయగా...కాంగ్రెస్ అభ్యర్థి దిరిశం పద్మజ్యోతి(Padma Jyothi) కేవలం 265 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లోని టీడీపీ స్వామిదాసుకు అవకాశం ఇచ్చింది. వైసీపీ(YCP) నుంచి పోటీ చేసిన రక్షణనిధి 1600 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో మంత్రి జవహర్‌(Javahar)ను తిరువూరు నుంచి తెలుగుదేశంం రంగంలోకి దింపగా...వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి(Rakshana Nidhi) పోటీలో నిలిచి రెండోసారి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన నల్లగడ్ల స్వామిదాసు ఆ పార్టీ నుంచి బరిలో దిగుతుండగా....తెలుగుదేశం ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasarao)కు టిక్కెట్ ఇచ్చింది. వరుసగా మూడుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలైన స్వామిదాస్‌పు సానుభూతి పనిచేస్తుందో లేక విద్యావంతుడైన కొలికపూడి వైపు తిరువూరు ఓటర్లు మొగ్గు చూపుతారో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget