అన్వేషించండి

TDP Target Youth And Womens : యూత్ ఓటర్లపైనే టీడీపీ గురి - పాదయాత్రతో పక్కా స్కెచ్ వేస్తున్న లోకేష్ !

మహిళలు, యూత్ ఓటర్లపై టీడీపీ గురి పెట్టింది. పాదయాత్ర ద్వారా వారి అభిమానాన్ని పొందాలని టీడీపీ యువనేత లోకేష్ ప్రయత్నిస్తున్నారు.

 

TDP Target Youth And Womens :   తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. వంద నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర లక్ష్యం.. మహిళలు, యువతను పార్టీకి దగ్గర చేసుకోవడమే. ప్రస్తుత రాజకీయాల్లో గెుపోటముల్ని నిర్ణయించేది యువత, మహిళలే. ఓటింగ్ కు ఉత్సాహంగా వచ్చేది కూడా వారే. ఆ వర్గాలను ఆకట్టుకుంటే చాలా వరకూ గెలుపు సులువు అవుతుంది. అందుకే టీడీపీ యువనేత లోకేష్ వ్యూహాత్కమంగా ఆ రెండు వర్గాలను టార్గెట్ చేసుకుని పాదయాత్ర చేయాలని సంకల్పించారు. 

ఏపీ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం !

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా చైతన్యవంతమైన యువత ఎక్కువ. ఏ ఇద్దరు యువత కలిసినా రాజకీయాలపై చర్చించుకుంటారు. దాదాపుగా అందరికీ రాజకీయ పరమైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇంతటి చైతన్యం ఉన్న ఏపీలో యువత మద్దతు పొందడం క్లిష్టం.  గెలవాలంటే వారి మద్దతు పొందాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ యువత కోసం చాలా కార్యక్రమాలు చేసినట్లుగా చెప్పుకున్నా  పూర్తిగా యువత ఆదరించలేదు. వైసీపీ స్ట్రాటజిస్టుల వ్యూహం కారణంగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో   టీడీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు  నారా లోకేష్ యువతపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. వారిని మళ్లీ టీడీపీ వైపు ఆకర్షించేందుకు తన పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. 

యువ ఆలోచనలకు ప్రతీకగా లోకేష్ !

నారా లోకేష్ ఇంకా  ముఫ్పైల్లోనే ఉన్నారు. ఆయన ఇంకా నలభైకి చేరుకోలేదు. కానీ ఇప్పటికే రాజకీయంగా ఎంతో అనుభవం సంపాదించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన తర్వాత ఆయన టీడీపీకి పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమాన్ని ఆయనే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 2009 ఎన్నికల్లో  టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశం నగదు  బదిలీ. దీన్ని నారా లోకేష్ డిజైన్ చేశారు.  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని అప్పట్లో లోకేష్ పార్టీ మేనిఫెస్టోలో ఉండేలా చూశారు. అప్పట్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ నగదు  బదిలీ విధానం పక్కకుపోయింది. అయితే అప్పట్నుంచి ఆయన టీడీపీ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి..  ఐటీ , పంచాయతీరాజ్ మంత్రిగా తనదైన ముద్ర వేశారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ... ఓటమే విజయానికి తొలి మెట్టు అని మంగళగిరిలోనే విస్తృతంగా పని చేస్తున్నారు. లోకేష్ ఇమేజ్ ఓ రకంగా మైనస్ లో నుంచి ప్రారంభమయింది. ఇప్పుడు ఆయన యువతను ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా యువతకు మరింత దగ్గర కావాలనుకుంటున్నారు. 

టీడీపీలో ఈ సారి తెరపైకి యువతరమే !

తెలుగుదేశం పార్టీలో ఈ సారి పూర్తిగా తెరపైకి యువతరమే రానుంది. లోకేష్, రామ్మోహన్, పరిటాల శ్రీరాం లాంటి వాళ్లు ఇప్పటికే స్పీడ్‌మీద ఉన్నారు. వారసులు మాత్రమే కాకుండా..  కింది స్థాయి నుంచి ఎదిగిన యువ నేతలకు ఈ సారి చంద్రబాబు, లోకేష్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా టీడీపీకి యువతలో మంచి ఆదరణ ఉంటుంది. అభివృద్ధి రాజకీయాలు ఓ కారణం అయితే.. ఐటీ, పరిశ్రమల స్థాపనలో టీడీపీ ప్రభుత్వం చురుకుగా ఉంటూండటం మరో కారణం. అందుకే ఈ సారి యువ నేతలు తెరపైకి రానున్నారు. 
 

మహిళల మద్దతు కొనసాగేలా చేసుకోవాలని టీడీపీ ప్లాన్ !

తెలుగుదేశం పార్టీకి మహిళల మద్దతు మొదటి నుంచి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతూంటారు, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి.. లక్షల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపామని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే ఈ సారి పాదయాత్ర ద్వారా  వారి మద్దతు కొనసాగేలా చూసుకుని..యువత, మహిళల మద్దతుతో టీడీపీని అధఇకారంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో లోకేష్ ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget