అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Congress: దేశ వ్యాప్తంగా కుల గణనకు కాంగ్రెస్‌ డిమాండ్‌, సీడబ్ల్యూసీలో తీర్మానం

Congress CWC: సీడబ్యుసీ మీటింగ్‌లో దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ తీర్మానాన్ని ఆమోదించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీల కోసం పనిచేయడం లేదని, ప్రధాన సమస్యల నుంచి వారిని మళ్లించి తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయడం మోదీ చేతకాదన్నారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ఓబీసీలు అని, బీజేపీకి చెందిన పది మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఓబీసీ అని రాహుల్‌ అన్నారు. ఓబీసీ వర్గం నుంచి ఎంత మంది బీజేపీ సీఎంలు ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈరోజు దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ మోదీ పై, బీజేపీ పై విమర్శలు చేశారు. ఈ మీటింగ్‌లో దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ తీర్మానాన్ని ఆమోదించింది.

సీడబ్యుసీ సమావేశం తర్వాత రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రజలు కుల గణనను కోరుకుంటున్నారని, కాబట్టి కుల గణన చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై ఒత్తిడి చేస్తుందని చెప్పారు. 'దేశం కోరుకుంటున్నందున కుల గణనను నిర్వహించాలని మేము బిజెపిపై ఒత్తిడి తెస్తాము. I.N.D.I.A కూటమికి సంబంధించినంతవరకు, చాలా పార్టీలు దీనికి మద్దతు ఇస్తాయని నేను భావిస్తున్నాను. దానికి మద్దతు ఇవ్వని కొన్ని పార్టీలు మాత్రమే ఉండవచ్చు, కానీ దాని వల్ల ఏ సమస్య లేదు" అని గాంధీ చెప్పారు. 

అలాగే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్ సీఎంలు నిర్ణయించారని రాహుల్‌ వెల్లడించారు. తాము కుల గణనపై చర్చ నిర్వహించి ఏకగ్రీవంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుల గణన పేదల కోసమే అని ఆయన పేర్కొన్నారు. ఇది కులం, మతానికి సంబంధించినది కాదని, పేదరికానికి సంబంధించిదని తెలిపారు. తాము కుల గణనతో ఆగకుండా తర్వాత ఆర్థిక సర్వే కూడా చేయిస్తామని తెలిపారు.

ప్రధాని నిరాధారమైన ఆరోపణలు పెరుగుతాయి: సీడబ్ల్యుసీలో ఖర్గే

కాంగ్రెస్‌ పార్టీపై రానున్న రోజుల్లో  ప్రధాని మెదీ అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన నిరాధారమైన ఆరోపణలు మరింత పెరుగుతాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. సీడబ్ల్యుసీలో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. అబద్ధాలను ఎదుర్కోవడానికి నాయకులు సిద్ధంగా ఉండడం చాలా అవసరమని చెప్పారు. మణిపూర్‌ పరిస్థితిని వదిలేసి మోదీ తరచూ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాలని ఖర్గే కార్యకర్తలను కోరారు. 

అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వారి జనాభాకు అనుగుణంగా సామాజిక న్యాయం కల్పించేందుకు దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై బీజేపీ మౌనంగా ఉంటుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో సరైన భాగస్వామ్యం కోసం సమాజంలో బలహీన వర్గాల సామాజిక- ఆర్థిక వివరాలు ఉండడం చాలా అవసరమని, వారికి న్యాయం చేయడానికి ఇది తోడ్పడుతుందని ఖర్గే పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే అమలు చేస్తామని ఖర్గే అన్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, మిజోరాంలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమర్థమైన వ్యూహం అవసరమని ఆయన తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget