అన్వేషించండి

Telugu State Politics : తెలుగు రాష్ట్రాల్లో జోరుగా రాజకీయ చదరంగం ! కీలక మార్పులకు "భేటీలు" గ్రౌండ్ ప్రిపేర్ చేసేశాయా ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రెండు రోజులుగా కీలక మలుపులు తిరుగుతున్నాయి. అవి ఏ తీరానికి చేరనున్నాయి ?

Telugu State Politics :  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉన్నా .. రోజు రోజుకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఏపీలో పొత్తుల చర్చలు.. రాజకీయ విమర్శలు... వరుస భేటీలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటు తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయంలో కొత్తగా సీబీఐ కేసులూ వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. ఎప్పుడైనా కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్నంత వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. 

ఏపీలో రాజకీయాల్లో భేటీల కలకలం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత మూడేళ్ల నుంచి వేడి మీదనే ఉన్నాయి. అయితే ఎక్కువగా అధికార పార్టీ..  ప్రతిపక్ష పార్టీని వేటాడటమే ఉంది. భారీగా దెబ్బతిన్న టీడీపీ.. ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఇవ్వకుండా కేసులు..విచారణలతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ మధ్యలో కరోనా సీజన్లు రావడంతో టీడీపీ కూడా ఆన్ లైన్ రాజకీయాలు చేసింది. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉందనగా ఒక్క సారిగా రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబునాయుడు బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు గతంలోలా చంద్రబాబు విషయంలో ఘాటుగా స్పందించడం లేదు. కానీ..  ఇంత వరకూ సాఫ్ట్‌గా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. యువ సంఘర్షణ ర్యాలీ ముగింపుసభకు హాజరైన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ .. ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్ఆర్‌సీపీలోనూ ఈ పరిణామం చర్చనీయాంశమయింది. 

రాత్రి అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ ! ఉదయం ప్రధానితో జగన్ భేటీ !

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. కేవలం అభినందన విందు అని బీజేపీ చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుకుంటున్నారు. అది డైరక్ట్ రాజకీయమా.. ఇన్‌డైరక్ట్ రాజకీయమా అన్నదానిపై స్పష్టత లేదు. పైగా తెలంగాణ రాజకీయాలను గురి పెట్టారన్న దానిపై జరుగుతున్న ప్రచారం కన్నా..   బీజేపీ ఏపీని గురిపెట్టి వ్యవహారాలను నడుపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎన్టీఆర్ ప్రభావం తెలంగాణలో కన్నా ఏపీలోనే ఎక్కువ. వీరి భేటీ కన్ఫర్మ్ అయిన తర్వాత అమరావతి నుంచి జగన్ ఢిల్లీ టూర్‌కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. సీఎం జగన్అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారని..సోమవారం ఉదయమే ప్రధానితో భేటీ అవుతారని ఆ ప్రకటన సారాంశం. అన్నట్లుగా జగన్ ఢిల్లీ వెళ్లారు.  ప్రధానితో అరగంట సేపు మాట్లాడారు. కానీ ఎజెండా  ఏమిటన్నదానిపై క్లారిటీ లేదు. అయితే రాష్ట్రం కోసం అని.. ఎప్పుడూ చెప్పే అంశాలతోనే ఓ వినతిపత్రం మోదీకి ఇచ్చారన్న సమాచారం మీడియాకు వచ్చింది. కానీ ఈ భేటీలో అంతకు మించి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

పొత్తుల చర్చలు కొలిక్కి వస్తున్నాయా ?

ఏపీలో పొత్తుల రాజకీయాలు అంతర్గతంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం  బలంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని జనసేన పార్టీ  ప్రకటిస్తోంది.  తమ రాజకీయ తీర్మానంలో ఆ విషయాన్ని అధికారంగా ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ ముక్త ఏపీ అని జనసేన నినాదం. ఇక ఆ పార్టీ ఓట్లు చీల్చబోమంటూ ప్రతిజ్ఞలు అలా చేయాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి. అంతకు మించి ఆప్షన్ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీకి దగ్గరతువుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంపై వైఎస్ఆర్‌సీపీకి కూడా క్లారిటీ ఉందేమో కానీ..టీడీపీతో మళ్లీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వారిష్టమని.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ట్వీట్ చేశారు.  మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకమైన దశ నడుస్తోంది. ఇది ఏ మలుపు తిరగబోతోందో  చెప్పడం కష్టం. కాలమే డిసైడ్ చేయాలి. 

లిక్కర్ స్కాం చుట్టూ తెలంగాణ రాజకీయాలు ! 

తెలంగాణలోనూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం మొత్తం కేసీఆర్ కుమార్తె కవిత కనుసన్నల్లో జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవి లోకల్‌గా చేసిన ఆరోపణలు అయితే రాజకీయం అయ్యేవి. కానీ ఢిల్లీలో ఈ  స్కాం గుట్టుముట్లు ఉన్నాయి. అక్కడి నేతలే కేసీఆర్ కుమార్తెపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయ కుట్రేనని.. కేసీఆర్‌ ను నియంత్రించడానికి తనను టార్గెట్ చేస్తున్నారని కవిత అంటున్నారు. అయితే టీఆర్ఎస్ అనుకున్నంత తేలిగ్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లేదు. బీజేపీ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే ఏదో తీగ దొరికిందన్న అనుమానం తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ ఉంది. పైగా ఈ కేసులు ఈడీ చేతికి వెళ్లబోతున్నాయి. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు జరిగితే ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. ఈడీ వచ్చినా బోడీ వచ్చినా.. భయపడేదే లేదని టీఆర్ఎస్ అధినేత చెబుతున్నారు కానీ.. ఇప్పుడా పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ ఈ లిక్కర్ స్కాం అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకే ప్రయత్నిస్తోందని.. లేకపోతే.. సీబీఐ ద్వారానే అసలు విషయం చెప్పించేవారు కదా.. తమెందుకు  ఆరోపణలు చేస్తున్నారన్న సందేహం వస్తోంది. అందుకే ఈ కేసు తెలంగాణ రాజకీయాలను ఎటు వైపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. 

కాంగ్రెస్‌లో అదే కుంపటి..  తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం!

తెలంగాణ కాంగ్రెస్‌లో అదే కుంపటి కనిపిస్తోంది. ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు. మరోవైపు కేసీఆర్.. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులు.. మౌనంగా ఉండకూడదని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ క్రమమంలో అందర్నీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఏదో పెద్ద ఉద్యమానికే ప్లాన్ చేస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. 

తెలుగు రాష్ట్రాల్లో ఏదో జరుగుతోంది. రాజకీయంగా కీలకమైన మార్పులకు వేదికలు రెడీ అవుతున్నాయి. కానీ అదేమిటో అన్నది మాత్రం క్లారిటీలేదు. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. కొద్ది రోజుల్లోనే తేలనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Kichcha Sudeep : కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
Embed widget