అన్వేషించండి

విపక్షాలను ఏకం చేసేందుకు స్పీడ్ పెంచిన నితీష్‌ కుమార్- త్వరలో కేసీఆర్‌, మమతతో భేటీ!

మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు బిహార్ సీఎం నితీష్ కుమార్. అన్ని పార్టీల నాయకులతో మాట్లాడానని చెబుతున్న నితీష్‌... అందరి నుంచి సానుకూలత వ్యక్తమైందన్నారు.

విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్! వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్‌ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారని సమాచారం. మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడానని నితీష్‌ చెబుతున్నారు. ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలో చాలా పార్టీలు ఏకతాటిపైకి వస్తాయని శుక్రవారం అంబేద్కర్ం జయంతి సందర్భంగా తన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

స‌మావేశాల‌న్నీ సానుకూలంగా, నిర్మాణాత్మ‌కంగా

విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త కోస‌మే కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల నేత‌ల‌తో తాను స‌మావేశ‌మైన‌ట్లు నితీశ్ కుమార్ తెలిపారు. తాను పాల్గొన్న స‌మావేశాల‌న్నీ సానుకూలంగా, నిర్మాణాత్మ‌కంగా జ‌రిగాయ‌న్నారు. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి, ఇత‌ర పార్టీల నేత‌ల‌తోనూ మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో కూలంకషంగా చర్చించానని, ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా అంగీకరించారని నితీష్ చెప్పుకొచ్చారు. మూడు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీ వచ్చిన నితీష్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. అందరి మద్దతు కూడగట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి వచ్చే పనిలో ఉన్నామన్నారు నితీష్‌. దీనిలో భాగంగా నిన్న సీపీఐతో కూడా మాట్లాడారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై నిర్ణయించుకునేందుకు విపక్షాలన్నీ ఒకచోట కూర్చుని చర్చించుకోవాలన్నది తన కోరిక అని నితీష్ స్పష్టం చేశారు.

త్వరలో కేసీఆర్, మమతతో భేటీ

బుధవారం రోజే కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో భేటీ కావడంతో విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌కు సమ దూరాన్ని పాటిస్తున్న పార్టీలతో చర్చించేందుకు నితీశ్‌ అంగీకరించినట్టు తెలుస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను  కలిశారు. త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారని సమాచారం.

నితీష్ కుమార్ ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతను ఏవిధంగా పటిష్టం చేయాలనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మనీ లాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈడీ ఎదుట హాజరైన రోజే బీహార్ నేతలిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ 2022 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో పర్యటించారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజా, సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ తోనూ చర్చలు జరిపారు. గత ఫిబ్రవరిలో  విపక్ష ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చెప్పారు.

అయితే, నితీష్ ఢిల్లీ పర్యటనపై బిహార్ బీజీపీ స్పందించింది. విపక్ష నేతల్లో ఐక్యత ఎండమావేనన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ లైట్ తీసుకున్నారు. ప్రధాని కావాలన్న ఆశలు తనకు లేవని నితీష్ కుమార్ అన్నారు. సమష్టిగా పోరాడితే బీజేపీని 100 సీట్లకు పరిమితం చేయవచ్చన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TPCC అధ్యక్షుడ్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆ మీడియాలో కథనాలతో బద్నాం చేయాలని చూస్తున్నారా?
TPCC అధ్యక్షుడ్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆ మీడియాలో కథనాలతో బద్నాం చేయాలని చూస్తున్నారా?
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
MK Stalin BJP Alliance: స్టాలిన్ ఎన్డీయేలోకి? బీజేపీ 2/3 మెజారిటీ వ్యూహం.. కాంగ్రెస్‌కు డీఎంకే రివర్స్ షాక్ ఇస్తుందా?
స్టాలిన్ ఎన్డీయేలోకి? బీజేపీ 2/3 మెజారిటీ వ్యూహం.. కాంగ్రెస్‌కు డీఎంకే రివర్స్ షాక్ ఇస్తుందా?
AP Rajya Sabha Elections 2026: ఏపీ రాజ్యసభ ఎన్నికలు 2026 - మిత్రపక్షాల కోసం టీడీపీ త్యాగాలు.. తమ్ముళ్లలో మొదలైన అసంతృప్తి!
ఏపీ రాజ్యసభ ఎన్నికలు 2026 - మిత్రపక్షాల కోసం టీడీపీ త్యాగాలు.. తమ్ముళ్లలో మొదలైన అసంతృప్తి!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీకు పడతాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనే.. ఇలా చెక్ చేసుకోండి
Drishyam 3 Collection Day 3: 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
Car Brake Failure: వేసవిలో బ్రేకులు ఫెయిలయ్యే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
వేసవిలో బ్రేకులు ఫెయిలయ్యే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
Embed widget