అన్వేషించండి

National News: కాంగ్రెస్‌ నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీ-రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ కీలక ప్రకటన

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీనే అని చెప్పారు. ముంబైలో జరగబోతున్న ప్రతిపక్ష కూటమి సమావేశాల ముందు ఈ ప్రకటన చేశారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలాగైనా బీజేపీ ఓడించాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే...ఈ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో రాజస్థాన్‌ సీఎం చేసిన ప్రకటన.. హాట్‌ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల తమ ప్రధాన అభ్యర్థి రాహుల్‌ గాంధీ అని ఆయన చెప్పారు. ముంబైలో జరగబోతున్న ప్రతిపక్షాల కూటమిలో అందరితో చర్చించి.. దీనిపై ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. అయితే... 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీనే అని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించిందన్నారు అశోక్‌ గెహ్లాట్‌.

2014లో బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందన్నారు గెహ్లాట్‌. మిగిలిన 69 శాతం ఆయనకు వ్యతిరేక ఓట్లే అని చెప్పారు. కనుక ప్రధాని మోడీ అహంకారంతో ఉండకూడదన్నారు గెహ్లాట్. గత నెలలో బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశం తర్వాత... ఎన్డీయేలో భయం మొదలైందని చెప్పారాయన. 2024 ఎన్నికల్లో 50శాతం ఓట్లతో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోతుందన్నారు. మోడీకి వ్యతిరేక ఓటు పెరుగుతోందని.. కనుక దాన్ని ఎప్పటికీ సాధించలేరని చెప్పారు. ఎన్‌డీఏకి ఓట్ల శాతం తగ్గుతోందని... 2024 ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం నిర్ధారణ అవుతుందన్నారు. ఆ ఫలితాల్లో ప్రధాని ఎవరో నిర్ణయిస్తాయని అన్నారు గెహ్లాట్‌. 

మోడీ మాట్లాడే తీరును కూడా అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భవిష్యత్తును అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని... ప్రజలే నిర్ణయించాలని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ప్రధాని మోడీ చేసిన అనేక హామీలు ఏమయ్యాయో... ప్రజలు గమనిస్తున్నారని గెహ్లాట్‌. ఇక, చంద్రయాన్-3 విజయవంతగా చంద్రుడిపై ల్యాండ్‌ అయ్యిందంటే.. .అందులో ఇందిరాగాంధీ, నెహ్రూ చేసిన కృషి కూడా ఎంతో ఉందన్నారు. గతంలో వారు చేసిన కృషి ఫలితంగానే ఇప్పుడు విజయాలు సాధిస్తున్నామన్నారు. నెహ్రూ వల్లే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో స్థాపించబడిందని ఆయన గుర్తుచేశారు. 

అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటనతో... ముంబై ప్రతిపక్షాల కూటమి సమావేశం తర్వాత చాలా విషయాలపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా... వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Embed widget