అన్వేషించండి

Lokesh : తప్పుడు ప్రచారం చేసే ఎవర్నీ వదిలి పెట్టం - ఇప్పుడే ప్రారంభమయిందన్న నారా లోకేష్ !

తప్పుడు ప్రచారం చేసే మీడియా సంస్థలను వదిలి పెట్టబోమని నారా లోకేష్ హెచ్చరించారు. తెలుగు, ఇంగ్లిష్ పత్రికలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టు ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తనపై వైఎస్ఆర్‌సీపీకి ( YSRCP ) చెందిన కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) విమర్శించారు. ఈ విషయంలో ఇక సహనంతో ఉండేది లేదని న్యాయపోరాటం ద్వారా తేల్చుకుంటానన్నారు. విశాఖ కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ తెలుగు, మరో ఇంగ్లిష్ దినపత్రికలపై లోకేష్ రూ.75 కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 

అరెస్ట్‌కు సన్నాహాలు - అయ్యన్న మాస్టర్ ప్లాన్ ! వెనక్కి పోలీసులు...

2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో  లోకేష్ ప్రజాధనం తో  రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో ( Vizag ) లేనని ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ లోకేష్ వివరణ ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. ఆ వార్తను ప్రచురించిన ఓ పత్రిక క్షమాపణలు చెప్పింది కానీ తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు పట్టించుకోలేదని.. కనీసం తన వివరణ కూడా ప్రచురించలేదన్నారు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నానన్నారు. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. 

సంపాదించకుండా ఖర్చు పెడితే దివాలానే - ఏపీనే సాక్ష్యమన్న బీజేపీ ! జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

రాజకీయాల్లోకి రాక ముందు నుంచే  వ్యక్తిగత జీవితంపై కూడా  బురద జల్లారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని లోకేష్ విమర్శించారు.    వేటికీ భయపడను..తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.  అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని కించపర్చేలా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మేం మాట్లాడితే.. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. కానీ అది మా మా సంస్కృతి కాదు. ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశాను. నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టననని లోకేష్ స్పష్టం చేశారు. 

పరువు నష్టం దావా విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ వచ్చారు. దీనిపై కౌంటర్ వేయడానికి ఇతర మీడియా సంస్థలు సమయం కావాలని అడిగాయి. ఇప్పటికే పలుమార్లు అలా అడగడంతో న్యాయమూర్తి ఎక్కువ సమయం ఇవ్వలేమని 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Padayatra season in Telugu politics: 2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?
2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?
KTR Vs Kavitha: కేటీఆర్ తల్లిదండ్రుల సెంటిమెంట్ - కవిత నిరాదరణ ఆవేదన - ఎవరిది నిజం?
కేటీఆర్ తల్లిదండ్రుల సెంటిమెంట్ - కవిత నిరాదరణ ఆవేదన - ఎవరిది నిజం?

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget