అన్వేషించండి

AP BJP : సంపాదించకుండా ఖర్చు పెడితే దివాలానే - ఏపీనే సాక్ష్యమన్న బీజేపీ ! జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

అప్పులు చేసి పంచడం వల్లే ఏపీ దివాలా స్థితికి చేరిందని ఏపీ బీజేపీ నేతలు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను చూసి నేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

 

ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ గొప్పదనాన్ని వివరిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను విశ్లేషించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలనుఏపీ బీజేపీ నిర్వహిస్తోంది.  ‘5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసిన కేంద్ర బడ్జెట్‌ .. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం’ అనే అంశంపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఇందులో బీజేపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఏపీ బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్న మాజీ సీఎస్ ఐవైఆర్ రామకృష్ణారావు 
నిర్వహించిన సమావేశంలో ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడారు. ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్లు బాగుపడినట్లు ఎక్కడా లేదని  అది వ్యక్తి అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ఇదే జరుగుతుందని తేల్చి చెప్పారు.


బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్‌ను చూడాలని.. ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే.. ఏపీ బడ్జెట్‌ను చూడాలన్నారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 37 వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించిందని కానీ ఇప్పటికే  రూ. 57 వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్‌ నొక్కి  పంచేశారని విమర్శించారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలకు పంచుతామనే విధానానికి చరమగీతం పాడాల్సి ఉందన్నారు.  ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.ఆంధ్రప్రదేశ్‌ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు బడ్జెట్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఐవైఆర్ కోరారు. అప్పుడే విచ్చలవిడి తనాన్ని కట్టడి చేయగలమని అభిప్రాయపడ్డారు.  సీఎం జగన్‌ తన సొంత డబ్బు తెచ్చి పంచడం లేదని ఐ  ఈ భారం మొత్తం ఏపీ ప్రజలు మోయాల్సిందేనన్నారు. 

 ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.  2015 -16 లో రూ. 27,990 కోట్ల నిధులిస్తే 2020-21 మూడు రెట్లు అధికంగా అంటే  రూ. 77,538 కోట్లు  కేంద్రం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆరేళ్లలో ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లిస్తోందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లలో రాజధానిని నిర్మించలేకపోయారని, తానొచ్చిన పూర్తి చేస్తానన్న జగన్.. అసలు రాజధానే లేకుండా చేశారంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించుకుంటే రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని.. కానీ విభజన తర్వాత రాష్ట్రానికి దిశ, దశ లేకుండా పోయిందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Politics: పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?
పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?
Next Chandrababu: రాజ్యసభకు ఇవాళ నితీష్, రేపు చంద్రబాబేనా? - మోదీ , షా ప్లాన్ చేస్తున్నారా?
రాజ్యసభకు ఇవాళ నితీష్, రేపు చంద్రబాబేనా? - మోదీ , షా ప్లాన్ చేస్తున్నారా?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Embed widget