By: ABP Desam | Updated at : 14 May 2022 04:41 PM (IST)
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. వచ్చి రాగానే ఆయన అధికారిక పర్యటన లో భాగంగా నేషనల్ సైన్స్ లేబోరేటరీని సందర్శించారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరినీ ప్రారంభించారు.. తర్వాత పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వతా సభకు హాజరవుతారు. అమిత్ షా ప్రసంగం అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అటు టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ తెలంగాణ అగ్రనేతలు అమిత్ షాకు ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానాలు చెప్పాలన్నారు. బహిరంగసభా వేదిక నుంచి వాటికి అమిత్ షా రిప్లై ఇస్తారా లేదా అన్న ఆసక్తి ప్రారంభమయింది.
Telangana | Union Home Minister Amit Shah inaugurated the ‘National Cyber Forensic Laboratory’ (NCFL) at Central Forensic Science Laboratory (CFSL) campus in Hyderabad. pic.twitter.com/Lq1elqc9Re
— ANI (@ANI) May 14, 2022
అమిత్షాకు కేటీఆర్ 27 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు బీజేపీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.. బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. ఇరవై ఏడు ప్రశ్నలన్నీ.. కేంద్రం నుంచి తెలంగామకు రావాల్సిన ప్రాజెక్టులు.. ప్రయోజనాలు.. నిధులకు సంబంధించినవే. ప్రతిసారి వచ్చి స్పీచులు ఇచ్చి వెళ్లిపోవడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని ఈ సారి సమాధానం చెప్పాల్సిందేనన్నారు.
HM @AmitShah Ji,
Since you’re visiting #Telangana today, request you to clarify on the discriminatory & vindictive attitude of Union Govt towards our state
Below is the question paper👇
The people of Telangana are looking forward to getting enlightened with your answers pic.twitter.com/ytNKwEyXot— KTR (@KTRTRS) May 14, 2022
ఇక కేటీఆర్ సోదరి.. ఎమ్మెల్సీ కవిత కూడా అమిత్ షాకు ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు. ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.
Shri @AmitShah Ji welcome to Telangana !! please tell the people of Telangana when will the central government clear the following ::
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 14, 2022
❗️Dues of Finance Comission Grants : Over Rs 3000 crores
❗️Backward Region Grant : Rs 1350 crore
❗️GST Compensation: Rs 2247 crore 1/5
టీఆర్ఎస్తో కలిసి తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మరో లేఖ రాశారు.
అమిత్ షా గారూ…
— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022
‘ఛీ’ఆర్ఎస్ తో సావాసం…
తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు…
తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు… వీటిపై నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పండి. pic.twitter.com/lnMaDrkNnx
అమిత్ షాకు ఇలా తెలంగాణ అగ్రనేతలందరి నుంచి ప్రశ్నలు వెళ్లాయి. ఈ ప్రశ్నలేనే ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియాలో సర్క్యూరేట్ చేస్తున్నారు. అమిత్ షాను ప్రశ్నిస్తూ హ్యాష్ ట్యాగ్లు పెట్టి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తుక్కుగూడ సభలో వీటన్నింటిపై స్పందిస్తారా లేకపోతే లైట్ తీసుకుంటారా అన్నదానిపై అంతటా ఆసక్తి ఏర్పడింది.
హైదరాబాద్లోని CFSL క్యాంపస్లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించేందుకు నేడు తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నాను.
— Amit Shah (@AmitShah) May 14, 2022
జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు
Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్
Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట
YSRCP I PAC : ప్రశాంత్ కిషోర్ లేని లోటు తెలుస్తోందా ? వైఎస్ఆర్సీపీలో అంతర్మథనం !
Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్
Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !
మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్ఎస్- హింట్ ఇచ్చిన హరీష్
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్ను నా రూమ్కు పిలిచి నిద్రపోయా
బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు
/body>