అన్వేషించండి

Khammam Politics: ఆ ద్రోహులెవరు? సంచలనంగా మారిన తుమ్మల వ్యాఖ్యలు, టీఆర్ఎస్‌లో కలకలం!

పాలేరు నియోజకవర్గ పర్యటనలో బాగంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం రేపుతున్నాయి.

Khammam News: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గతంగానే ఒకరిపై మరొక్కరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రోజుకొక్క సంచలనాలు సృష్టిస్తున్నారు. ఓ వైపు అదే పార్టీకి చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగుతుండగా అగ్రనేతలు మాత్రం తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతుంది. 
ద్రోహులెవరు..? శత్రువులెవరు..?
పాలేరు నియోజకవర్గ పర్యటనలో బాగంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం రేపుతున్నాయి. రాజకీయ శత్రువులతో తమకు ఇబ్బంది ఉండబోదని, పార్టీలో ఉన్న ద్రోహులతోనే ఇబ్బంది అంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ పార్టీ ఓటమికి పాల్పడే వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే ఇంతకీ పార్టీలో ఉంటూ పార్టీ ఓటమికి కారణం ఎవరయ్యారు..? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే విషయంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. అప్పటి వరకు మంత్రిగా ఉండి గెలుపుపై దీమాగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం ఓటమి పాలయ్యారు. ఈ విషయంపై అప్పట్లో టీఆర్‌ఎస్‌ అధిష్టానంలో విస్త్రతంగా చర్చ సాగింది. ఈ విషయంపై ఒటమి పాలైన నేతలు తమకు సహకరించని వారిపై పిర్యాదులు చేశారు. ఈ విషయంపైనే తుమ్మల వ్యాఖ్యలు చేశారా..? తన ఓటమికి టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలే కారణమయ్యారనే విషయాన్ని ఇప్పుడు మళ్లీ వెలికి తీస్తున్నారా..? అనే విషయంపై చర్చ సాగుతుంది. ఇంతకీ తుమ్మలకు వెన్నుపోటు పొడిచిన టీఆర్‌ఎస్‌ నేతలెవరనేదానిపై కలవరం మొదలైంది. 
పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్న మంత్రి పువ్వాడ..
గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలోని అంతర్గత విబేదాలు రోడ్డుకెక్కాయి. పినపాక నియోజకవర్గంలో విప్‌ రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాల మద్య అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ విషయంపై దాడులు చేసుకున్నారు. వైరా నియోజకవర్గంలోని మదన్‌లాల్‌ వర్గీయులపై జూలూరుపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఏకంగా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపై మరొక్కరు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం లేపుతున్నారు. జిల్లాకు పార్టీ పెద్దన్నలా వ్యవహరించాల్సిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాత్రం ఈ విషయాలపై అంతగా పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాడనే విమర్శలు నెలకొన్నాయి. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంపై దృష్టి పెడుతున్న మంత్రి పువ్వాడ జిల్లాలో నెలకొన్న అంతర్గత పోరును సద్దుమణిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చెప్పవచ్చు.

అయితే అన్ని విషయాలు అధిష్టానం చూసుకుంటుందని, ఇలాంటి విషయాల్లో తాను తలదూర్చి కొత్తగా తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనే దిశగా మంత్రి పువ్వాడ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో నెలకొన్న ప్రస్తుత అంతర్గత పోరు రానున్న ఎన్నికల్లో పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశాలు లేకపోలేదనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమికి తమ నేతలే ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకున్నారని వ్యాఖ్యానించడం, మరోసారి కూడా ఇది పునరావృతం అయ్యే అవకాశాలు మాత్రం లేకపోలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget