అన్వేషించండి

Nizamabad Kavita : నిజామాబాద్ రాజకీయాల్లో కవిత కలకలం - ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?

నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై కల్వకుంట్ల కవిత పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సీఎం పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని వెళ్లిపోయారు.


Nizamabad Kavita :  నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. కలెక్టరేట్ ప్రారంభించారు. బహిరంగసభలో ప్రసంగించారు. టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అయితే ఓ డౌట్ మాత్రం మిగిలిపోయింది. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాల్ని శాసిస్తారన్న పేరున్న కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హడావుడి పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కేవలం బహిరంగసభకు హాజరై.. వెళ్లిపోయారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. ప్రసంగించలేదు. దీంతో టీఆర్ఎస్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 

నిజామాబాద్ టీఆర్ఎస్‌కు కల్వకుంట్ల కవిత ఎంత చెబితే అంత ! 
 
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించే నాయకురాలు ఎమ్మెల్సీ కవిత. జిల్లాలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించే కవిత తాజాగా  నిజామాబాద్ లో జరిగిన సీఎం కార్యక్రమాల్లో సైలెంట్ గా ఉండిపోయారు.  జిల్లాకు సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. కానీ ఈసారి ఆ సిన్ కనిపించలేదు. సీఎం సభ ఏర్పాట్లలో కూడా ఆమె ప్రమేయం లేకుండా పోయింది. నూతనంగా నిర్మించిన జిల్లా టీఆరెస్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో కూడా కవిత కనిపోయించలేదు. నేరుగా బహిరంగ సభ స్థలికి చేరుకున్నారు. సీఎం సభ ముగియగానే వెళ్లిపోయారు. కనీసం పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కవిత పెద్దగా మాట్లాడలేదు.  

పర్యటన ఏర్పాట్లను కూడా ఎందుకు పట్టించుకోలేదు ? 
 
జిల్లాలో ఎప్పుడూ సీఎం సభలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత అన్నీ తానై వ్యవహరించేవారు. సభ ప్రాంగణం మొదలుకుని జన సమీకరణ ఇలా ప్రతి అంశంలో కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు.    సీఎం కేసీఆర్ సభ అంటే ముందుగానే జిల్లాలోనే ఉండే కవిత సీఎం కేసీఆర్ సభకు చేరుకునే అరగంట ముందు సభ స్థలికి చేరుకోవటంపై జిల్లా టీఆరెస్ శ్రేణులు ఆలోచనలో పడ్డారు.  జిల్లాలో టీఆరెస్ శ్రేణులకు పెద్ద దిక్కుగా ఉన్న కవిత కొంత కాలంగా జిల్లాకు దూరంగా ఉండటం సీఎం కేసీఆర్ సభ ఉండటం కనీసం సభ ఏర్పాట్లను చూసేందుకైనా రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నిజామాబాద్ నుంచి పోటీ చేసే ఆలోచనలో లేరా ?

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత  ప్రత్యక్ష రాజకీయాలు కొంత కాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. ఇటీవలి కాలంలో మళ్లీ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి  పోటీ చేయాలన్న ఉద్దేశంతో తరచూ పర్యటిస్తున్నారు. అయితే హఠాత్తుగా అవి కూడా నిలిపివేశారు. పూర్తి స్థాయిలో మౌనం వహిస్తున్నారు. నిజామాబాద్ నేతలు కూడా ఆమె మౌనానికి కారణం ఏమిటన్నదానిపై  గుంభనంగా వ్యవహరిస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలే కారణమా ?  
 
ఇటీవల కాలంలో కవిత నిజామాబాద్ జిల్లా పై ఫోకస్ పెట్టడం తగ్గించారని  పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితపై ఆరోపణలు రావడంతో  ఆమె కొంత సైలెంట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది.  సీఎం సభలో ప్రసంగించిన ఎమ్మెల్యేలు సైతం కవిత పేరు ఎత్తకపోవటం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసినట్లయింది. కారణం ఏదైనా కవిత ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget