అన్వేషించండి

Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?

KCR: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయవచ్చని భావిస్తున్నరు.

Kaleshwaram case is reaching KCR: తెలంగాణలో న్యాయవిచారణలు కీలక దశకు చేరుకుటున్నాయి.  కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌కు కీలకమైన ఆధారాలు లభించాయని అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయన్న  ప్రచారం ఊపందుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నల్లా వెంకటేశ్వర్లు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను న్యాయ విచారణ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌కు అందజేశారు. గతంలోనూ ఆయనను కమిషన్ పిలిచి ప్రశ్నించింది. ఇప్పుడు ఆయన ఒక్కటి కూడా దాచుకోకుండా పూర్తి వివరాలు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. 

విచారణ కమిషన్ వద్ద డీపీఆర్                  

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్‌దేనని ఇప్పటి వరకూ విచారణకు హాజరైన అధికారులు చెబుతూ వచ్చారు.  నిర్ణయాలు, అధికారిక వ్యవహారాలు, ప్లానింగ్‌, డిజైనింగ్‌, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అన్ని వివరాలనూ విచారణ కమిషన్ సేకరించింది.  డీపీఆర్‌ అంశాలు కూడా కమిషన్‌కు చేరాయని భావిస్తున్నారు.  డీపీఆర్‌ను  అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదించారని అధికారులు స్ప,్టం చేశారు.  కాళేశ్వరం డిజైన్లనూ ఫైనల్‌ చేయాలని కేసీఆర్‌ ఆదేశించారని ఇందుకు సంబంధించి పలు సమావేశాలు, మినిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు, మూడు బ్యారేజీల వివరాలను కమిషన్‌కు చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది.  

ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న

ఆ ఫైళ్లలోనే కీలక ఆధారాలు                     
 
విచారణ కమిషన్‌కు చేరిన ఫైళ్లలో ఉన్నతాధికారులు, కాళేశ్వరం బాధ్యతలు చూసిన సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, ఏఈలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి.   మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయనీ, అందులో బ్లాకులు కుంగడానికి, సీపేజీలు రావడానికి పిల్లర్ల కింద ఇసుక కదిలిపోవడమే కారణమని  ఇప్పటికే నివేదికలు ఇచ్చారు. పీసీ ఘోష్ కమిషన్  అధికారుల స్థాయిలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కూడా చేస్తున్నారు. దీంతో అధికారులు ఒక్కటి కూడా దాచడానికి అవకాశం లేకుండా పోతోంది. ఆ ప్రాజెక్టు వ్యవహారంలో జరిగింది మొత్తం విచారణ కమిషన్‌కు వెల్లడించారని చెబుతున్నారు. 

తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!

నెక్ట్స్ కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు 

అధికారుల స్థాయిలో విచారణ దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి విచారణకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను పిలిచే అవకాశం ఉందని జలసౌధలో ప్రచారం జరుగుతోంది.  అధికారుల వాంగ్మూలాలు అన్ని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావును బుక్ చేసేలా ఉన్నాయి.  ప్రాజెక్టు వైఫల్యానికి కారకులను తేల్చే క్రమంలో ఎవరినైనా పిలుస్తామనీ, విచారణకు రాకపోతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుం టామని గతంలో  జస్టిస్‌ ఘోష్‌ చెబుతున్నారు.   ఎన్డీఎస్‌ఏ, పోలీస్‌ విజిలెన్స్‌ నివేదికల ఆధారంగా కమిషన్‌ విచారణ చేస్తారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తే ఈ కేసు సంచలనం అవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
IND vs PAK Champions Trophy: భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్
భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్ విశ్లేష‌ణ‌
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
Embed widget