అన్వేషించండి

Pawan Kalyan: భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన - టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం, పోటీపై క్లారిటీ!

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనలో భాగంగా టీడీపీ ముఖ్య నేతలతో చర్చించారు. తాను ఈసారి ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేస్తానని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.

Janasenani Pawan Kalyan Bhimavaram Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఇళ్లకు వెళ్లి కలిశారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ - జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని.. దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే మనందరి లక్ష్యమని వారికి వివరించారు. తాను వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేస్తున్నానని.. తనకు మద్దతు ఇవ్వాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఓ చోట పోటీపై స్పష్టత వచ్చినట్లయింది. 


Pawan Kalyan: భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన - టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం, పోటీపై క్లారిటీ!

అలాగే, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీపాకా సత్యనారాయణ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకుముందు భీమవరంలో పవన్ కు ఇరు పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనసైనికుల నినాదాలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన పర్యటన సాగింది. భీమవరం పర్యటన అనంతరం జరిగే టీడీపీ - జనసేన నేతల సమావేశంలో పొత్తులు, ఎన్నికల కార్యాచరణపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలి.? ఎక్కడ జనసేన బలంగా ఉంది.? అనే దానిపై భేటీలో నేతల అభిప్రాయం తీసుకోనున్నారు.
Pawan Kalyan: భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన - టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం, పోటీపై క్లారిటీ!


Pawan Kalyan: భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన - టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం, పోటీపై క్లారిటీ!

పవన్ ఢిల్లీ పర్యటన

మరోవైపు, భీమవరం పర్యటన అనంతరం పవన్ కల్యాణ‌్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పొత్తులు, ఏపీలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 

ఈ నెల 22న జాబితా

అటు, జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు పవన్ సమన్వయకర్తలను నియమించారు. ఈ నెల 22 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన ఖరారు చేయనున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా కలిసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అధిష్టానాన్ని కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు, సీట్ల వ్యవహారంపై చర్చించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాతే జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు జనసేన నాయకులు అంటున్నారు.

ఇక, భీమవరం నుంచే పోటీ చేస్తానని టీడీపీ నేతలకు చెప్పిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి.. ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వెల్లడించారు.

Also Read: Stay On DSC: హైకోర్టు 'స్టే'తో ఆందోళనలో బీఈడీ అభ్యర్థులు, ఫీజు కట్టి అప్లయ్ చేసిన వారి పరిస్థితి ఏంటీ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget