అన్వేషించండి

Jagan strategies: టీడీపీ కీలక స్థానాలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ - దీటైన అభ్యర్థుల ఎంపిక

Jagan Focus: తెలుగుదేశం కీలక స్థానాలపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైనాట్ 175 అంటున్న జగన్.. కుప్పం, మంగళగిరి, పిఠాపురంపై ప్రత్యేక దృష్టిసారించింది.

CM Jagan More Focus on Three Seats: కుప్పం, మంగళగిరి సహా  వైనాటు 175 నినాదంతో ప్రచారంలో  దూసుకుపోతున్న అధికారపార్టీ వైసీపీ(YCP).. .తెలుగుదేశం(TDP) కీలక స్థానాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh), పవన్(Pavankalyan) కల్యాణ్ సహా అచ్చెన్నాయుడు, మహాసేన రాజేశ్ తో పాటు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన స్థానాలపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

అదే లక్ష్యం

కుప్పం(Kuppam)లో అప్రతిహాతంగా  ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబును ఓడించేలా జగన్(Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం మూడేళ్లుగా ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశానికి టీజర్ చూపించి.. చంద్రబాబు పర్యటనను అడ్డుకుని ట్రైలర్ విడుదల చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సినిమా చూపిస్తామని చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరుపైనా అంత శ్రద్ధ చూపని పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేసి పనులు చక్కబెడుతున్నారు. 

ఇక మరో కీలకస్థానం లోకేశ్(Lokesh) పోటీ చేస్తున్న మంగళగిరి(Mangalagiri)పై జగన్ దృష్టి పెట్టారు. మరోసారి లోకేశ్ ను అక్కడ ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న నేతకార్మికులకు గాలం వేసిన వైసీపీ... తెలుగుదేశం పార్టీలో ఉన్న గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకుని పార్టీ  నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే యువగళం పాదయాత్రలు, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనల్లో బిజీగా ఉన్నా...  ఏదో రకంగా లోకేశ్ మంగళగిరి ప్రజలను కలుస్తూనే ఉన్నారు. ఈ మధ్య పర్యటనలకు విరామం ఇచ్చి పూర్తిగా మంగళగిరపైనే ఫోకస్ పెట్టారు. సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్.. చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను రంగంలోకి దింపారు. అయితే, టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవి ఇప్పుడు ఏం చేస్తారోననే ఆసక్తి నెలకొంది.

పవన్ పై ప్రత్యేక దృష్టి

ఇక తనపై ఒంటికాలిపై లేస్తున్న పవన్ కల్యాణ్(Pavan Kalyan) కు చెక్ పెట్టేలా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఈసారి పవన్ కచ్చితంగా పిఠాపురం(Pitapauram) నుంచే పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పటికే అక్కడ ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ వంగాగీత(Vanga Geetha)ను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. పవన్ కు దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని (Mudhragada Padmanabham) పార్టీలోకి తీసుకుని ఆయన్ను పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పై బరిలో దింపాలని యోచిస్తున్నారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ వ్యాఖ్యలు, దీనికి బదులుగా ముద్రగడ పద్మనాభం లేఖ రాయడాన్ని చూస్తే... ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో జనసేనలో చేరే అవకాశం కనిపించకపోవడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేలా సంప్రదింపులు జరుగుతున్నాయి.

కంచుకోటకు బీటలు

వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో  ఒక్కొక్కరూ ఆ పార్టీని వీడుతుండటంతో బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసినా కీలకమైన నేతలంతా ఆ పార్టీని వీడారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్(Vemireddy Prabhakar Reddy) రెడ్డి సైతం తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని నెల్లూరు లోక్ సభ బరిలో దింపేందుకు ఆదాలను అసెంబ్లీ స్థానానికి పంపారు. తీరా ఇప్పుడు వేమిరెడ్డి జగన్ కు చేయిచ్చారు. ఇలా ఒక్కొక్కరూ పార్టీ వీడుతుండటంతో నెల్లూరు జిల్లాపై జగన్ దృష్టి సారించారు. పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నారు. వేమిరెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవడంతో పాటు... జిల్లాలో చేజారిపోతున్న నేతలను కాపాడుకునే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన నేతలెవ్వరూ గెలవడానికి వీల్లేదని జగన్ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)ని స్పష్టం చేసినట్లు తెలిసింది. అచ్చెన్నాయుడు, రామానాయుడు,  మహాసేన రాజేశ్ సహా జగన్ పై ఒంటికాలుపై లేచే నేతలెవ్వరూ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదని గట్టిగానే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలపై వైసీపీ కేడర్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Elon Muskతో పనిచేసే అవకాశం, టాలంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Medchal Latest News: బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
Embed widget