అన్వేషించండి

Jagan strategies: టీడీపీ కీలక స్థానాలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ - దీటైన అభ్యర్థుల ఎంపిక

Jagan Focus: తెలుగుదేశం కీలక స్థానాలపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైనాట్ 175 అంటున్న జగన్.. కుప్పం, మంగళగిరి, పిఠాపురంపై ప్రత్యేక దృష్టిసారించింది.

CM Jagan More Focus on Three Seats: కుప్పం, మంగళగిరి సహా  వైనాటు 175 నినాదంతో ప్రచారంలో  దూసుకుపోతున్న అధికారపార్టీ వైసీపీ(YCP).. .తెలుగుదేశం(TDP) కీలక స్థానాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh), పవన్(Pavankalyan) కల్యాణ్ సహా అచ్చెన్నాయుడు, మహాసేన రాజేశ్ తో పాటు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన స్థానాలపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

అదే లక్ష్యం

కుప్పం(Kuppam)లో అప్రతిహాతంగా  ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబును ఓడించేలా జగన్(Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం మూడేళ్లుగా ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశానికి టీజర్ చూపించి.. చంద్రబాబు పర్యటనను అడ్డుకుని ట్రైలర్ విడుదల చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సినిమా చూపిస్తామని చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరుపైనా అంత శ్రద్ధ చూపని పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేసి పనులు చక్కబెడుతున్నారు. 

ఇక మరో కీలకస్థానం లోకేశ్(Lokesh) పోటీ చేస్తున్న మంగళగిరి(Mangalagiri)పై జగన్ దృష్టి పెట్టారు. మరోసారి లోకేశ్ ను అక్కడ ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న నేతకార్మికులకు గాలం వేసిన వైసీపీ... తెలుగుదేశం పార్టీలో ఉన్న గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకుని పార్టీ  నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే యువగళం పాదయాత్రలు, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనల్లో బిజీగా ఉన్నా...  ఏదో రకంగా లోకేశ్ మంగళగిరి ప్రజలను కలుస్తూనే ఉన్నారు. ఈ మధ్య పర్యటనలకు విరామం ఇచ్చి పూర్తిగా మంగళగిరపైనే ఫోకస్ పెట్టారు. సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్.. చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను రంగంలోకి దింపారు. అయితే, టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవి ఇప్పుడు ఏం చేస్తారోననే ఆసక్తి నెలకొంది.

పవన్ పై ప్రత్యేక దృష్టి

ఇక తనపై ఒంటికాలిపై లేస్తున్న పవన్ కల్యాణ్(Pavan Kalyan) కు చెక్ పెట్టేలా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఈసారి పవన్ కచ్చితంగా పిఠాపురం(Pitapauram) నుంచే పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పటికే అక్కడ ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ వంగాగీత(Vanga Geetha)ను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. పవన్ కు దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని (Mudhragada Padmanabham) పార్టీలోకి తీసుకుని ఆయన్ను పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పై బరిలో దింపాలని యోచిస్తున్నారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ వ్యాఖ్యలు, దీనికి బదులుగా ముద్రగడ పద్మనాభం లేఖ రాయడాన్ని చూస్తే... ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో జనసేనలో చేరే అవకాశం కనిపించకపోవడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేలా సంప్రదింపులు జరుగుతున్నాయి.

కంచుకోటకు బీటలు

వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో  ఒక్కొక్కరూ ఆ పార్టీని వీడుతుండటంతో బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసినా కీలకమైన నేతలంతా ఆ పార్టీని వీడారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్(Vemireddy Prabhakar Reddy) రెడ్డి సైతం తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని నెల్లూరు లోక్ సభ బరిలో దింపేందుకు ఆదాలను అసెంబ్లీ స్థానానికి పంపారు. తీరా ఇప్పుడు వేమిరెడ్డి జగన్ కు చేయిచ్చారు. ఇలా ఒక్కొక్కరూ పార్టీ వీడుతుండటంతో నెల్లూరు జిల్లాపై జగన్ దృష్టి సారించారు. పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నారు. వేమిరెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవడంతో పాటు... జిల్లాలో చేజారిపోతున్న నేతలను కాపాడుకునే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన నేతలెవ్వరూ గెలవడానికి వీల్లేదని జగన్ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)ని స్పష్టం చేసినట్లు తెలిసింది. అచ్చెన్నాయుడు, రామానాయుడు,  మహాసేన రాజేశ్ సహా జగన్ పై ఒంటికాలుపై లేచే నేతలెవ్వరూ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదని గట్టిగానే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలపై వైసీపీ కేడర్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

టాప్ హెడ్ లైన్స్

MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget