అన్వేషించండి

Jagan Petitions in Courts : ప్రతిపక్ష హోదా , సీఎం స్థాయి సెక్యూరిటీ కోసం పిటిషన్లు - జగన్ ప్లాన్ ఎవరూ ఊహించలేరా ?

YSRCP : న్యాయనిపుణులు ఆశ్చర్యపోయే పిటిషన్లు కోర్టుల్లో వేస్తున్నారు జగన్ . ఏ చట్టం ప్రకారం చూసినా అనుకూల నిర్ణయం రాదని తెలిసి కూడా ఈ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు ? దీని వెనుక వ్యూహం ఏమిటి?

Jagan Petitions : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి  ఇటీవలి కాలంలో రెండు అంశాల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని .. మరొకటి తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పిచాలని ఆదేశించాలని కోరుతూదాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు కాస్త అతిశయంగా ఉన్నాయని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవు...  అలాగే సీఎంలకు మాత్రమే సీఎం స్థాయి సెక్యూరిటీ ఇస్తారు కానీ ఇతరులకు ఇవ్వరు. ఈ విషయాలపై కనీస అవగాహన జగన్ లీగల్ టీమ్‌కు ఉండదా ..?.  అయినా ఎందుకు పిటిషన్లు దాఖలు చేశారు ?

సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యం ? 

చీఫ్ మినిస్టర్ అంటే ప్రభుత్వాధినేత. ఆయనకు ఇచ్చే  భద్రతను ప్రతిపక్ష నేత హోదా కూడా లేని తనకు కేటాయించాలని..  తాను సీఎంగా ఉన్నప్పుడు అంటే జూన్ మూడో తేదీన తనకు ఉన్న సెక్యూరిటీని తనకు కల్పించాలని జగన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  రాజకీయ నేతలకు హోదాల ప్రకారం భద్రత కల్పించేందుకు పక్కా నిబంధనల ఉన్నాయి. అలాగే పోలీసు డిపార్టుమెంట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది. ఎవరికి భద్రత. .. ఎంత మేర కల్పించాలో డిసైడ్ చేస్తారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కానీ జగన్ తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని.. కనీసం 900 మందితో సెక్యూరిటీ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది చాలా అతిశయోక్తిగా ఉందని.. కోర్టు ఏ విధంగానూ ఆయనకు సీఎం రేంజ్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించలేదని టీడీపీకి చెందిన న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. 

  ఏపీలో మరో 3 విమానాశ్రయాలు, 4 కొత్త పోర్టులు, మళ్లీ నెంబర్ 1 అవ్వాలి - సీఎం చంద్రబాబు

గతంలో చంద్రబాబుకు భారీగా భద్రత తగ్గింపు

2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆయన సెక్యూరిటీని భారీగా తగ్గించారు.  ఫోర్ ప్లస్ ఫోర్‌కు తగ్గించారు. చంద్రబాబుకు కేంద్ర ప్రభత్వం ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ కల్పించింది. దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఆయనపై ఓ సారి నక్సల్స్ హత్యాయత్నం చేశారు. ఇంత క్రిటికల్ అయినప్పటికీ చంద్రబాబుకు రాష్ట్ర పరంగా భద్రత తగ్గించారు.  ఎన్‌ఎస్జీ భద్రత ఉన్నప్పటికీ ఆయనపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ రాళ్లు వేయడాన్ని అప్పటి డీజీపీ ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసనగా చెప్పి సమర్థించారు కూడా.  కుప్పంలో.. అంగళ్లులో.. మార్కాపురంలో..  నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ సమయంలో భద్రతాధికారులు గాయపడ్డారు కూడా. తన సెక్యూరిటీపై చంద్రబాబు పలుమార్లు  హైకోర్టుకు వెళ్లారు.  కానీ నిబంధనల ప్రకారం   భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది.  చివరికి భద్రత సరిపోవడం లేదని కేంద్రం ఎన్ఎస్‌జీ సిబ్బందిని రెట్టింపు చేయాల్సి వచ్చింది.  చంద్రబాబుకు ఇవ్వలేని సెక్యూరిటీ ఇప్పుడు తనకు కావాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. 

నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు - వడివడిగా కృష్ణమ్మ పరుగులు

ప్రతిపక్ష నేత హోదా కోసమూ న్యాయపోరాటం !

జగన్ మాజీ సీఎం హోదాలో మాత్రమే ఉన్నారు.  ప్రతిపక్ష నేతగా కూడా లేరు. ఆ హోదా కూడా కోర్టే ఇప్పించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.  ఆ పిటిషన్‌కు అసలు విచారణ అర్హతా ఉందా లేదా అన్నది తేల్చాలని కోర్టు నిర్ణయించింది. ఒక వేళ విచారణ అర్హత ఉంటే... అప్పుడు తదుపరి విచారణ జరుపుతారు. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జరిగిన .. జరుగుతున్న రాజకీయాలను చూస్తే... స్పీకర్ ను ఏ విషయంలోనూ ముఖ్యంగా సభా వ్యవహారాల విషయంలో కోర్టులు ఆదేశించలేవని అర్థం చేసుకోవచ్చు. జగన్ కు సాధారణంగా ప్రతిపక్ష నేత హోదాకు అర్హత ఉంటే.. రాజ్యాంగపరంగా లభిస్తుంది. అలాంటి చాన్స్ లేదు కాబట్టే ఆయన కోర్టుకు వెళ్లారు.  పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్ష గుర్తింపు ఉన్న పార్టీ లేదు.  అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలైనా అనుకూల ఫలితం రాకపోతే సైలెంట్ అయిపోయారు. అందుకే జగన్ వేసిన పిటిషన్‌కు విచారణార్హతే ఉండనది టీడీపీ గట్టిగా వాదిస్తోంది. 

కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలినా సానుభూతిగా మల్చుకోవాలనుకుంటున్నారా ?

వైసీపీ అధినేత రాజకీయ వ్యూహంలో భాగంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారన్న అభిప్రాయం  వినిపిస్తోంది. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలితే  వైసీపీ నేతలు సహజంగానే చంద్రబాబు కోర్టుల్ని మేనేజ్ చేశారన్న ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గతంలో పలుమార్లు ఇదే తరహా ఆరోపణలు చేశారు. అదే సమయంలో తమకు న్యాయం జరగడం లేదని ప్రజల వద్దకు వెళ్లి సానుభూతి కోసం ప్రయత్నించేందుకు ఓ అస్త్రంగా వాడుకుంటారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎదురు దెబ్బలు తగులుతాయని తెలిసి కూడా అసాధారణమైన పిటిషన్లు దాఖలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget