India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్సీపీ సిద్దమని సంకేతాలు ?
Andhra Pradesh: ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీ సిద్దమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నేతృత్వం వహించడాన్ని విజయసాయిరెడ్డి స్వాగతిస్తున్నారు.

Is YCP getting ready to join India alliance: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏదో ఓ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి నేతృత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలిగి మమతా బెనర్జీ నాయకత్వంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను సిద్దమేనని మమతా బెనర్జీ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా పలు పార్టీలు మద్దతు పలికాయి. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు దీదీ నాయకత్వానికి ఓకే అంటే సరే అనుకోవచ్చు కానీ జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా మద్దతు పలికడం రాబోతున్న మార్పులకు సూచనగా మారింది.
ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం
ప్రస్తుతం ఇండియా కూటమి చీలిక దిశగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలసి పని చేసేందుకు సిద్ధంగా లేదు. హర్యనా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆప్ .. కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ను కాదని ప్రాంతీయ పార్టీల నేతలే కూటమికి నేతృత్వం వహించాలని కోరుకుంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి వారు ఈ డిమాండ్ ను సమర్థిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా ఓకే అంటే.. నాయకత్వం మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై కూటమిని నిర్మించే బాధ్యత ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే అవకాశాలనుపరిశీలించే చాన్స్ ఉందని అనుకుంటున్నారు.
వైసీపీ వంటి కొత్త పార్టీలు చేరే అవకాశం
విజయసాయిరెడ్డి ఇండియా కూటమికి దీదీ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ప్రకటించేశారు. మామూలుగా అయితే ఆ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తే మాకేంటి అంటారు కానీ ఆయన తీరు మాత్రం వేరుగా ఉంది. ప్రస్తుతం వైసీపీ అత్యంత బలహీనంగా ఉంది. అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఈ పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని ఎదుర్కోవాలంటే తమకు ఓ కూటమి మద్దతు ఉండాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరడానికి ఇంత కాలం సంశయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ మినహా మిగతా ఇండియా కూటమి పార్టీలన్నీ హాజరయ్యాయి. ఇప్పుడు ఆ వ్యూహం వెనుక ఉన్న రాజకీయం వెలుగులోకి వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇండియా కూటమి పునరేకీకరణ జరుగుతుందా ?
మమతా బెనర్జీ నేతృత్వంలో త్వరలో ఇండియా కూటమి పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో కానీ.. వైసీపీ చేరడం మాత్రం పక్కా అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మమతా బెనర్జీ కూడా నేరుగా జగన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఇంత కాలం బీజేపీతో లొల్లి పెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని జగన్ ఇప్పుడు ఆ పార్టీని నమ్మడానికి సిద్దంగా లేరు. అందుకే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారన్న అభిప్రాయం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















