అన్వేషించండి

YSRCP Wrong Track: ఆస్తుల వివాదాన్ని రాజకీయం చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - షర్మిలపై ఎటాక్ వ్యూహాత్మక తప్పిదమేనా ?

YS Jagan: షర్మిలపై రాజకీయ దాడి వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసుకుని ప్రజల్లో మరింత చులకన అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Political attack on Sharmila a strategic mistake by YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ  మొత్తం అంశంలో వైఎస్ఆర్‌సీపీ చివరికి వెనక్కి తగ్గింది. ఇక ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ నేతలకు సందేశం పంపింది. ఆస్తుల విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే వాదనలు వినిపించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో జరిగిన డ్యామేజ్‌ను మాత్రం కవర్ చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

తల్లి, చెల్లి పై కోర్టుకెళ్లడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపుతుంది !

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఎప్పుడూ అటు షర్మిల కానీ ఇటు జగన్ కానీ బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రజల్లో చర్చనీయాంశం చేయలేదు. ఏదైనా అంతర్గతంగానే చర్చించుకున్నారు. కానీ ఎప్పుడు అయితే జగన్ తన సోదరి, తల్లిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేశారో.. ఆ విషయం ఎప్పుడు బయటకు తెలిసిందో అదే పెచ్చ సంచలనం అయింది. తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకెల్లడం అదీ కూడా గిఫ్ట్ గా ఇచ్చిన ఆస్తుల్ని వెనక్కి తీసుకుంటానని చెప్పడం ఏమిటన్న చర్చ రాష్ట్రమంతటా నడిచింది. దీనిపై వైసీపీ ఏ వాదన వినిపించినా.. తల్లి, చెల్లిని కోర్టుకు లాగిన జగన్ అన్న మాటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. 

జగన్, షర్మిల పంచాయితీకి జడ్జి విజయమ్మే- మాట్లాడే అర్హత వేరే వాళ్లకు లేదు: బాలినేని శ్రీనివాస రెడ్డి

షర్మిలపై ఏకపక్ష దాడితో మరింత డ్యామేజ్

షర్మిల తమ మధ్య ఆస్తుల వివాదం ఉందని ఎప్పుడూ ప్రకటించలేదు. ఎన్సీఎల్టీలో కేసు వేసిన తర్వాత మాత్రమే ఆమె స్పందించారు. వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూండటం.. సాక్షి పత్రికలో జగన్ వాదన వినిపిస్తూ.. షర్మిలదే తప్పు అని ఓ పేజీ కథనం ప్రచురించడంతో ఆమె కూడా తన వాదన వినిపిస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ నేతలు తర్వాత ప్రెస్‌మీట్లు పెట్టి వరుసగా విమర్శలు చేస్తూండటంతో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి పసుపుచీర కట్టుకుని వెళ్లారని చేసిన వ్యాఖ్యలతో  వైసీపీ వ్యవహారంపై ప్రజల్లో మరింత నెగెటివ్ చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని గుర్తించి ఇక ఆపేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. 

Also Read: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్

సోదరి షర్మిలకు జగన్ ప్రేమతో తన స్వార్జితాన్ని పంచాలనుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే తాను జగన్ కోసం వైసీపీ కోసం ఎంత కష్టపడ్డానో  చెబుతున్న షర్మిల తన కోసం ఒక్క సాయం అయినా చేశారో చెప్పాలన్నారు. రాజకీయ పదవుల్ని ఇవ్వలేదు. పార్టీలో పదవుల్ని ఇవ్వలేదు. తనకు రావాల్సిన ఆస్తులు ఇవ్వడానికే ఇబ్బంది పెడుతున్నాని షర్మిల అంటున్నారు. సాధారణంగా మహిళ వైపే సానుభూతి ఉంటుంది. జరుగుతున్న విషయాలతో పాటు ఆమె కన్నీరు పెట్టుకోవడంతో వైసీపీ సానుభూతి పరుల్లోనూ షర్మిలకే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అందుకే వైసీపీ వీలైనంతగా అండర్ ప్లే చేయడానికి డిసైడయింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Embed widget