అన్వేషించండి

YSRCP : వైఎస్ఆర్‌సీపీకి ఇండియా కూటమి పార్టీల మద్దతు - జగన్ కాంగ్రెస్‌కు దగ్గరయినట్లేనా ?

Andhra Pradesh : ఢిల్లీ ధర్నాలో జగన్ ఇండియా కూటమి పార్టీలు మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. జగన్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని అంచనా వేస్తున్నారు.

Has Jagan come close to Congress :  ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలోని  జంతర్ మంతర్‌లో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమికి చెందిన పార్టీలు మద్దతు పలికాయి. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్దవ్ ధాకరే  పార్టీ నేతలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, ముస్లింలీగ్ నేతలు జగన్ కు సంఘిభావం తెలిపిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు జగన్ ధర్నా వద్ద కనిపించలేదు. ఈ పరిణామంతో జగన్ ఇండియా కూటమికి దగ్గరయినట్లేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇండియా కూటమికి దగ్గరయిన జగన్ 

దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకూ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. కీలక సమయాల్లో ఆయన బీజేపీ విధానాలకు మద్దతిస్తూ ఇతర పార్టీలను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు మాత్రం ఇండియా కూటమి సభ్యులే మద్దతు పలికారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి నుంచి కీలక పార్టీలకు చెందిన నేతలు జగన్ ధర్నాకు వచ్చి సంఘిభావం తెలియచేయడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంతో ఆయన ఇండియా కూటమికి దగ్గరయినట్లుగానే భావిస్తున్నారు. 

జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణ - తర్వాత ఈడీ కి సిఫారసు - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన

స్పీకర్ ఎన్నిక సమయంలోనూ బీజేపీకే మద్దతు పలికిన జగన్

ఇటీవల స్పీకర్ ఎన్నిక జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇండి కూటమి అభ్యర్థిని నిలబెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా తన ప్రత్యర్థి పార్టీలు ఎన్డీఏలో కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీకే మద్దతు ప్రకటించారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ జరగలేదు. కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని ముందుగానే ప్రకటించారు. జగన్ తీరుపై ఢిల్లీ రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఆయనకు ఉన్న అనివార్యతల వల్ల మద్దతు ప్రకటించారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండి కూటమి పార్టీల్ని తనకు మద్దతు తెలియచేయాలని ఆహ్వానించడం  ఆసక్తికరంగా మారింది. 

వైసీపీకి కిలారు రోశయ్య రాజీనామా - ఇక ఉమ్మారెడ్డి కుటుంబం జగన్‌కు దూరమేనా ?

క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రక్రియే                               

ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నందున.. బీజేపీకి మద్దతివ్వడం మంచిది కాదని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తున్నారు. అయితే బీజేపీకి దూరమైతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వెనుకడుగు వేస్తూ వస్తున్నారు. అయితే ఇండీ కూటమిలో భాగంగా ఉంటే.. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కక్ష సాధింపులేనని ప్రచారం చేసుకోవచ్చని అది సానుభూతి తెస్తుందన్న అంచనాలతో విపక్ష కూటమిలోకి వెళ్లే దిశగా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. దీనికి తగ్గట్లుగా జగన్ కు సంఘిభావం తెలిపిన ఇండీ కూటమి నేతలంతా జగన్ ను కూటమిలోకి ఆహ్వానించారు. 

టాప్ హెడ్ లైన్స్

Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget