అన్వేషించండి

Andhra Pradesh : జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణ - తర్వాత ఈడీ కి సిఫారసు - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన

Andhra Liquor Scam : జగన్ హయాంలో లిక్కర్ స్కాం విచారణను సీఐడీకి అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు. తర్వాత ఈడీకి నివేదిస్తామన్నారు. అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు.

CID Investigation In Andhra Liquor Scam : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. జగన్ హయాంలో జరిగిన లిక్క ర్ స్కాం పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఐదేళ్ల కాలంలో అతిపెద్ద స్కాం జరిగిందని సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో కారు. దీనిపై స్పందించిన చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో భయంకరమైన  లిక్కర్ స్కాం జరిగిందని ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

భారీ స్కాం జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపణ                                       

మద్యం విషయంలో శ్వేతపత్రంలో ప్రకటించిన దాని కంటే ఎక్కువ నష్టం జరిగిందని జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రూ. 18వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని ఆయన తేల్చారు. వేలు లంచం తీసుకున్న సాధారణ ఉద్యోగుల్ని శిక్షించగలుగుతున్నామని.. కానీ వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్న వారిని మాత్రం శిక్షించలేకపోతున్నామన్నారు. దేశమంతా ఆన్ లైన్ లావాదేవీలు జరుగూతంటే...ఏపీలో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించారని దీనిపై తాను కేంద్రానికి కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. ఇందులో భారీ స్కాంకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

లిక్కర్ స్కాంపై గతంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపణలు                                       

ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందని టీడీపీ, బీజేపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో  మద్యం పాలసీ మార్చేశారు. అన్ని దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకు వచ్చారు. దేశంలో దొరికే పాపులర్ బ్రాండ్లేమీ ఏపీలో దొరకలేదు. కొత్త కొత్త బ్రాండ్లు మాత్రమే అమ్మారు. అవన్నీ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి , సజ్జల  కనుసన్నల్లోనే స్వాధీనం చేసుకున్న డిస్టిలరీల్లో తయారు చేసి అమ్మారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ మద్యం అంతా కల్తీయేనని పలుమార్లు ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని ప్రకటించారు. 

సీఐడీ విచారణకు ఆదేశించడంతో కలకలం

చెప్పినట్లుగానే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పై శ్వేతపత్రం ప్రకటించిన వెంటనే్ విచారణకు ఆదేశించారు. పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించినందున.. వాటి వివరాలతో ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ పరిణామాలంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.  

అంతకు ముందు చంద్రబాబు అసెంబ్లీలో ఎక్సైజ్ పై శ్వేతపత్రం ప్రకటించారు. ఈ సందర్భంగా ..  వైసీపీ ప్రభుత్వం లో ఎక్సైజ్ పాలసీపై జరిగిన అనేక అవకతవకలను వెల్లడించారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
YS Sharmila: అమరావతిపై తీర్మానం మంచిదే కానీ కేంద్రం ఇవ్వాల్సిన నిధుల మాటేమిటి? చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
అమరావతిపై తీర్మానం మంచిదే కానీ కేంద్రం ఇవ్వాల్సిన నిధుల మాటేమిటి? చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
Embed widget