అన్వేషించండి

CM Kcr With MPs: రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై గట్టిగా పోరాడండి... ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ అంశాలతో పాటు విభజన హామీలపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు.

టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని సీఎం కేసీఆర్‌ టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో కేసీఆర్ చర్చించారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ అంశాలతోపాటు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికను ఎంపీలకు అందించారు. తెలంగాణకు కేంద్రం చేసిందేం లేదన్న కేసీఆర్ న్యాయపరంగా రావాల్సిన వాటిని కూడా కేంద్రం ఇవ్వలేదని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌ అనంతరం అందుకు స్పందిస్తామని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఎంపీలకు 23 అంశాలతో కూడిన నివేదికను సీఎం కేసీఆర్ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలపై ఎక్కువగా దృష్టి సారిస్తామని ఎంపీలు అన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ ప్రసంగం వల్ల ఏం ఉపయోగంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సింగరేణి కోల్ బ్లాక్ లపై ప్రశ్నించాలని సీఎం సూచించారు. టీఆర్ఎస్ ప్రశ్నిస్తే దేశం దద్దరిల్లుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు హాజరు కానున్నారు. 

కేంద్రంపై మరోసారి పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను వేదికగా మార్చుకోబోతుంది. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో అమలు కావాల్సిన పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సహా సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వాణిని ఉభయ సభల్లో గట్టిగా వినిపించాలని ఎంపీలకు సూచించనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వరి ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఈ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభ లో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవితా నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget