అన్వేషించండి

YSRCP In NDA : ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ - ఎన్డీఏలోకి టీడీపీ కాదు వైఎస్ఆర్‌సీపీ!?

ఎన్డీఏలో చేరికకు వైఎస్ఆర్‌సీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరిక ప్రకటన ఉంటుందా ?టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ జట్టుకట్టకుండా జగన్ ప్లాన్ చే్శారా ?

YSRCP In NDA :   మోదీ విధానాల పట్ల సంపూర్ణ సానుకూలతతో ఉన్నాం ఎన్డీఏలో టీడీపీ చేరికను కాలమే నిర్ణయిస్తుందని చంద్రబాబునాయుడు ఓ ఇంగ్లిష్ మీడియా చానల్‌తో చేసిన వ్యాఖ్యల తర్వతా వచ్చే ఎన్నికల్లో 2014 కూటమి రిపీటవుతుందన్న చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సందర్భంగా బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని కలసి పోటీ చేస్తామని.. ఒప్పిస్తామని ప్రకటించారు. ఎన్డీఏలో నమ్మకమైన మిత్రుల కోసం చూస్తున్న బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రెడ్డి.. ఎన్డీఏలో టీడీపీ చేరకుండా .. చేర్చుకోకుండా  బీజేపీకి  బంపర్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. 

ఎన్డీఏలో చేరేందుకు జగన్ ఓకే చెప్పారా ?

సీఎం జగన్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. అందులో నీతి ఆయోగ్ భేటీ, పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవాలు మినహా మిగతా అన్ని భేటీలు రహస్యం లేదా రాజకీయమేనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ.. టీడీపీ దగ్గరకు కదులుతున్న సూాచనలు కనిపిస్తూండటంతో సీఎం జగన్ చురుగ్గా  కదిలారని అంటున్నారు. ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీని ఆహ్వానించవద్దని.. అవసరం అయితే తమ పార్టీనే ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి చెందిన కొంత మంది ఉన్నత స్థాయి నేతలు ఈ సమాచారాన్ని కొంత మంది రాష్ట్ర నేతలకు చేరవేశారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీంతో విషయం మెల్లగా బయటకు వస్తోంది. 

నమ్మకమైన మిత్రుల కోసం బిజేపీ ప్రయత్నాలు ! 

భారతీయ జనతా పార్టీ రెండు సార్లు తిరుగులేని మెజార్టీ సాధించింది. ఈ సారి అలాంటి విజయం కష్టమేనన్న అభిప్రాయం పోల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది నుంచి గతంలో కర్ణాటక నుంచి వచ్చిన సీట్లు కూడా జారిపోయే ప్రమాదం ఉంది. హిందీ రాష్ట్రాల్లో పది .. ఇరవై శాతం సీట్లు తగ్గినా  బీజేపీకి మైనస్ అవుతుంది. మిత్రపక్షాల అవసరం పడుతుంది. ఎన్డీఏలో ఇప్పుడు సీట్లు సాధించే  కెపాసిటీ ఉన్న మిత్రపక్షాలు ఏమీ లేవు. శివసేన, అకాలీదళ్,  జేడీయూ లాంటి  పార్టీలన్నీ దూరమయ్యాయి. శివసేన , జేడీయూ కలసి వచ్చే అవకాశం లేదు. వస్తే దక్షి్ణాది నుంచే మిత్రపక్షాలను కలుపుకోవాలి.  దక్షిణాదిలో బీజేపీకి నమ్మకంగా కనిపించే పార్టీ టీడీపీనే. అయితే టీడీపీ విషయంలో  మోదీ అంత సానుకూలంగా ఉండరన్న ప్రచారం ఉంది. కానీ ప్రత్యామ్నాయం లేకపోతే తప్పదన్న భావనలో ఉంటారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే జగన్.. ఎన్డీఏలో చేరికకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. 

ఎన్డీఏలో జగన్ చేరితే రాజకీయాల్లో పెను మార్పులు !

ఎన్డీఏలో జగన్ చేరితే.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తులో జనసేన ఉంది. అదే్ వైసీపీ ఎన్డీఏలో చేరితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన ఉండదు. బయటకు వచ్చేస్తుంది. టీడీపీతో  కలిసి పోటీ చేస్తుంది. బీజేపీ, వైసీపీ కూటమితో.. టీడీపీ, జనసేన పోటీ పడతాయి. అయితే బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా పొత్తులు పెట్టుకుని సీట్లు ఇవ్వడం దండగేనన్న అభిప్రాయం ఉంది. కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా.. ఆ పార్టీ సహకారం ..  ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు కోరుకుంటున్నాయి. సహకారం లేకపోయినా న్యూట్రల్ గా ఉంటే చాలని టీడీపీ నేతలనుకుంటున్నారు. 

బీజేపీతో  పొత్తంటే వైసీపీకి సాహసమే !

నిజానికి బీజేపీతో పొత్తు అంటే.. వైసీపీ సాహసం చేస్తోందనే  అనుకోవాలి. ఎందుకంటే... వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ లో ముస్లింలు ఉంటారు. దళితులు ఉంటారు. బీజేపీతో పొత్తును వీరు స్వాగతించరు. ఓ పదిశాతం  వీరు వ్యతిరేకం అయినా.. బీజేపీ తరపున కలిసి వచ్చే ఓటు బ్యాంక్ ఉండదు.  ఇలాంటి సమీకరణాలు చూసుకుంటే వైసీపీకి బీజేపీతో రిస్కేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముందు ముందు ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Embed widget