అన్వేషించండి

YSRCP : మద్దతు ఇస్తే మైనార్టీలకు కోపం - ఇవ్వకపోతే బీజేపీకి ఆగ్రహం ! ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై వైఎస్ఆర్‌సీపీ విధానమేంటి ?

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇస్తుందా ?బిల్లుకు మద్దతిస్తే మైనార్టీలు దూరమయ్యే అవకాశంమద్దతు ఇవ్వకపోతే బీజేపీ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదంజగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ?

YSRCP :  ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఈ మేరకు.. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉంది. అందుకే.. ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించి వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని చూస్తోంది మోదీ సర్కార్‌. 

మైనార్టీలను టార్గెట్ చేసుకుని తెస్తున్నారని విమర్శలు

యూనిఫాం సివిల్ కోడ్ అంశం పూర్తిగా మైనార్టీ వర్గాలను టార్గెట్ చేసుకుని తెస్తున్నారన్న ఓ ప్రాచరం జోరుగా సాగుతోంది. దీనిపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అంగీకరించే ప్రశ్నే లేదన్నారు ఒక్క మజ్లిస్ మాత్రమే కాదు.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చివరికి బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే కూడా  వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ బిల్లుపై మైనార్టీల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బిల్లుతో ముస్లిం కుటుంబ చట్టాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న భావన ఏర్పడటంతో ఆ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కానీ కేంద్రం ఈ బిల్లును ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 

రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకం

ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో బయటపడాలంటే..రాజ్యసభలో బీజేపీ ఇతర పార్టీల మద్దతు పొందాల్సి ఉంటుంది. లోక్ సభ విషయానికి వచ్చే వరకూ  బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాజ్యసభకు బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఎన్డీఏకు కూడా లేదు. నేరుగా మద్దతు ప్రకటించకుండా.. రహస్య మిత్రులుగా ఉన్న పార్టీల  మద్దతు కావాలి. బీజేప ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సమర్థించే బీజేడీ, వైసీపీ వంటి పార్టీల మద్దతు కీలకం. తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యస సభ్యుడే ఉన్నారు. ఆ ఒక్క ఓటుతో చేసేదేమీ లేదు.కానీ వైసీపీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటింగ్‌లో వీరు చాలా కీలకం. 

మద్దతు ఇస్తే ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ! 

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మద్దతు ఇస్తే ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వైసీపీకి ముస్లింలు ప్రధానమైన ఓటు బ్యాంకు. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగుతున్నా ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కొన్ని రకాల సమస్యల వల్లేనే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఇప్పుడు తమ అస్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే బిల్లుకు జగన్ మద్దతిస్తే వారు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే వైసీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. 

మద్దతు ఇవ్వకపోతే బీజేపీ దూరమయ్యే ప్రమాదం !

ఒక  వేళ మద్దతివ్వబోమని చెబితే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా విశ్వాసంలోకి తీసుకునే అవకాశం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాల్లోనూ ఇబ్బందికరమేనన్న అభిప్రాయం ఉంది.  అందుకే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి మద్దతు ఇస్తానంటే మైనార్టీలకు కోపం... ఇవ్వనంటే  బీజేపీ ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget