అన్వేషించండి

Andhra Politics : ఢిల్లీ ధర్నాతో జగన్ ఇరుక్కపోయారా ? ఇక బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాల్సిందేనా ?

YS Jagan : ఢిల్లీ ధర్నాలో ఇండీ కూటమి నేతలంతా జగన్ కు మద్దతు పలికారు. ఇప్పుడు ఆయన బీజేపీకి మద్దతుగా ఎలాంటి స్టాండ్ తీసుకున్నా ఆయన రాజకీయంపై అందరూ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది.

Does YS Jagan have to fight against BJP  :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఆయనకు ఇండీ కూటమి నేతలంతా ఏకపక్షంగా మద్దతు పలికారు. షర్మిల ఫీల్ అవుతుందనో మరో కారణమో కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. కానీ కూటమి నుంచి నేతలంతా వచ్చారంటే.. వ్యూహాత్మకమేనని అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు మరో దారి లేదు. ఆయన ఖచ్చితంగా ఇండీ కూటమి దారిలో వెళ్లాలి. బీజేపీకి మద్దతుగా ఇక ఎంత మాత్రం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ..  కష్టాల్లో ఇంతగా మద్దతుగా ఉన్న ఇండీ కూటమిని కాదని బీజేపీ దగ్గరకు వస్తే అటు బీజేపీ అనుమానిస్తుంది.. ఇటు కాంగ్రెస్ కూటమి ఆగ్రహిస్తుంది. అందుకే జగన్ అన్నీ ఆలోచించుకునే ఇండీ కూటమి నేతల్ని ధర్నాకు మద్దతుగా ఉండాలని ఆహ్వానించినట్లుగా భావిస్తున్నారు. 

అనివార్యంగా ఇండియా కూటమితోనే ఇక పయనం  !

ఇండియా కూటమిలో చేరాలని జగన్మోహన్ రెడ్డిని సంఘిభావం తెలియచేయడానికి వచ్చిన పార్టీల నేతలంతా ఆహ్వానించారు. దీనిపై జగన్ స్పందన ఏమిటన్నదానిపై స్పష్టత లేదు కానీ ఆయన గతంలోలా  బీజేపీకి మద్దతు పలికే అవకాశం లేదు. 2014 నుంచి  జగన్  బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. 2014లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ ఆయన పరోక్షంగా బీజేపీతో సంబంధాలు కొనసాగించారు. ఈ కారణంగా బీజేపీ, టీడీపీ మధ్య అభిప్రాయభేదాలు వచ్చి .. చంద్రబాబు కూటమి నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు బీజేపీకి పరోక్షంగా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండగలరు కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకోలేరు. ఎందుకంటే ఆయన ఓటు బ్యాంక్ పూర్తిగా దళిత, ముస్లింలు, బీజేపీతో పరోక్షంగా స్నేహాన్ని మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వారు సమర్థించి ఓట్లు వేసి ఉండవచ్చు కానీ నేరుగా  పొత్తులు పెట్టుకుంటే మాత్రం ఓటు వేయరు. అందుకే నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆయన వెనుకాడారు. ఇప్పుడు ఇండీ కూటమికి దగ్గరవుతుతున్నారు. ఇండీ కూటమి ఆయనకు ఓటు బ్యాంక్ పరంగా సేఫ్. కానీ బీజేపీని కాదంటే జరగబోయే పరిణామాల్ని ఎదుర్కోవడం కష్టమని ఇంత కాలం ఆయన ఆ పార్టీ పట్ల భయభక్తులతో ఉన్నారని అనుకోవచ్చు. కానీ ఢిల్లీ ధర్నా తర్వాత ఆయన అనివార్యంగా ఇండియా కూటమితో నడవక తప్పదు. 

వైఎస్ఆర్‌సీపీకి ఇండియా కూటమి పార్టీల మద్దతు - జగన్ కాంగ్రెస్‌కు దగ్గరయినట్లేనా ?

ఏ విషయంలో అయినా  బీజేపీకి మద్దతిస్తే రెంటికి చెడ్డ రేవడి

కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తామని గతంలో జగన్ ప్రకటించారు. అయితే ఇక ముందు ఎలాంటి అంశమైనా వైసీపీ తరపున ఆయన వ్యతిరేకించాల్సిందే. లేకపోతే బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఇండి కూటమి నేతలు అనుకుంటారు. కేంద్రంలో బీజేపీపై పోరాటంలో ఇండీ కూటమికి జగన్ మద్దతు ప్రకటించకపోతే.. ఆయనకు ఇక ఏ విషయంలోనూ ఆ వైపు నుంచి సపోర్టు రాదు. ఇప్పుడు మద్దతు ప్రకటించినందుకు వారు చింతించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి వైపు నుంచి  ఆయన ఎలాగూ సపోర్టు రాదు. కూటమిలో టీడీపీ, జనసేన ఉంటాయి.  అయితే బీజేపీతో ఆయన పరోక్ష సంబంధాలను కొనసాగించవచ్చు. కానీ దాని వల్ల ఆయనకు ఎంత లాభం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే. అంటే.. ఢిల్లీ ధర్నాలో తనకు సంఘిభావం తెలిపిన ఇండీ కూటమిని కాదని.. ఆయన బీజేపీకే మద్దతుగా ఉంటానని వెళ్తే.. రెంటికి చెడ్డ రేవడి అవుతారు. 

జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణ - తర్వాత ఈడీ కి సిఫారసు - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన

ప్లాన్ ప్రకారమే చేశారా ? ఇరుక్కుపోయారా ? 

ఢిల్లీలో ధర్నా చేయాలని జాతీయ పార్టీల మద్దతు కోరాలని జగన్ ఎందుకు అనుకున్నారో కానీ.. ఇప్పుడు ఆయన ఇరుక్కుపోయారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతల్ని పిలిచి ధర్నా చేశారు. కాబట్టి ఆయనను  బీజేపీ ఎంత మాత్రం ఇక ఆదరించదు. పైగా .. చంద్రబాబు ప్రభుత్వంపై .. జాతీయ స్థాయి నేతల్ని పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర స్థాయిలో పోరాడవచ్చు. కానీ జగన్ ఢిల్లీ ధర్నా  ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఓ స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నికలు ముగిసి రెండు నెలలే కాబట్టి.. దాదాపుగా ఇంకా నాలుగున్నరేళ్లకుపైగానే ఆయన బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంంటుంది. ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గలేరు. యుద్ధబరిలో దిగినట్లే అనుకోవచ్చు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Odela 2 Teaser: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే...  పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
India vs Pakistan: ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Odela 2 Teaser: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే...  పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
India vs Pakistan: ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
Amol Palekar: సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
Hyderabad Crime News: నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు మృతి, సర్జరీ చేసినా విషాదం!
Hyderabad Crime News: నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు మృతి, సర్జరీ చేసినా విషాదం!
Shikhar Dhawan Girl Friend: మిస్ట‌రీ విమెన్ తో ధావ‌న్ చెట్టా ప‌ట్టాల్.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌బ్లిక్ గా క‌నిపించిన ఈ జంట‌.. సోష‌ల్ మీడియాలో పుకార్లు
మిస్ట‌రీ విమెన్ తో ధావ‌న్ చెట్టాప‌ట్టాల్.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌బ్లిక్ గా క‌నిపించిన ఈ జంట‌.. సోష‌ల్ మీడియాలో పుకార్లు
PM Kisan Amount: ప్రతి రైతు ఖాతాలోకి రూ.2,000, రెండు రోజుల్లో డబ్బులు - రెడీగా ఉండండి
ప్రతి రైతు ఖాతాలోకి రూ.2,000, రెండు రోజుల్లో డబ్బులు - రెడీగా ఉండండి
Embed widget