అన్వేషించండి

Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?

South Delimitation: జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన దక్షిణాదికి నష్టం - 50 శాతం పెంపు వద్దనుకున్నా నష్టమే - మరి దారేది?

Southern route of Delimitation: నియోజకవర్గాల పునర్విభజన అంశం భారత రాజకీయాల్లో కీలక మలుపులకు కారణం అవుతోంది.  జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు, ఈ ప్రక్రియ ఒక రాజకీయ శిక్షగా మారుతుందనే ఆందోళన గత దశాబ్దాలుగా నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  50 శాతం సీట్ల పెంపు  ఫార్ములాను విపక్షాలు తిరస్కరించడం, దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను తమ చేతులతో తామే తగ్గించుకోవడమే అవుతుందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
జనాభా ప్రాతిపదికన పొంచి ఉన్న ప్రమాదం

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించాలి. అయితే, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976 నుండి ఈ ప్రక్రియను స్తంభింపజేశారు. ఒకవేళ 2026 తర్వాత కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల కేటాయింపు జరిగితే, జనాభా విస్ఫోటనం సంభవించిన ఉత్తరాది రాష్ట్రాల బలం పార్లమెంట్‌లో అమాంతం పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య నిష్పత్తి పరంగా పడిపోయి, దేశ సమాఖ్య వ్యవస్థలో ఒక ప్రాంతంపై మరో ప్రాంతం ఆధిపత్యం చలాయించే ప్రమాదం ఏర్పడుతుంది.

50 శాతం పెంపు విన్-విన్  ఫార్ములా

జనాభా హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, లోక్‌సభలోని అన్ని రాష్ట్రాల సీట్లను సమానంగా 50 శాతం పెంచాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకు వచ్చింది.    ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ సీట్లు 38కి పెరుగుతాయి. దీనివల్ల ఏ రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను కోల్పోదు సరే కదా, పార్లమెంట్‌లో దక్షిణాది గొంతుక మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి లభించే గౌరవప్రదమైన రాజీ మార్గంగా దీనిని పరిగణించవచ్చు.   విపక్షాలు ఈ వ్యూహాత్మక అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లతో దీనిని ముడిపెట్టి, సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా కేంద్రంపై పైచేయి సాధించాలని చూడటం వల్ల దక్షిణాదికే అసలైన నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఆచరణాత్మక పరిష్కారాన్ని వదులుకుంటే, భవిష్యత్తులో కొత్త జనాభా లెక్కల ఆధారంగా కేంద్రం కఠినమైన చట్టం తెస్తే అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. రాజకీయం కోసం నేడు చేసే పోరాటం, రేపు దక్షిణాది రాష్ట్రాల శాశ్వత అస్తిత్వానికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

జీడీపీ వాదనలో అనేక  సమస్యలు

కేవలం జనాభాయే కాకుండా జీడీపీ  ప్రాతిపదికన అధిక వాటా కోరడంలోనూ కొన్ని చిక్కులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల జీడీపీ మెరుగ్గా ఉన్నప్పటికీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటివి ఇంకా ముందు వరుసలో ఉన్నాయి. కేవలం ఆర్థిక ప్రాతిపదికనే అత్యున్నత ప్రాధాన్యంగా కోరుకోవడం ఇతర రాష్ట్రాల్లో విద్వేషాన్ని పెంచే అవకాశం ఉంది. పునర్విభజన అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు కాదు, అది రాజకీయ అధికారం పంపిణీ. ప్రాంతీయ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే మిన్న అని భావిస్తే, అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నిర్వీర్యం కావడం ఖాయం. దక్షిణాది రాష్ట్రాల నేతలు కేవలం భావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవ గణాంకాలను గమనించాలన్న అభిప్రాయం  నిపుణుల నుంచివస్తోంది.  50 శాతం ఫార్ములాను అంగీకరించడం వల్ల ప్రస్తుత ఎంపీల నిష్పత్తి మారదు, తద్వారా ఢిల్లీ పీఠం వద్ద దక్షిణాది పట్టు సడలదు. ఒకవేళ మొండి పట్టుదలతో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, రాబోయే రోజుల్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు మాత్రమే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లుగా, లేనిపోని వివాదాలతో సముచితమైన ఫార్ములాను కాలదన్నుకుంటే భవిష్యత్తు తరాలు తీరని మూల్యం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు చేసిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు జరిగిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramappa Temple: చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Embed widget