అన్వేషించండి

Jagan Message To Modi : మరో అజెండా లేనే లేదని పదే పదే చెప్పిన జగన్ - మోదీకి సందేశం ఇచ్చారా ? ఏ విషయంలో ?

మరో ఎజెండా తమకు లేదని సీఎం జగన్ ప్రధాని మోదీకి సభా వేదికపై చెప్పారు. కేసీఆర్‌తో సాన్నిహిత్యం కారణంగా జగన్ మోదీకి ఈ వివరణ ఇచ్చారా ?

Jagan Message To Modi :  విశాఖపట్నంలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగసభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. తక్కువ సమయం అయినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చెప్పారు. అంతకు ముందే ప్రధాని మోదీతో తమకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. తమ మధ్య ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదన్నారు.  కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు. ఉండదు, ఉండబోదని ఖరాఖండిగా చెప్పారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలోనూ సీఎంవో అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. 

జగన్ లేదని చెప్పిన మరో అజెండా ఏమిటి ?

ఇంతకూ జగన్ చెప్పిన.. మరో ఎజెండా ఏమిటన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. మరో ఎజెండా లేదని చెబుతూ ఉంటుంది. అయితే ప్రధాని మోదీ ముందు  ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సీఎం జగన్ చెప్పారు. ఇలా ప్రత్యేకంగా మోదీకి చెప్పడానికి రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ సంబంధాల ప్రకారం టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికీ సహకరించుకుంటూ ఉంటాయని చెబుతూంటారు. ఇటీవల గంగుల కమలాకర్ లాంటి మంత్రులు మీడియాతో మాట్లాడినప్పుడు... జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ప్రకటించారు. 

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో వెళ్లే ప్రశ్నే లేదని చెప్పారా ? 

కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. వచ్చే నెలలో అధికారికంగా పేరు మారబోతోంది. ఆ తర్వాత  వివిధ రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేయడం లేదా ఆయా రాష్ట్రాల్లో బలమైన పార్టీలతో కలవడం వంటి వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్‌సీపీతో కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలూ అదే చెప్పడంతో.. ఢిల్లీ స్థాయిలో కూడా  బీఆర్ఎస్‌తో వైఎస్ఆర్‌సీపీ కలుస్తుందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అందుకే ఈ విషయంలో సీఎం జగన్.. ప్రధాని మోదీకి క్లారిటీ ఇవ్వాలనుకున్నారని.. అందుకే తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా  లేదని .. తాము జాతీయ రాజకీయాల వైపు రానే రామని మోదీకి జగన్ సభా వేదికగా క్లారిటీ ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

బీజేపీతో విరోధాన్ని కోరుకోని వైఎస్ఆర్‌సీపీ

భారతీయ జనతా పార్టీతో కనీసం చిన్న వివాదం పెట్టుకునేందుకు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ సిద్దంగా లేదు. అందుకే పోలవరం నిధులు, విభజన హామీైలు.. ఇతర అంశాల్లో గత ప్రభుత్వం కేంద్రంపై పోరాడినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటున్నారు. పార్లమెంట్‌లో ప్రతీ బిల్లుకూ మద్దతు తెలుపుతున్నారు. అయితే ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తూండటంతో ఆ పార్టీతో దగ్గరి సంబంధాలున్న వైఎస్ఆర్‌సీపీ వైపు అనుమానంగా చూడాల్సి వస్తోంది. ఈ కారణంగానే జగన్ మరో ఎజెండా ఉండదని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala BJP: కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget