అన్వేషించండి

YSRCP Jagan Meeting : మే 10 నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ - 151 సీట్లు తగ్గకూడదన్న సీఎం జగన్!

మే పదోతేదీ నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 175కి 175 సీట్లు ఎందుకు రాకూడదని పార్టీ నేతలను జగన్ ప్రశ్నించారు.

మే 10వ తేదీ నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్  తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున ఇప్పటి నుండే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో  ఏం చేయాలో రోడ్ మ్యాప్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పథకాలు తీసుకున్న వారి జాబితాను ఆయా జిల్లాల అధ్యక్షులకు అందుతాయని.. ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జూలై 8వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని జగన్ పార్టీ నేతలకు తెలిపారు. 

65 శాతం మంది ఎమ్మెల్యేలకు సర్వేలో మంచి గ్రాఫ్ ! 

ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్ కార్యాచరణను దిశానిర్దేశం చేశారన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెబుతామన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందన్నారు. పార్టీ పరంగా సర్వేలు చేయిస్తున్నామని.. సర్వేల్లో వెనుకబడిన వారికి.. జనాదరణ కోల్పోయిన వారికి టిక్కెట్లు దక్కబోవని మాజీ మంత్రి కొడాలి నాని సమావేశం తర్వాత ప్రకటించారు. 65 శాతం ఎమ్మల్యేల గ్రాఫ్ బాగుందని సీఎం జగన్ తతెలిపారు. పలువురు ఎమ్మెల్యేల గ్రాఫ్‌లలో హెచ్చతగ్గులు ఉన్నాయని..  గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ సూచించారని కొడాలి తెలిపారు. ఓడిపోయే వారికి ఏ రాజకీయ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వబోదన్నారు. 

గ్రామ వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి !

చంద్రబాబు కుయుక్తులను పార్టీ పరంగా ఎదుర్కోవాలని.. పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారని కొడాలి నాని తెలిపారు. గ్రామ , వార్జు సచివాలయాల్లో ఓ పుస్తకం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే.. ప్రజలు ఆ పుస్తకంలో రాసే అవకాశం కల్పిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సీరియస్‌గా ఉండాలని జగన్ స్పష్టం చేశఆరు. నెలకు కనీసం పది గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్నారు. సర్వేల్లో పార్టీకి మైనస్‌గా మారిన పలు అంశాలపై ఎలా స్పందించాలో జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. 

అసలు వైఎస్‌ఆర్‌సీపీకి 175 సీట్లు ఎందుకు రాకూడదు ? 

ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లోనూ 151 సీట్లు సాధించడమేనని జగన్ స్పష్టం చేశారు. 175కి 175 సీట్లు ఎందుకు రాకూడదని ఎమ్మెల్యేల్ని జగన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. భారీ మెజార్టీతో ప్రజలు మనకు అధికారం కట్టబెట్టారని అదే స్థాయిలో మళ్లీ సీట్లు సాధించాల్సిందేనని జగన్ స్పషఅటం చేశారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ఒక అడుగు వెనక్కి వేసి అందర్నీ కలుపుకుని వెళ్లాలన్నారు. గెలిచేందుకు వనరులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget