అన్వేషించండి

Chandrababu : విభిన్నంగా చంద్రబాబు ప్రచార వ్యూహం - ఎన్నికల కోసం పక్కాగా రెడీ అవుతున్న టీడీపీ !

ఈ సారి ఎన్నికల్లో విభిన్నంగా చంద్రబాబు ప్రచార వ్యూహం ఉండనుంది. పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లలో.. అదీ కూడా గ్రామాల్లో బస చేయనున్నట్లుగా చెబుతున్నారు.


Chandrababu :   ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది.  తెలంగాణతో పాటు ఎన్నికలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది సీఎం జగన్ చాయిస్. ఆయన మాత్రం మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారని.. ముందస్తు ఆలోచనే లేదని పార్టీ నేతలకు చెబుతున్నారు. అయినా సరే.. ఆ తర్వాత మరో ఐదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున ఆ వేడి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర వచ్చే ఏడాది వరకూ సాగనుంది. చంద్రబాబు కూడా మరో వైపు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. 

గ్రామాల్లో బస చేయాలని  చంద్రబాబు నిర్ణయం 

చంద్రబాబు ప్రచార పర్యటనలు విభిన్నంగా సాగనున్నాయి.  ప్రచార కార్యక్రమాల్లో గ్రామాల్లో రాత్రిపూట బస చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  రాబోయే ఎన్నికలకు  ముందుగానే పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో రాత్రి బసలో పార్టీ నేతలు, స్థానికులతో సమావేశమవుతారు. పార్టీ నాయకులను కలవడానికి ఎక్కువ సమయం కేటాయించాలనే డిమాండ్ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రణాళికలు పార్టీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనల వల్ల నేతలందరినీ కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వివిధ నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు అవకాశం లేకపోలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాయకులు పార్టీ కోసం పనిచేసేలా చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు.

పార్టీ కార్యకర్తల నివాసాలకూ వెళ్లే అవకాశం 

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వెడెక్కేలోగా పార్టీనీ సన్నద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే 55 వరకు నియోజకవర్గాల్లో సమీక్షలు, విశ్లేషణలు చేసి ఇన్‌ఛార్జ్‌లను సన్నద్ధం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగడుతూ చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పార్టీ కేడర్‌ను, పునాదిని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీలో ముఖ్యుల నుంచి వస్తున్న వినతుల నేపధ్యంలో ఆయన జిల్లాల్లో పర్యటించాలని.. గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో పార్టీ కార్యకర్తల పనితీరును సమీక్షించేందుకు ప్రాంతాల వారీగా సమావేశాలు చంద్రబాబు నిర్వహించారు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలని ప్లాన్‌ చేస్తున్న ఆయన తదుపరి కదలిక చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికలు జరిగే నాటికి కార్యకర్తల్లో విశ్వాసం నింపేందుకు ఆయన పార్టీ కార్యకర్తల నివాసాల్లో బస చేయాలని భావిస్తున్నారు. గ్రామ పర్యటనలు, బసల్లో కూడా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తగిన వాగ్దానాలు చేసే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర

మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి యాత్ర చేపట్టనున్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ పర్యటనలు మూడు భిన్నమైన ప్రాంతాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మరో వైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారానికో సభ ద్వారా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. అవే రాజకీయ ప్రచార సభలుగా మారాయి.  అవేనా.. ఇంకా ఏమైనా జిల్లాల  పర్యటనలు చేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Embed widget