అన్వేషించండి

Chandrababu : విభిన్నంగా చంద్రబాబు ప్రచార వ్యూహం - ఎన్నికల కోసం పక్కాగా రెడీ అవుతున్న టీడీపీ !

ఈ సారి ఎన్నికల్లో విభిన్నంగా చంద్రబాబు ప్రచార వ్యూహం ఉండనుంది. పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లలో.. అదీ కూడా గ్రామాల్లో బస చేయనున్నట్లుగా చెబుతున్నారు.


Chandrababu :   ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది.  తెలంగాణతో పాటు ఎన్నికలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది సీఎం జగన్ చాయిస్. ఆయన మాత్రం మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారని.. ముందస్తు ఆలోచనే లేదని పార్టీ నేతలకు చెబుతున్నారు. అయినా సరే.. ఆ తర్వాత మరో ఐదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున ఆ వేడి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర వచ్చే ఏడాది వరకూ సాగనుంది. చంద్రబాబు కూడా మరో వైపు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. 

గ్రామాల్లో బస చేయాలని  చంద్రబాబు నిర్ణయం 

చంద్రబాబు ప్రచార పర్యటనలు విభిన్నంగా సాగనున్నాయి.  ప్రచార కార్యక్రమాల్లో గ్రామాల్లో రాత్రిపూట బస చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  రాబోయే ఎన్నికలకు  ముందుగానే పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో రాత్రి బసలో పార్టీ నేతలు, స్థానికులతో సమావేశమవుతారు. పార్టీ నాయకులను కలవడానికి ఎక్కువ సమయం కేటాయించాలనే డిమాండ్ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రణాళికలు పార్టీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనల వల్ల నేతలందరినీ కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వివిధ నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు అవకాశం లేకపోలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాయకులు పార్టీ కోసం పనిచేసేలా చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు.

పార్టీ కార్యకర్తల నివాసాలకూ వెళ్లే అవకాశం 

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వెడెక్కేలోగా పార్టీనీ సన్నద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే 55 వరకు నియోజకవర్గాల్లో సమీక్షలు, విశ్లేషణలు చేసి ఇన్‌ఛార్జ్‌లను సన్నద్ధం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగడుతూ చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పార్టీ కేడర్‌ను, పునాదిని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీలో ముఖ్యుల నుంచి వస్తున్న వినతుల నేపధ్యంలో ఆయన జిల్లాల్లో పర్యటించాలని.. గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో పార్టీ కార్యకర్తల పనితీరును సమీక్షించేందుకు ప్రాంతాల వారీగా సమావేశాలు చంద్రబాబు నిర్వహించారు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలని ప్లాన్‌ చేస్తున్న ఆయన తదుపరి కదలిక చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికలు జరిగే నాటికి కార్యకర్తల్లో విశ్వాసం నింపేందుకు ఆయన పార్టీ కార్యకర్తల నివాసాల్లో బస చేయాలని భావిస్తున్నారు. గ్రామ పర్యటనలు, బసల్లో కూడా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తగిన వాగ్దానాలు చేసే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర

మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి యాత్ర చేపట్టనున్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ పర్యటనలు మూడు భిన్నమైన ప్రాంతాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మరో వైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారానికో సభ ద్వారా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. అవే రాజకీయ ప్రచార సభలుగా మారాయి.  అవేనా.. ఇంకా ఏమైనా జిల్లాల  పర్యటనలు చేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
Andhra Pradesh Local Polls: లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
BRS Politics: క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget