అన్వేషించండి

YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?

Andhra Prdesh: వైసీపీ ముఖ్య నేతలందరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ముందస్తు బెయిల్స్ కోసం వారు న్యాయస్థానాలకు పరుగులు పెడుతున్నారు.

Cases are registered against all the main leaders of YCP: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసుల హడావుడి జరుగుతున్న సమయంలో అంత కంటే తీవ్రమైన కేసులు కొన్ని వెలుగులోకి వచ్చాయి.ఏపీలో మాఫియా తరహాలో గత పాలకులు వ్యవహరించి ఆస్తుల్ని లాక్కున్నారని సాక్షాత్తూ చంద్రబాబు ఆరోపించారు. ఆయన అలా ఆరోపించక ముందు కాకినాడ డీప్ వాటర్ పోర్టు చేతులు మారిన వైనంపై ఆరోపణలు వచ్చాయి. ఆ పోర్టు మాజీ యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. వాంగ్మూలం ఇచ్చారు. నాటి ప్రభుత్వ పెద్దలు తనను బెదిరించి రూ. నాలుగు వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్, పోర్టుల్లోని వాటాలను రూ. 13 కోట్లుకు మాత్రమే రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు.దీనిపై సీఐడీ కేసులు నమోదు చేసి విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 

పోర్టు చేతులు మారిన వైనంపై అనేక అనుమానాలు

మొదట కాకినాడపోర్టులో అక్రమాలు అని నోటీసులు జారీ చేశారు. తర్వాత డీల్ సెట్ అయిన తర్వాత అవన్నీ తప్పుడు ఆరోపణలు అని గుర్తించామని నోటీసులు వెనక్కి తీసుకున్నారు. కానీ డీప్ వాటర్ పోర్టు అతి తక్కువకు ఈ మధ్యలో చేతులు మారిపోయింది.  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేఈ డీల్ పై ఆరోపణలు వచ్చాయి.  కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పాత యజమాని కెవి రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు కథ ప్రారంభమయింది. ఈ పోర్టును అతి తక్కువకు ఔరో రియాల్టీగా మారిన అరబిందో రియాల్టీ దక్కించుకుంది. ఇది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడి కంపెనీ. వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జుగా ఉండేవారు. ఆయనకు కుమారుడు విక్రాంత్ రెడ్డి.అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Also Read: Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?

నిజానికి ఇలాంటి కేసులు అన్నీ జగన్ దగ్గరకే చేరే అవకాశం ఉంది. అంతిమ లబ్దిదరు ఆయనేనని దర్యాప్తు సంస్థలు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసుల వ్యవహారంలో జగన్ నేరుగా లబ్ది పొందారని రేపోమాపో సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక ఇసుక స్కాంలోనూ ఇదే తరహా విచారణ జరుగుతోంది. ఇప్పటికే రఘురామపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో జగన్ మీద కేసు నమోదు అయింది. జగన్ తో పాటు ముఖ్య నేతలందరిపైనా విచారణలు అంతర్గతంగా జరుగుతున్నాయి. అందుకే చాలా మంది సైలెంట్ అయిపోయారు.కుదిరితే పార్టీలు మారిపోతున్నారు.ఆ చాన్స్ లేని వాళ్లు అసలు కనిపించడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా అనేక మంది వైసీపీ ముఖ్య నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. 

ప్లాన్డ్ గా రౌండప్ చేస్తున్న అధికార పార్టీ 

కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకూ గత ఐదేళ్ల కాలంలో చేసిన వ్యవహారాలపై ప్లాన్డ్ గా రౌండప్ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ కేసుల వలలో చిక్కుకుంటున్నారు. బెయిల్స్, ముందస్తు బెయిల్ కోసం లీగల్ టీంను ఎప్పటికప్పుడు రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.గతంలోలా రాత్రికి రాత్రి అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడం లేదు. వారికి న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి రిలీఫ్ రాకపోతే అరెస్టు తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ సీఐడీ ఓఎస్డీ విజయ్ పాల్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలు, అవినీతికి పాల్పడ్డారని వాటిపై సాక్ష్యాలు బహిిరంగంగానే ఉన్నాయని టీడీపీ ఎలా వదిలివేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలు మాత్రం కేసుల వలలో రోజు రోజుకు చిక్కిపోతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
Preethi Reddy Politics: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ దూకుడు - బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపే చూస్తున్నారా?
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ దూకుడు - బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపే చూస్తున్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget