అన్వేషించండి

KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్

Telangana News: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో ప్రజలను అసెంబ్లీ వేదికగా తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. భూములివ్వని పాపానికి రైతులను హింసించారన్నారు.

KTR Serious On CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక, దుర్మార్గమైన పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని.. వారిపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అలా చేస్తుందనే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సర్కారు అప్పులపై వాస్తవాలను సరి చూసుకుంటే ఇబ్బందేమీ లేదన్నారు. గతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నోటీసులిస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతిచ్చారని గుర్తు చేశారు.

'భూములివ్వకుంటే జైల్లో పెడతారా.?'

తమ భూములివ్వమన్న పాపానికి రైతులను జైల్లో పెట్టి హింసించారని కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇంఛార్జీలను పిలుస్తున్నారు. మా ఎమ్మెల్యేలను పిలవడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్‌ను కోరాం. భూములివ్వకుంటే జైల్లో పెడతారా.?. అన్నదాతలపై థర్ట్ డిగ్రీ ప్రయోగించారు. రైతుల బాధలు సమస్యలు కావా.?. అక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే పర్యాటకంపై చర్చ అవసరమా.?. సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఒక్క పైసా తేలేదు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెట్టకుండా రేవంత్ పారిపోయారు. రాష్ట్రంలో ఉన్నది అరాచక ప్రభుత్వం. కొడంగల్ ప్రజల తరఫున బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నారు. రైతుల తరఫున మేం పోరాడతాం.' అని కేటీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ ఆందోళన

లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో అసెంబ్లీ లోపలికి వెళ్లే దారిలో కూర్చుని ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. రైతులకు బేడీలు వేసి మంత్రులు జల్సాలు చేశారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని.. లగచర్ల రైతులు అధైర్యపడొద్దని అన్నారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దందని తెలిపారు. రైతులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget