అన్వేషించండి

Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?

Andhara Praesh: కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన క్యాడర్ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వారితోనే సమస్యలు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

problems with those who came from YCP and joined Jana Sena : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. చంద్రబాబు,పవన్  మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఎక్కడా చిన్న వివాదం కూడా రాకుండా ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రతి నిర్ణయాన్ని  చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం జనసేన, టీడీపీ క్యాడర్ తిట్టుకుంటున్నాయి. కొట్టుకుంటున్నాయి. ఇది వివాదాస్పదం అవుతోంది. రెండు పార్టీల హైకమాండ్లు ఇంకా ఆ వివాదాల జోలికి వెళ్లలేదు. దీంతో అంతకంతకూ పెరుగుతున్నాయి. 

జనసేనలో చేరికల వల్ల వచ్చిన  సమస్యలా ? 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు  పెరిగిపోయాయి. పై స్థాయితో పాటు కింది స్థాయిలోనూ చాలా మంది నేతలు జనసేనలో చేరిపోయారు. వీరంతా ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేశారు. అయితే జనసేనలో చేరిన తర్వాత వారు  కొన్ని నియోజకవర్గాల్లో చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  వారి తీరుతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి  గురవుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ ఈ నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి ఉంది.
పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన వాళ్లు రెచ్చిపోతున్నారని టీడీపీ నేత వర్మ అంటున్నారు.  జెండాల దగ్గర నుంచి రచ్చ చేస్తున్నారుని.. టీడీపీ నేతలు ఎవరైనా  వస్తే..  కండువాలు వేసుకోకపోయినా కావాలన గొడవ చేస్తున్నారని అంటున్నారు.  ఇది టీడీపీ ఇంచార్జ్ వర్మకు సమస్యగా మారుతోంది. వారు చేస్తున్న అల్లరిని నియంత్రించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు.  ఇవి అంతకంతకూ  పెరిగిపోతున్నాయి. 

'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు

నెల్లిమర్లలో వైసీపీ ఫిరాయింపు నేతలదే ఆధిపత్యం

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పూర్తిగా వైసీపీ నుంచి వచ్చిన నేతలతోనే రాజకీయం చేస్తున్నారని  టీడీపీ నేతలంటున్నారు.  టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజుకు   కనీస   గౌరవం కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.  జనసేనకు క్యాడర్ లేకపోయినా టీడీపీ నేతలు ప్రాణం పెట్టి ఆమెను గెలిపించారని ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిసి టీడీపీ నేతల్ని వేధిస్తున్నారని వారు మండిపడుతున్నారు.   ఇక దెందులూరులో ప్రతి వైసీపీ నేత తాము జనసేన అంటూ వచ్చి.. పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రచ్చ జరిగింది.  టిడిపి, జనసేన మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.  దీనికి కారణం ఇటీవల వైసిపి నుండి జనసేనలోకి చేరిన కార్యకర్తలే అని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమిని ఓడించడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు జనసేనలో చేరి పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారనీ, ఇలాంటివి తన దగ్గర కుదరవని చింతమనేని  హెచ్చరిస్తున్నారు.

Also Read: YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు

వైసీపీ నుంచి వచ్చి చేరేవారితోనే కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. వారు కూటమిలో చిచ్చు పెట్టే ఉద్దేశంతోనే వచ్చి చేరుతున్నారా లేకపోతే.. మరో కారణం ఉందా అని విశ్లేషించి ఈ వివాదాలకు ... టీడీపీ, జనసేన చెక్ పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఇవన్నీ మండల స్థాయి వ్యవహారాలే. అందుకే ఇంకా అధినేతల వరకూ వెళ్లలేదని  చెబుతున్నారు. అయితే ఇవి ఇంకా  పెరగకుండా ఉండాలంటే తక్షణం చెక్ పెట్టేందుకు అధినేతలు దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుకుంటున్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Telangana Cabinet:తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఐదు రాష్ట్రాల ఎన్నికల బ్రేక్ - మే నెలలోనే రేవంత్ మార్క్ కేబినెట్ సర్జరీ ?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఐదు రాష్ట్రాల ఎన్నికల బ్రేక్ - మే నెలలోనే రేవంత్ మార్క్ కేబినెట్ సర్జరీ ?
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
West Bengal Elections: ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
Hyderabad Drugs Party: హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
Basara Temple Master Plan: రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
Hyderabad Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!
ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
Embed widget