అన్వేషించండి

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

ప్రభుత్వంపై ఇంత కాలం సాఫ్ట్‌గా వ్యవహరించిన ఏపీ బీజేపీ.. ఇప్పుడు ట్రాక్ మార్చింది. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తాము కూడా ఉన్నామని ప్రజలకు సందేశం పంపుతోంది.


AP BJP :  బీజేపీ దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బలం పుంజుకుంటోంది. బలం లేదనుకున్న దక్షిణాదిలోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. తెలంగాణలో అధికారానికి దగ్గ్గరగా ఉన్నామని ఆ పార్టీ చెబుతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేసేందుకు దూకుడుగా వెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం పెద్దగా ఎప్పుడూ బీజేపీ పనితీరు వార్తల్లోకి రాలేదు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. ఆ పార్టీ పూర్తిగా ట్రాక్ మార్చింది. ప్రభుత్వంపై  దూకుడుగా పోరాటం చేయడానికి ఉత్సాహం చూపిస్తూండటంతో  ప్రత్యామ్నాయం రేసులో తాము కూడా ఉన్నామన్న ఓ బలమైన నమ్మకాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేస్తోంది. ప్రజాపోరు సభలను అనుకున్నట్లుగా నిర్వహించి .. తమకు కమిట్‌మెంట్ ఉన్న క్యాడర్ ఉన్నారని నిరూపించగలిగారు. 

ప్రభుత్వంపై గతంలో లేని విధంగా పోరాటం !

ఏపీ అధికార పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీతో సన్నిహితంగా ఉంది. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేని పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో  కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడారు. ఓ దశలో కన్నా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కరోనా కిట్ల విషయంలో కన్నా చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. దీంతో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు కన్నాపై బీజేపీ అంతర్గత విషయాలపై ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత ఆ వేడి తగ్గింది. దీంతో  వైఎస్ఆర్‌సీపీ - బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో పెరగడానికి కారణం అయింది. 

ప్రజాపోరుతో ఒక్క సారిగా ట్రాక్ మార్చిన బీజేపీ !

ఢిల్లీ రాజకీయాల కోసం మూడేళ్ల పాటు సంయమనం పాటించిన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అలుపెరుగకుండా విస్తృత కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. మొదట ఉద్యోగాల భర్తీ మీద యువ ఆందోళన నిర్వహించారు. తరవాత ప్రజాపోరు పేరుతో గ్రామ, గ్రామాన.. వీధి వీధిన సమావేశాలు నిర్వహించారు. చిన్నవే అయినా ప్రజల్లో చొచ్చుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న బీజేపీ తాము కూడా ప్రత్యామ్నాయమేనని ప్రజలకు సంకేతాలు పంపింది. ఇతర పార్టీలకు చాన్సిచ్చారని దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్న జాతీయ పార్టీగా..డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తమకూ ఓ చాన్సివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ప్రజాపోరు సభలతో మంచి మైలేజీ వచ్చిందని ఆ పార్టీ అభిప్రాయానికి వచ్చింది. 

సొంతంగానే ముందుకెళ్తున్న బీజేపీ !

బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. అయితే జనసేన పార్టీ కార్యకలాపాలు పవన్ కల్యాణ్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఉంటున్నాయి. లేకపోతే సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే కలసి వచ్చినప్పుడే జనసేన పార్టీతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మిగిలిన సందర్భంగా నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వంపై పోరాటం చేయడం ద్వారా విపక్షాలు బలపడతాయి. ఇంత కాలం ఉన్న కొన్ని సమస్యలను బీజేపీ అధిగమించి ముందుకెళ్తోంది. 

ప్రభుత్వ వ్యతిరేక పోరులో మరిన్ని కార్యక్రమాలు !

ప్రజాపోరు సభలతో క్యాడర్‌ మొత్తంలో కదలికి తీసుకు రాగలిగిన నేతలు ఇప్పుడు...  మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తరచూ వస్తున్నారు. ముందు ముదు మరింతగా ప్రభుత్వంపై పోరాటం చేసి బలం పెంచుకోవాలనుకుంటున్నారు. యువనాయకత్వం చురుగ్గా ఉండటంతో ముందు ముందు మరింత మెరుగ్గా  తమ పోరాటం ఉంటుందని చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Rahul Gandhi Shiva Vishnu Politics: శివుడ్ని తాను తీసుకుని బీజేపీకి విష్ణుమూర్తిని ఇస్తున్న రాహుల్ - చాలా పెద్ద ప్లానే !?
శివుడ్ని తాను తీసుకుని బీజేపీకి విష్ణుమూర్తిని ఇస్తున్న రాహుల్ - చాలా పెద్ద ప్లానే !?
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
Rahul Jiu-Jitsu Strategy: రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Embed widget