అన్వేషించండి

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

ప్రభుత్వంపై ఇంత కాలం సాఫ్ట్‌గా వ్యవహరించిన ఏపీ బీజేపీ.. ఇప్పుడు ట్రాక్ మార్చింది. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తాము కూడా ఉన్నామని ప్రజలకు సందేశం పంపుతోంది.


AP BJP :  బీజేపీ దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బలం పుంజుకుంటోంది. బలం లేదనుకున్న దక్షిణాదిలోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. తెలంగాణలో అధికారానికి దగ్గ్గరగా ఉన్నామని ఆ పార్టీ చెబుతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేసేందుకు దూకుడుగా వెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం పెద్దగా ఎప్పుడూ బీజేపీ పనితీరు వార్తల్లోకి రాలేదు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. ఆ పార్టీ పూర్తిగా ట్రాక్ మార్చింది. ప్రభుత్వంపై  దూకుడుగా పోరాటం చేయడానికి ఉత్సాహం చూపిస్తూండటంతో  ప్రత్యామ్నాయం రేసులో తాము కూడా ఉన్నామన్న ఓ బలమైన నమ్మకాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేస్తోంది. ప్రజాపోరు సభలను అనుకున్నట్లుగా నిర్వహించి .. తమకు కమిట్‌మెంట్ ఉన్న క్యాడర్ ఉన్నారని నిరూపించగలిగారు. 

ప్రభుత్వంపై గతంలో లేని విధంగా పోరాటం !

ఏపీ అధికార పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీతో సన్నిహితంగా ఉంది. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేని పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో  కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడారు. ఓ దశలో కన్నా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కరోనా కిట్ల విషయంలో కన్నా చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. దీంతో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు కన్నాపై బీజేపీ అంతర్గత విషయాలపై ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత ఆ వేడి తగ్గింది. దీంతో  వైఎస్ఆర్‌సీపీ - బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో పెరగడానికి కారణం అయింది. 

ప్రజాపోరుతో ఒక్క సారిగా ట్రాక్ మార్చిన బీజేపీ !

ఢిల్లీ రాజకీయాల కోసం మూడేళ్ల పాటు సంయమనం పాటించిన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అలుపెరుగకుండా విస్తృత కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. మొదట ఉద్యోగాల భర్తీ మీద యువ ఆందోళన నిర్వహించారు. తరవాత ప్రజాపోరు పేరుతో గ్రామ, గ్రామాన.. వీధి వీధిన సమావేశాలు నిర్వహించారు. చిన్నవే అయినా ప్రజల్లో చొచ్చుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న బీజేపీ తాము కూడా ప్రత్యామ్నాయమేనని ప్రజలకు సంకేతాలు పంపింది. ఇతర పార్టీలకు చాన్సిచ్చారని దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్న జాతీయ పార్టీగా..డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తమకూ ఓ చాన్సివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ప్రజాపోరు సభలతో మంచి మైలేజీ వచ్చిందని ఆ పార్టీ అభిప్రాయానికి వచ్చింది. 

సొంతంగానే ముందుకెళ్తున్న బీజేపీ !

బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. అయితే జనసేన పార్టీ కార్యకలాపాలు పవన్ కల్యాణ్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఉంటున్నాయి. లేకపోతే సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే కలసి వచ్చినప్పుడే జనసేన పార్టీతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మిగిలిన సందర్భంగా నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వంపై పోరాటం చేయడం ద్వారా విపక్షాలు బలపడతాయి. ఇంత కాలం ఉన్న కొన్ని సమస్యలను బీజేపీ అధిగమించి ముందుకెళ్తోంది. 

ప్రభుత్వ వ్యతిరేక పోరులో మరిన్ని కార్యక్రమాలు !

ప్రజాపోరు సభలతో క్యాడర్‌ మొత్తంలో కదలికి తీసుకు రాగలిగిన నేతలు ఇప్పుడు...  మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తరచూ వస్తున్నారు. ముందు ముదు మరింతగా ప్రభుత్వంపై పోరాటం చేసి బలం పెంచుకోవాలనుకుంటున్నారు. యువనాయకత్వం చురుగ్గా ఉండటంతో ముందు ముందు మరింత మెరుగ్గా  తమ పోరాటం ఉంటుందని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget