అన్వేషించండి

Amaravati Lands : పేదల భుజాలపై నుంచి అమరావతిపై గురి పెట్టారా ? కోర్టు తీర్పు అనుకూలంకా రాకపోతే పేదల పరిస్థితేమిటి ?

పేదల భుజాలపై నుంచి అమరావతిని టార్గెట్ చేశారా?స్థలాలు పంచేశాక కోర్టులో అనుకూల తీర్పు రాకపోతే ?పేదలు ఇళ్లు కట్టుకున్న తర్వాత ఎదురుదెబ్బ తగిలితే ? ఒప్పందాలు పాటించవద్దని కోర్టులు చెబుతాయా ?

 

Amaravati Lands :  అమరావతి రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. గత  ప్రభుత్వం హైదరాబాద్ లాగా అబివృద్ది చేసి .. మరో మెట్రో సిటీని సిద్ధం చేసుకుంటామని కలలు కన్నది. కానీ మారిన ప్రభుత్వం  మాత్రం అసలు ఆ గ్రాఫిక్స్ ఎలా సాధ్యమని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూముల్ని పేదలకు పంచేందుకు సిద్ధమయింది. నిజానికి ఆ భూముల్ని రైతులు పూర్తిగా ప్రభుత్వానికి పరిహారం తీసుకుని ఇవ్వలేదు. డెలవప్‌మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. రైతులకు చట్టం ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించకుండానే హామీ ఇచ్చినట్లుగా అభివృద్ధి చేయకుండానే వారి భూముల్ని సెంటు స్థలాలకు ఇస్తున్నారు. ఇప్పుడు విషయం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ పట్టాలు పంచడానికి రెడీ అయ్యారు. దీంతో వివాదం ప్రారంభయింది. 

సెంటు స్థలాలుగా పంపిణీ చేసినా అవి కోర్టులో ఉన్న  భూములే !

యాబై వేల కుటుంబాలకు అమరావతిలో రైతులు ఇచ్చిన పొలాల్లో సెంటు స్థలాలను కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఇలా ఇస్తున్న పట్టాలపై ఒక్క పేద కుటుంబానికి కూడా హక్కు రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది..  భూయాజమాన్య హక్కులు కోర్టు తీర్పు తర్వాతనే తేలుతాయని . ప్రస్తుతం రాజధాని అంశంపై పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ మరీ ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాలను ఏపీ ప్రభుత్వం ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రేపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే..  ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు పంపిణీ చేసినా పేదలకు హక్కులు లేకుండా పోతాయి.  దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. 

సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోమని మాత్రమే చెప్పింది.. ఇవ్వమనలేదు !

సుప్రీంకోర్టు అమరావతిలో సెంటు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది కానీ..అటు హైకోర్టు కానీ..ఇటు సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న పట్టాల విషయంలో జోక్యం చేసుకోబోమని మాత్రమే చెప్పింది. ప్రభుత్వానికి ఉన్న అధికారాల ప్రకారం ప్రభుత్వం చేస్తోంది. కానీ అది లీగలా..ఇల్లీగలా అనేది అమరావతిపై పిటిషన్లపై విచారణలోనే తేలనుంది. అందుకే జోక్యంచేసుకోబోమని చెప్పింది. ఒక వేళ అలా పంపిణీ చేయడం ఇల్లీగల్ అని..సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని తీర్పు వస్తే అది ప్రభుత్వానికీ చెంపపెట్టు అవుతుంది. 

పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు !

సీఎం జగన్ పేదలకు సెంటు స్థలాలుఇవ్వాలనుకుంటే..  అనేక చోట్ల ఇతర స్థలాలు ఉన్నాయి. వివాదాస్పద భూముల్నే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పేదల పేరుతో అమరావతిపై కుట్ర చేయడానికే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అమరావతిని నిర్వీర్యం చేయడానికి పేదలను అడ్డం పెట్టుకుంటున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ధర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడానికి నిపుణులు అవసరం లేదని చెబుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రైతులకు పూర్తి స్థాయిలో.. నష్టపరిహారాన్ని దాదాపుగా 70 వేల కోట్ల వరకూ చెల్లిస్తే ఆ భూముల్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం వద్ద అంత వెసులుబాటు లేదు. అందుకే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వతా ఇస్తే విమర్శలకు చెక్ 

ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదు.  అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకోండి అని చెబితే ప్రజలు నమ్మరు. అందుకే కోర్టు తీర్పులు క్లియర్ అయిన తర్వాతే అమరావతి భూములు పంపిణీ చేస్తే ప్రభుత్వం నిజాయితీగా ఉందని ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయం వినిపస్తోంది. లేకపోతే పేదలు కూడా తమను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
Embed widget