అన్వేషించండి

Achennaidu : జగన్ నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తారు - ఎన్నికలకు సిద్దంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న పిలుపు !

ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అచ్చెన్నాయుడు అంచనా వేశారు. నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు జగన్ లెటర్ ఇస్తారని ఆయన జోస్యం చెప్పారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై అంతకంతకూ చర్చ పెరుగుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ( TDP ) ఈ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎప్పుడు పార్టీ నేతలతో సమావేశం జరిపినా ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సన్నద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిద్రలో లేచి ఎప్పుడైనా అసెంబ్లీని ( AP Assembly ) రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించవచ్చని జోస్యం చెప్పారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని ఎప్పుడైనా వస్తాయని రెడీాగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. 

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు రైతు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు (Achennaidu ) ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో గెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగుల ( Employees ) కారణంగానే ఓడిపోయామన్నారు. ప్రలోభాలాకో.. భయపడో ఉద్యోగులు లొంగిపోయారన్నారు. వివేకా హత్య తర్వాత వచ్చిన సానుభూతి కారణంగానే జగన్ సీఎం అయ్యారన్నారు. ఓ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత ఎప్పుడూ లేదని గుర్తు చేశారు.

రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న రైతులకు మేలు చేసే అన్ని పథకాలు నిలిపివేశారని కొత్త పథకాలేమీ అందరికీ అందడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతీ రైతునూ కలవాలని తెలుగురైతు ప్రతినిధులకు అచ్చెన్న సూచించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. రైతులకు ఉరితాళ్ళుగా మారిందన్నారు. దౌర్భాగ్య ముఖ్యమంత్రి హయాంలో రైతులకు యూరియా దొరకడం లేదని విమర్శించారు.

పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలపై కేసులు పెట్టారని.. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Goutham Sawang ) ఖాకీ బట్టలను మరిచి పోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెప్పిన పనులు చేసిన సవాంగ్‌ను అన్నా అంటూ సీఎం జగన్ సున్నం పెట్టారని అచ్చెన్నాయుడు సెటైర్లు పేల్చారు. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు రావొచ్చని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి టీడీపీ నేతలు మరింతగా ఆజ్యం పోస్తున్నారు . అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు రావని చెబుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget