అన్వేషించండి

3 Years of YSR Congress Party Rule : మూడు రాజధానులు టు రివర్స్ టెండరింగ్ - మూడేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ !

మూడేళ్ల పాలనలో సీఎం జగన్ సంచలన , వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మూడు రాజధానులు, రివర్స్ టెండరింగ్ వంటివి కీలకంగా ఉన్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మూడేళ్ల కాలంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అవి రాష్ట్ర గతినే మార్చేసేవి. అలాంటి వాటిలో మొదటిది మూడు రాజధానుల నిర్ణయం. అమరావతిని కేవలం న్యాయరాజధానిగా ఉంచి..విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గాచేయాలని తీసుకున్న నిర్ణయంతో జగన్ సంచలన నిర్ణయాలు ప్రారంభమయ్యాయి.

మూడు రాజధానుల నిర్ణయం ! 

రాష్ట్ర విభజన తర్వాత మొదటి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడింది. ఆ ప్రభుత్వం విస్తృత సంప్రదింపుల తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. ఆ సమయంలో రాజధానిగా అమరావతి వద్దు అని ఎవరూ చెప్పలేదు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ కూడా అమరావతిని స్వాగతించారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి  అవసరం కాబట్టి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు.  2020లో ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు.  విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా చేయాలని బిల్లులో పేర్కొన్నారు.  సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.   అమరావతికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే తర్వాత హైకోర్టులో కేసుల వల్ల ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు అమలులో లేదు. సంచలన నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకూ మూడు రాజధానుల వైపు అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.

అమరావతి పనుల నిలిపివేత !

మూడు రాజధానుల్లో ఒక రాజధానిగా అమరావతిని ఖరారు చేసినప్పటికీ.. అక్కడ జరుగుతున్న పనుల్ని ప్రభుత్వం నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  25 శాతంలోపు పూర్తయినవి మాత్రమే ఆపేయాలని గతంలో ఉత్తర్వులిచ్చింది. అయితే 80 శాతం పూర్తయినవి కూడా ఆపేశారు.  రాజధాని అమరావతి నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. ప్రముఖ సంస్థలు పలు నిర్మాణాలు చేపట్టాయి. 24 గంటలు, 50 వేల మంది కార్మికులు అక్కడ పనిచేసేవారు. కొన్ని సంస్థలు తాము దక్కించుకున్న కాంటాక్టు నిర్మాణాలను 50 నుంచి 75 శాతం వరకు పూర్తి చేశాయి. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేయాలని ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ. 45వేల కోట్ల వరకు భవన నిర్మాణాలతోపాటుగా పలు రహదారులు చేపట్టారు. వాటన్నింటిని ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత మూడు రాజధానులుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పనులు ఆపేశారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో స్వల్పంగా పనులు ప్రారంభించారు. 

 
కాంట్రాక్టుల రివర్స్ టెండర్లు !


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ను తమ విధానంగా ఎంచుకుంది. తెలుగుదేశం హయాంలో ఇచ్చిన టెండర్లన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అక్రమార్కుల తప్పుడు అంచనాలకు  అడ్డుకట్ట వేశారు.  ఫలితంగా రివర్స్‌​ టెండరింగ్‌ ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 5,070 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా నిలువరించగలిగామని ప్రభుత్వం ప్రకటించింది.  జాతీయ ప్రాజెక్టయిన పోలవరంతో రివర్స్‌ టెండరింగ్‌ మొదలు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు  మున్సిపల్, విద్య, వైద్య, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల్లో అమలు చేశారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి  రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1824.65 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఆదా చేయగలిగింది. ఏపీ టిడ్కోలో చేపట్టిన 12 పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా  రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా అయ్యింది. మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌టెండరింగ్‌లో రూ.811.32 కోట్లు మిగులు వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం. ఇలా అన్ని పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా భారీగా ఆదా చేశామని ప్రభుత్వం ప్రకటించింది. 


టీడీపీ హయాంలోపథకాల నిలిపివేత !

ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్న క్యాంటీన్లు,  చంద్రన్నబీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్యాదీవెన, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను నిలిపివేశారు. అయితే ప్రత్యామ్నాయ పథకాల ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ అలాంటివి జరగలేదు .  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
U19 Asia Cup 2025 IND vs PAK: భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
U19 Asia Cup 2025 IND vs PAK: భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
Nora Fatehi Car Accident: హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Embed widget