అన్వేషించండి

Sanatana Dharma row: నాకు పది రూపాయల దువ్వెన చాలు: ఉదయనిధి స్టాలిన్‌

Sanatana Dharma row: నాకు పది రూపాయల దువ్వెన చాలు అని బెదిరింపులపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్‌

తనకు ప్రాణ హాని ఉందని వస్తున్న బెదిరింపులపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ స్పందించారు. ఇలాంటి బెదిరింపులను తాను పట్టించుకోనని, తాను తమిళనాడు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ముందు వరుసలో నిల్చున్న వ్యక్తి మనవడినని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మం డెంగీ, మలేరియా, కరోనా లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సన్యాసి ఒకరు ఉదయనిధిని చంపితే పది కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఎవరైనా ఉదయనిధి తల నరికి తన దగ్గరికి తెస్తే రూ.10కోట్లు ఇస్తానని, ఎవ్వరికీ ఆయనను చంపే ధైర్యం లేకపోతే తానే చంపుతానని పరమహంస ఆచారన్య అనే సన్యాసి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఈయన అయోధ్యలోని తపస్వి చావ్ని అనే ఆలయ ప్రధాన పూజారి. 

కాగా ఉదయనిధి చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరమహంస ఆచార్య వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు నా తల తీయడానికి పది కోట్ల రూపాయలు ఇస్తానన్నారు కానీ నా తల దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన చాలు అంటూ వెల్లడించారు. ఆయన బెదిరింపులను అస్సలు పట్టించుకోననే దృష్టిలో మాట్లాడారు. తమిళంలో చాప్‌, స్లైస్‌ అనే పదాలకు జుట్టు దువ్వడం అనే అర్థం కూడా ఉంటుంది. ఈ భావనతో స్టాలిన్‌ అలా బదులిచ్చారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తమే కాదని, ఇలాంటి వాటికి తాము భయపడబోమని స్పష్టంచేశారు. తమిళనాడు కోసం తన తలను రైలు పట్టాలపై పెట్టిన వ్యక్తి మనవడినని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నేత ఎం కరుణానిధి మనవడు. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కరుణానిధి పెరియార్‌ ప్రారంభించిన హేతువాద, బ్రాహ్మణ వ్యతిరేక ద్రవిడ ఉద్యమానికి నాయకత్వం వహించారు.

కరుణానిధి రైలు పట్టాలపై పడుకున్న ఘటన 1953లో జరిగింది. సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న వ్యాపారవేత్త దాల్మియా కుటుంబం పేరుతో ఓ గ్రామం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలో డీఎంకే కార్యకర్తలు రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. ఆ ఘటన గురించి ఉదయనిధి ప్రస్తావించారు.

శనివారం చెన్నైలో తమిళనాడు రచయితలు, కళాకారుల సంఘం 'సనాతన నిర్మూలన' పేరిట నిర్వహించిన కార్యక్రమానికి డీఎంకే నేత ఉదయనిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం మలేరియా, డెంగీ , కరోనా లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నింటిని మనం వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా రూపుమాపాలని సంచలనంగా మాట్లాడారు. సనాతన ధర్మం సమాతనత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం అని, ప్రజలను కులాల పేరిట విభజించిందని పేర్కొన్నారు. మహిళలపై వివక్షను ప్రోత్సహించిందని అన్నారు. దాన్ని నిర్మూలించాల్సిందే అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఆయన మాటలను బీజేపీతోపాటు విశ్వహిందూపరిషత్‌, పలు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget