అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
టీఆర్ఎస్ ప్లీనరీ
1/22

టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్లో వేడుకగా ప్లీనరీ
2/22

ఇన్నేళ్లు పార్టీతో ట్రావెల్ చేసిన శ్రేణులకు, ప్రజలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
3/22

80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులు, 60 లక్షల మంది సభ్యులతో సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న టీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు కేసీఆర్.
4/22

హైదరాబాద్లో జరుగుతున్న ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ
5/22

వ్యవసాయంలో తెలంగాణ సాధించిన ప్రగతి చెబుతూనే కేంద్ర చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వ్యవసాయ తీర్మానాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రవేశ పెట్టారు.
6/22

తెలంగాణ మోడల్తో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పే తీర్మానాన్ని మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు.
7/22

ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేస్తున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ, ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ ఓ తీర్మానం చేసింది టీఆర్ఎస్..
8/22

చట్టసభల్లో మహిళలకు 33 శాంతి రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. తెలంగాణరాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
9/22

భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయిస్తూ మరో తీర్మానం చేసింది.
10/22

బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగమన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది టీఆర్ఎస్.
11/22

రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్రూపేణా వసూలు చేయడం మనుకోవాలనీ... డివిజబుల్ పూల్లోనే పన్నులను వసూలు చేయాలని తీర్మానం చేసింది.
12/22

నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్ణయించాలని.. ఈ మరేకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
13/22

భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరినకి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు.
14/22

తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
15/22

దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది
16/22

చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జి.ఎస్.టి.ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తీర్మానం చేసింది
17/22

స్వాతంత్ర్య ఫలాలు పూర్తిగా ప్రజలకు లభించడం లేదు. పెడధోరణులు ప్రబలిపోతున్నాయి. దేశంలో కొన్ని అవాంఛితమైన, అనారోగ్యకరమైన పోకడలు చూస్తున్నాము
18/22

ఒక రాజకీయ పార్టీగా దేశ అభ్యున్నతి కోసం కీలక నిర్ణయం తీసుకోవాలి. దేశంలో 4 లక్షల మెగావాట్లు విద్యుత్ శక్తి ఉంటే ఏ ఒక్క రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్ వాడడం లేదు
19/22

ఆఖరికి గుజరాత్లో కూడా భయంకరమైన కరెంటు కోతలు ఉన్నాయి. దేశంలో కరెంటు కోతలు లేని రాష్ట్రమే లేదు.
20/22

చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా తెలంగాణ వెలుగుతోంది. తెలంగాణ అనుసరించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వడం లేదు
21/22

చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్త శుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అద్భుత అవకాశాలను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
22/22

దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని సీఎం కేసీఆర్ అన్నారు
Published at : 27 Apr 2022 02:14 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















