అన్వేషించండి
Chiranjeevi Ram Charan: మెగా మూమెంట్ - రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లేముందు అభిమానులతో చిరంజీవి, రామ్ చరణ్
Ayodhya Ram Mandir inauguration: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ వెళ్లనున్నారు. వాళ్లకు సెండాఫ్ ఇవ్వడానికి ఇంటికి భారీ ఎత్తున అభిమానులు వచ్చారు.
మెగాస్టార్ ఇంటి ముందు అభిమానుల కోలాహలం
1/7

శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని మర్యాదా పురుషోత్తముడు రాముని మందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆహ్వానాలు అందుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లనున్నారు. వాళ్లకు సెండాఫ్ ఇవ్వడానికి ఆదివారం రాత్రి మెగాస్టార్ ఇంటికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. తమ అభిమాన హీరోలు, తండ్రి తనయులను చూసి మురిసిపోయారు.
2/7

చలి, రాత్రిని సైతం లెక్క చేయకుండా ఇంటికి వచ్చిన అభిమానులకు చేతులెత్తి ఆత్మీయంగా నమస్కరిస్తున్న చిరంజీవి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లడానికి ఆయన ఎగ్జైటెడ్ గా ఉన్నారని సమాచారం. హనుమంతుడు అంటే మెగాస్టార్ చిరంజీవికి అపారమైన భక్తి అనేది ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ఆ హనుమంతుని గుండెల్లో కొలువైన రాముడు అన్నా అంతే భక్తి, గౌరవం.
Published at : 21 Jan 2024 10:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
లైఫ్స్టైల్
సినిమా
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















